తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికల పోలింగ్ ఈ నెల 20న జరగనుంది. అయితే.. ఈ ఎన్నికలు ఏపీలో మాదిరిగా ఏకగ్రీవం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తం ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఏకంగా 11 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. వీటిలో కాంగ్రెస్+సీపీఐ నుంచి నలుగురు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఒక్కరు ఉండగా.. మిగిలిన వారు ఇండిపెండెంట్లుగా రంగంలోకి దిగారు. దీంతో ఈ ఎన్నికల్లో ఓటు ఎటు పడుతుందన్నది ఆసక్తిగా మారింది.
మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచిన దాసోజు శ్రవణ్ విజయంపై నీలినీడలు కమ్ముకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి.. కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు.. ప్రస్తుతం న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారు. వారిని అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో వీరంతా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో ఈ అసమ్మతి ఎమ్మెల్యేల ఓటు బీఆర్ఎస్కు పడే అవకాశం తక్కువనే ఉంది.
మరోవైపు.. వీరి ఓట్లను సొంతం చేసుకునేందుకు ఇండిపెండెంట్లుగా రంగంలొకి దిగిన వారు ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు ఉన్న పరిచయాలను వాడుకుంటున్నారు. కానీ, కాంగ్రెస్పై మక్కువతో వారు ఆ పార్టీకే ఓటు వేసే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు జంపింగుల ఓట్లు ఎడు పడతాయన్న చర్చ సాగుతోం ది. ఏదేమైనా.. ఏపీలో అయినట్టుగా ఏకగ్రీవం కాకపోగా.. మరింత ఉత్కంఠ పోరు అయితే.. కొనసాగనుంది.
కేసీఆర్ ఏరికోరి ఎంచుకున్న దాసోజుకు మెజారిటీ ఓట్లు పడతాయా? లేదా ? అన్న చర్చ కూడా జోరుగానే సాగుతోంది. అయితే.. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం వరకు సమయం ఉండడంతో ఆ లోగా కొందరు తప్పుకొంటారని భావిస్తున్నారు. ఒకవేళ తప్పుకోకపోతే మాత్రం ఎమ్మెల్యే కోటా ఎన్నికలు ఈ సారి హాట్ హాట్గానే సాగనున్నాయి.
This post was last modified on March 11, 2025 1:43 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…