తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికల పోలింగ్ ఈ నెల 20న జరగనుంది. అయితే.. ఈ ఎన్నికలు ఏపీలో మాదిరిగా ఏకగ్రీవం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తం ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఏకంగా 11 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. వీటిలో కాంగ్రెస్+సీపీఐ నుంచి నలుగురు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఒక్కరు ఉండగా.. మిగిలిన వారు ఇండిపెండెంట్లుగా రంగంలోకి దిగారు. దీంతో ఈ ఎన్నికల్లో ఓటు ఎటు పడుతుందన్నది ఆసక్తిగా మారింది.
మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచిన దాసోజు శ్రవణ్ విజయంపై నీలినీడలు కమ్ముకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి.. కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు.. ప్రస్తుతం న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారు. వారిని అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో వీరంతా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో ఈ అసమ్మతి ఎమ్మెల్యేల ఓటు బీఆర్ఎస్కు పడే అవకాశం తక్కువనే ఉంది.
మరోవైపు.. వీరి ఓట్లను సొంతం చేసుకునేందుకు ఇండిపెండెంట్లుగా రంగంలొకి దిగిన వారు ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు ఉన్న పరిచయాలను వాడుకుంటున్నారు. కానీ, కాంగ్రెస్పై మక్కువతో వారు ఆ పార్టీకే ఓటు వేసే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు జంపింగుల ఓట్లు ఎడు పడతాయన్న చర్చ సాగుతోం ది. ఏదేమైనా.. ఏపీలో అయినట్టుగా ఏకగ్రీవం కాకపోగా.. మరింత ఉత్కంఠ పోరు అయితే.. కొనసాగనుంది.
కేసీఆర్ ఏరికోరి ఎంచుకున్న దాసోజుకు మెజారిటీ ఓట్లు పడతాయా? లేదా ? అన్న చర్చ కూడా జోరుగానే సాగుతోంది. అయితే.. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం వరకు సమయం ఉండడంతో ఆ లోగా కొందరు తప్పుకొంటారని భావిస్తున్నారు. ఒకవేళ తప్పుకోకపోతే మాత్రం ఎమ్మెల్యే కోటా ఎన్నికలు ఈ సారి హాట్ హాట్గానే సాగనున్నాయి.
This post was last modified on March 11, 2025 1:43 pm
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…