Political News

తెలంగాణ‌లో ర‌గ‌డ‌.. ఏపీలో ప్ర‌శాంతం.. విష‌యం ఏంటంటే!

ఏపీ, తెలంగాణ‌ల్లో గురువారం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ జ‌రుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నూ.. మూడు మూడు చొప్పున ఎమ్మెల్సీ స్థానాల‌కు పోలింగ్ సాగుతోంది. గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ స్థానానికి ప్ర‌క్రియ న‌డుస్తోంది. అయితే.. తెలంగాణ‌లో వివాదాలు చుట్టుముట్టాయి. ప‌లు చోట్ల బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల మ‌ధ్య విభేదాలు, కొట్లాట‌లు, నిర‌స‌న‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.

కానీ, ఏపీలో మాత్రం ఉద‌యం 12 గంట‌ల స‌మ‌యానికి అంతా ప్ర‌శాంతంగా సాగిపోతోంది. అంతేకాదు.. తెలంగాణ‌లో ఉద‌యం 12 గంట‌ల‌కు 22 శాతం పోలింగ్ న‌మోదు కాగా.. ఏపీలో 34 శాతం పోలింగ్ న‌మోదై న‌ట్టు అధికారులు తెలిపారు. అంతా బాగానే జ‌రుగుతోంద‌న్నారు. అయితే.. ఏపీలో ఓటు వేసేవారు మంద‌కొడిగా బూతుల‌కు వ‌స్తున్నారు. చాలా అంటే చాలా త‌క్కువ మంది ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు కృష్ణ‌జిల్లాలో 65 వేల మందికి పైగా ఓట‌ర్లు ఉన్నారు.

కానీ, ఉద‌యం 12 గంట‌ల స‌మ‌యానికి కేవ‌లం 11 వేల మంది మాత్ర‌మే ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఇది పోటీలో ఉన్న అభ్య‌ర్థుల‌కు స‌వాలుగా మారింది. పైగా పోటీ తీవ్రంగా ఉండ‌డంతో అభ్య‌ర్థులు మ‌థ‌న ప‌డుతున్నారు. ఇక‌, తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. ఓట‌ర్లు పోటెత్తుతున్నారు. క‌రీంన‌గ‌ర్‌లోని బూతుల వ‌ద్ద ఓట‌ర్లు బారులు తీరిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక‌, ఇక్క‌డ బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్ మ‌ధ్య ర‌గ‌డ చోటు చేసుకుంది.

మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాల్టీ పరిధిలోని తీగల్ పహాడ్ పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ -కాంగ్రెస్ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ పెడుతున్నారంటూ.. బీజేపీ నేత‌ల‌పై కాంగ్రెస్ నేత‌లు ఆరోపించారు. కాదు.. మీరే ప్ర‌లోభాల‌కు గురి చేస్తున్నారని బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఇది వివాదానికి దారి తీసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్ర‌మంలో బీజేపీ నేతపై ఎస్ఐ చేయి చేసుకున్నాడని కార్యకర్తలు ఆందోళన వ్య‌క్తం చేశారు. బీజేపీ కార్యకర్తలపై దూసుకెళ్ళిన కాంగ్రెస్ నేతలు.. వారితో బాహాబాహీకి దిగారు. దీనిని అదుపు చేసేందుకు పోలీసులు స్వ‌ల్ప లాఠీచార్జీ చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 27, 2025 1:52 pm

Share

Recent Posts

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

2 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

3 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

5 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

6 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

7 hours ago

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

9 hours ago