Political News

తెలంగాణ‌లో ర‌గ‌డ‌.. ఏపీలో ప్ర‌శాంతం.. విష‌యం ఏంటంటే!

ఏపీ, తెలంగాణ‌ల్లో గురువారం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ జ‌రుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నూ.. మూడు మూడు చొప్పున ఎమ్మెల్సీ స్థానాల‌కు పోలింగ్ సాగుతోంది. గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ స్థానానికి ప్ర‌క్రియ న‌డుస్తోంది. అయితే.. తెలంగాణ‌లో వివాదాలు చుట్టుముట్టాయి. ప‌లు చోట్ల బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల మ‌ధ్య విభేదాలు, కొట్లాట‌లు, నిర‌స‌న‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.

కానీ, ఏపీలో మాత్రం ఉద‌యం 12 గంట‌ల స‌మ‌యానికి అంతా ప్ర‌శాంతంగా సాగిపోతోంది. అంతేకాదు.. తెలంగాణ‌లో ఉద‌యం 12 గంట‌ల‌కు 22 శాతం పోలింగ్ న‌మోదు కాగా.. ఏపీలో 34 శాతం పోలింగ్ న‌మోదై న‌ట్టు అధికారులు తెలిపారు. అంతా బాగానే జ‌రుగుతోంద‌న్నారు. అయితే.. ఏపీలో ఓటు వేసేవారు మంద‌కొడిగా బూతుల‌కు వ‌స్తున్నారు. చాలా అంటే చాలా త‌క్కువ మంది ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు కృష్ణ‌జిల్లాలో 65 వేల మందికి పైగా ఓట‌ర్లు ఉన్నారు.

కానీ, ఉద‌యం 12 గంట‌ల స‌మ‌యానికి కేవ‌లం 11 వేల మంది మాత్ర‌మే ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఇది పోటీలో ఉన్న అభ్య‌ర్థుల‌కు స‌వాలుగా మారింది. పైగా పోటీ తీవ్రంగా ఉండ‌డంతో అభ్య‌ర్థులు మ‌థ‌న ప‌డుతున్నారు. ఇక‌, తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. ఓట‌ర్లు పోటెత్తుతున్నారు. క‌రీంన‌గ‌ర్‌లోని బూతుల వ‌ద్ద ఓట‌ర్లు బారులు తీరిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక‌, ఇక్క‌డ బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్ మ‌ధ్య ర‌గ‌డ చోటు చేసుకుంది.

మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాల్టీ పరిధిలోని తీగల్ పహాడ్ పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ -కాంగ్రెస్ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ పెడుతున్నారంటూ.. బీజేపీ నేత‌ల‌పై కాంగ్రెస్ నేత‌లు ఆరోపించారు. కాదు.. మీరే ప్ర‌లోభాల‌కు గురి చేస్తున్నారని బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఇది వివాదానికి దారి తీసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్ర‌మంలో బీజేపీ నేతపై ఎస్ఐ చేయి చేసుకున్నాడని కార్యకర్తలు ఆందోళన వ్య‌క్తం చేశారు. బీజేపీ కార్యకర్తలపై దూసుకెళ్ళిన కాంగ్రెస్ నేతలు.. వారితో బాహాబాహీకి దిగారు. దీనిని అదుపు చేసేందుకు పోలీసులు స్వ‌ల్ప లాఠీచార్జీ చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 27, 2025 1:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విస్మయపరిచే ‘రామ’ పరిచయం

బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…

1 hour ago

ఒకవేళ జగన్ వస్తే రాజధాని మారుతుందా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధ‌త క‌ల్పించే ల‌క్ష్యంతో గ‌త నెల 28న ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేకంగా భేటీ అయి.. దీనిపై…

2 hours ago

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

6 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

8 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

12 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

12 hours ago