Political News

తెలంగాణ‌లో ర‌గ‌డ‌.. ఏపీలో ప్ర‌శాంతం.. విష‌యం ఏంటంటే!

ఏపీ, తెలంగాణ‌ల్లో గురువారం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ జ‌రుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నూ.. మూడు మూడు చొప్పున ఎమ్మెల్సీ స్థానాల‌కు పోలింగ్ సాగుతోంది. గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ స్థానానికి ప్ర‌క్రియ న‌డుస్తోంది. అయితే.. తెలంగాణ‌లో వివాదాలు చుట్టుముట్టాయి. ప‌లు చోట్ల బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల మ‌ధ్య విభేదాలు, కొట్లాట‌లు, నిర‌స‌న‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.

కానీ, ఏపీలో మాత్రం ఉద‌యం 12 గంట‌ల స‌మ‌యానికి అంతా ప్ర‌శాంతంగా సాగిపోతోంది. అంతేకాదు.. తెలంగాణ‌లో ఉద‌యం 12 గంట‌ల‌కు 22 శాతం పోలింగ్ న‌మోదు కాగా.. ఏపీలో 34 శాతం పోలింగ్ న‌మోదై న‌ట్టు అధికారులు తెలిపారు. అంతా బాగానే జ‌రుగుతోంద‌న్నారు. అయితే.. ఏపీలో ఓటు వేసేవారు మంద‌కొడిగా బూతుల‌కు వ‌స్తున్నారు. చాలా అంటే చాలా త‌క్కువ మంది ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు కృష్ణ‌జిల్లాలో 65 వేల మందికి పైగా ఓట‌ర్లు ఉన్నారు.

కానీ, ఉద‌యం 12 గంట‌ల స‌మ‌యానికి కేవ‌లం 11 వేల మంది మాత్ర‌మే ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఇది పోటీలో ఉన్న అభ్య‌ర్థుల‌కు స‌వాలుగా మారింది. పైగా పోటీ తీవ్రంగా ఉండ‌డంతో అభ్య‌ర్థులు మ‌థ‌న ప‌డుతున్నారు. ఇక‌, తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. ఓట‌ర్లు పోటెత్తుతున్నారు. క‌రీంన‌గ‌ర్‌లోని బూతుల వ‌ద్ద ఓట‌ర్లు బారులు తీరిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక‌, ఇక్క‌డ బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్ మ‌ధ్య ర‌గ‌డ చోటు చేసుకుంది.

మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాల్టీ పరిధిలోని తీగల్ పహాడ్ పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ -కాంగ్రెస్ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ పెడుతున్నారంటూ.. బీజేపీ నేత‌ల‌పై కాంగ్రెస్ నేత‌లు ఆరోపించారు. కాదు.. మీరే ప్ర‌లోభాల‌కు గురి చేస్తున్నారని బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఇది వివాదానికి దారి తీసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్ర‌మంలో బీజేపీ నేతపై ఎస్ఐ చేయి చేసుకున్నాడని కార్యకర్తలు ఆందోళన వ్య‌క్తం చేశారు. బీజేపీ కార్యకర్తలపై దూసుకెళ్ళిన కాంగ్రెస్ నేతలు.. వారితో బాహాబాహీకి దిగారు. దీనిని అదుపు చేసేందుకు పోలీసులు స్వ‌ల్ప లాఠీచార్జీ చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 27, 2025 1:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

7 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

51 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago