Movie News

బిగ్‍బాస్‍: అవుట్‍ అయినోళ్లు యమా డేంజర్‍!


‘బిగ్‍బాస్‍’ షోలో లెక్కలు ప్రతి వారానికీ మారిపోతుంటాయి. ఆడియన్స్ ఎవరిపై ఎందుకు చిరాకు పడతారో, ఎందుకని ఒకరిపై కోపం పెంచుకుంటారో, ఎవరిని ద్వేషిస్తారో, ఎందుకు ప్రేమిస్తారో చెప్పడం చాలా కష్టం. మొదటి మూడు వారాలలో అతి చేస్తోందని అసహ్యించుకున్న వాళ్లే పాపం ఒంటరిగా వుందంటూ ఏడవ వారంలో సింపతీ చూపిస్తుంటారు. ఈ గేమ్‍లో అతి కీలకమైన అంశం… ఎలిమినేటెడ్‍ కంటెస్టెంట్స్.

హౌస్‍లో మనకు ఏమి జరిగిందనేది రోజులో ఒక గంట మాత్రమే చూపిస్తారు. కానీ ఆ మిగతా టైమ్‍లో ఏమి జరుగుతుంది, ఎవరెలాంటి వాళ్లు అనేది ఎలిమినేట్‍ అయిన కంటెస్టెంట్ల ద్వారానే తెలుస్తుంది. ఆ ఇంటర్వ్యూలు ఫాలో అయ్యే కొద్దీ హౌస్‍లో వున్నవారిపై అభిప్రాయాలు మారిపోతూ వుంటాయి. అలాగే ఎలిమినేట్‍ అయిన కంటెస్టెంట్లకు అంతదాకా ఓటేసిన వాళ్లు ఇప్పుడు కొత్త వారికి ఓట్లు వేయడం మొదలు పెడతారు. ఈ స్వింగ్‍ ఎటు వెళుతుందనేది చాలా కీలకం అవుతుంది.

హౌస్‍లో జనం తగ్గే కొద్దీ బయట ఓటర్లు పెరుగుతూ వెళ్లాలి. ఎందుకంటే ఎలిమినేట్‍ అయిన కంటెస్టెంట్ల ఓట్లు లోపల వున్న వాళ్లు తమ వైపు తిప్పుకోగలగాలి. అప్పుడే విజేతగా నిలిచే వీలుంటుంది. బయటకు పోతున్న వారితో సమస్యలుంటే వాళ్లు వెళ్లే ముందే క్లియర్‍ చేసేసుకుంటే మంచిది. లేదంటే వాళ్లు బయటకు వచ్చి మరింత బ్యాడ్‍ చేసేసే ప్రమాదముంటుంది. మిగతా సీజన్ల కంటే ఈ స్వింగ్‍ ఓట్‍ ఈ సీజన్లో కీలకం కానుంది. ఎందుకంటే ఈసారి గ్యారెంటీ విన్నర్‍ అనిపించే ఒక్క పాపులర్‍ సెలబ్రిటీ కూడా లేకపోవడంతో ఎనిమిదవ వారంలోకి ఎంటరైనా కానీ ఇంకా ఎవరు విజేత అనేదానిపై క్లారిటీ రాలేదు.

This post was last modified on October 27, 2020 2:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఒకేసారి ఇన్ని సినిమాలు ఎందుక‌య్యా?

ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న‌ట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్య‌వ‌హారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమ‌లు రిలీజ‌య్యాయి. కానీ త‌ర్వాతి…

46 minutes ago

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

5 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

9 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

10 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

11 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

11 hours ago