Political News

ఈ ఆంధ్రా రాగమేంది కవితక్క.. యాద్రాదికి సారు చేసిందేంటి?

కొన్ని పాటలు కొన్ని సందర్భాలకే సూట్ అవుతాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ కవిత మర్చిపోతున్నారా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేళ అధికారాన్ని సొంతం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పదేళ్లు పాలన చేసిన నాటి సంగతుల్ని ఆమె మర్చిపోతున్నారా? లేదంటే.. మర్చిపోయినట్లుగా వ్యవహరిస్తున్నారా? అన్నదిప్పుడు ప్రశ్న. అధికారం చేజారితే భావోద్వేగ రాజకీయాలు మంచివే కానీ.. ప్రాంతాల పంచాయితీలు ఇప్పుడు అవసరమా? అన్నది ప్రశ్న.

తాజాగా ఆమె మాట్లాడుతూ ఒక కీలక వ్యాఖ్య చేశారు. ‘జయజయహే తెలంగాణ’ గీతానికి ఆంధ్రా వ్యక్తితో సంగీతం చేయిస్తారా? ఇది సరికాదు, తెలంగాణలో సంగీత దర్శకులు లేరా?’ అంటూ ప్రశ్నించిన వైనం తెలంగాణ ఉద్యమం వేళలో అయితే బాగుండేది. కానీ.. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే.. పదేళ్ల కేసీఆర్ పాలన ఒక చరిత్రలో కనిపిస్తూ ఉంటుంది. తిరుపతిని తలదన్నేలా యాదాద్రిని డెవలప్ చేస్తామని చెప్పిన కేసీఆర్.. తన హయాంలో యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణంలో రూపకర్తగా ఆంధ్రాకు చెందిన ఆనంద్ సాయిని ఎందుకు ఎంపిక చేసినట్లు? అన్న ప్రశకు కవిత ఏమని సమాధానం చెబుతారు?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో లేరని.. అందుకే ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆయన నిర్ణయాలు ఉండటం లేదన్న కవిత.. ముఖ్యమంత్రికి తెలంగాణ ఆత్మ లేదని విమర్శించటాన్ని చూసినప్పుడు రాజకీయంగా ఉన్న పంచాయితీ కనిపిస్తుంది. రాష్ట్ర ఏర్పాటు జరిగి పదేళ్లు పూర్తైన తర్వాత కూడా ఇంకా ఆ సెంటిమెంట్ ను రగల్చాలని చూడటం దేనికి నిదర్శనం? అంతవరకు ఎందుకు.. తెలంగాణ కలల ప్రాజెక్టుగా కేసీఆర్ అభివర్ణించే కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించిన సంస్థ మేఘా ఆంధ్రా ప్రాంతానికి చెందినదే కదా? మరి.. ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నట్లు? అని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది?

కొన్ని పనులకు ప్రాంతాలకు ముడిపెట్టటం సరికాదు. ప్రతిభ ఎక్కడ ఉండే అక్కడ ప్రోత్సహించాలే కానీ.. దానికి సెంటెమెట్ సెంట్ పూయటంలో అర్థం లేదన్నది మర్చిపోకూడదు.రాజకీయం చేసేందుకు చాలానే అంశాలు ఉన్నప్పటికీ.. వాటిని వదిలేసి.. ఇలాంటి లాజిక్ లేని అంశాల్ని తెర మీదకు తీసుకురావటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా సమంతను ఎందుకు ఎంపిక చేసినట్లు? ఆమెకు తెలంగాణకు ఏం సంబంధం ఉంది? ఆ మాటకు వస్తే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మహిళలు ఎవరూ లేరా? వారిని వదిలేసి.. తమిళనాడుకు చెందిన ఒక సినీ నటిని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసింది ఎవరు? ఇలా చూసుకుంటూ పోతే.. పదేళ్ల సారు పాలనలో తెలంగాణ ప్రాంతానికి సంబంధం లేని ఎంతో మందిని ఎంపిక చేసిన వైనాలు కనిపిస్తాయి. వాటికి సమాధానం చెప్పిన తర్వాత.. కవిత ఈ తరహా వాదనను వినిపిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

This post was last modified on March 16, 2025 6:37 pm

Share

Recent Posts

విజయ్ స్థానాన్ని భర్తీ చేస్తాడా?

తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…

35 minutes ago

విశ్వంభర వెళ్తున్న దారి సరైనదేనా

చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…

3 hours ago

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

3 hours ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

4 hours ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

4 hours ago

భోగాపురం టూ సింగపూర్… బాబు గారి దిల్ ఖుష్

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వ‌స‌తుల‌తో నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యం కార్య‌కలాపాలు ఆదివారం అర్ధ‌రాత్రి…

7 hours ago