Political News

ఏపీ బీజేపీ నేతలపై అధిష్ఠానం నిఘా

ఏపీ బీజేపీ నేతలు అక్కడి పాలక పక్షం వైసీపీతో అంటకాగుతున్నారన్న విమర్శలు ఎక్కువవుతున్నాయి. రాజకీయంగా పాలక పక్షం, ప్రధాన ప్రతిపక్షం రెండూ కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా మైలేజ్ పెంచుకోవడానికి పాలక పక్షాన్ని టార్గెట్ చేస్తుంది. కానీ, ఏపీలో మాత్రం పాలకపక్షం వైసీపీతో సమానంగా బీజేపీ కూడా ప్రధాన ప్రతిపక్షం టీడీపీని టార్గెట్ చేస్తోంది.

ప్రభుత్వపు తప్పొప్పులను ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వెళ్లడం మానేసి ప్రెస్ మీట్లు పెడుతూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన నేతృత్వంలోని గత ప్రభుత్వం చేసిన పనులను విమర్శిస్తూ రాజకీయంగా ముందుకు సాగాలనుకుంటోంది. టీడీపీ కూడా తమకు దూరంగా ఉన్న పార్టీయే అయినప్పటికీ ఆ పార్టీయే ప్రభుత్వంలో ఉందా అన్నట్లుగా ఏపీ బీజేపీ నేతలు వ్యవహరిస్తుండడం కేంద్రంలోని ఆ పార్టీ పెద్దల దృష్టికి వెళ్లిందట. పార్టీ సమావేశాలు, వ్యక్తిగత భేటీలు, వ్యక్తిగత సంభాషణలు, పార్టీ అంతర్గత కమ్యూనికేషన్లలోనూ అధిష్ఠానం దీన్ని చూచాయగా ఇప్పటికే ప్రస్తావించినప్పటికీ ఏపీ బీజేపీలోని చాలామంది నేతల తీరు మారకపోవడంతో అధిష్ఠానం వారిపై కన్నేసినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ఏపీలో పార్టీ పెద్దగా ఉన్న నేత, రాయలసీమకు చెందిన మరో నేత, దిల్లీలో మొన్నటివరకు పదవిలో ఉన్న ఒక నేత, దిల్లీలో ఉంటూ ఏపీ వ్యవహారాలు చూడాల్సి ఉన్నా జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏపీలోనే ఉంటూ సాక్షి పత్రికలో వైసీపీ అనుకూల వ్యాసాలు రాసుకుంటున్న ఒక నేతపై కేంద్రంలోని బీజేపీ పెద్దలు కన్నేసినట్లు తెలుస్తోంది.

దిల్లీ స్థాయిలో గళం విప్పే అవకాశం ఉన్న పదవిలో మొన్నటివరకు ఉన్న ఒక నాయకుడిని వైసీపీ బాగా చూసుకుందని.. విశాఖలో మంచి స్థిరాస్తి ప్యాకేజీ అందించిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం బీజేపీ దిల్లీ పెద్దల వరకు వెళ్లిందట. అక్కడి వరకు వెళ్లిందంటే ఇక్కడి వారే చేరవేశారని టాక్.

ఇక మరో నాయకుడు కూడా మనం అధికారంలోకి వస్తామో రామో వైసీపీ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని డిసైడై గోదావరి జిల్లాలలో ఉంటూ వైసీపీ నేతలతో చెట్టపట్టాలేసుకుంటున్నారట.

రాయలసీమకు చెందిన బీజేపీ నాయకుడు కూడా వచ్చే ఎన్నికల్లో బాగుంటే బీజేపీ నుంచి లేదంటే ఇతర పార్టీల నుంచి పోటీ చేయడానికి సరిపడా డబ్బులు కూడబెట్టుకునే పనిలో పడ్డారట. ఆయనైతే బీజేపీలో ఏం జరుగుతోందో తనకు తెలిసిన సమాచారమంతా వైసీపీ చెవిలో వేస్తున్నారట.

అయితే, వీరంతా తాము కళ్లు మూసుకుని పాలు తాగుండడం ఎవరూ చూడడం లేదనుకుంటున్నా కేంద్రంలోని బీజేపీ పెద్దలు మాత్రం లైవ్‌లో చూస్తున్నారని జరుగుతున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయి. దిల్లీ స్థాయిలో గళం విప్పే పదవి పోవడం ఈ లాలూచీల ఫలితమేనని రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.

This post was last modified on October 27, 2020 6:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

9 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

45 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

1 hour ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago