Political News

తెలంగాణ రైజింగ్‌ను ఎవ‌రూ ఆప‌లేరు: రేవంత్‌

తెలంగాణ అభివృద్ధిని ఎవ‌రూ ఆప‌లేర‌ని, 1 ట్రిలియ‌న్ డాల‌ర్ల జీడీపీగా రాష్ట్రాన్ని మారుస్తామ‌ని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ విష‌యంలో త‌న వ్యూహాలు త‌న‌కు ఉన్నాయ‌ని చెప్పారు. తాజాగా హెచ్ సీఎల్ కొత్త క్యాంప‌స్ ప్రారంభోత్స‌వంలో సీఎం రేవంత్ తెలిపారు. “గ‌తంలో రాష్ట్రాన్ని1ట్రిలియ‌న్ డాల‌ర్ల జీడీపీగా మారుస్తాన‌ని చెప్పిన‌ప్పుడు.. కొందరు ఎద్దేవా చేశారు. కాయ‌లున్న చెట్టుకే రాళ్లు ప‌డ‌తాయ‌ని అన్న‌ట్టుగా.. ప‌నిచేసే ప్ర‌భుత్వంపైనే విమ‌ర్శ‌లు వ‌స్తాయి. అయినా.. మేం ప‌నిచేసుకుంటూ పోతున్నాం. ఖ‌చ్చితంగా 1 ట్రిలియ‌న్ డాల‌ర్ల జీడీపీ సాధిస్తాం” అని స్ప‌ష్టం చేశారు.

గ‌తానికి మించి..

గ‌తంలో ఉన్న ప్ర‌భుత్వానికి మించి తాము పెట్టుబ‌డులు తెచ్చామ‌ని సీఎం రేవంత్ తెలిపారు. తాము అధికారంలోకి వ‌చ్చిన 15 మాసాల్లోనే రెండుసార్లు దావోస్‌లో పెట్టుబ‌డుల స‌ద‌స్సు జ‌రిగింద‌ని.. రెండు సార్లు కూడా భారీ ఎత్తున పెట్టుబడుల‌ను తీసుకువ‌చ్చామ‌ని వివ‌రించారు. ఒక‌సారి 41వేల కోట్లు, రెండో సారి.. ఇటీవ‌ల జ‌రిగిన ప్ర‌పంచ పెట్టుబ‌డుల స‌ద‌స్సులో 1.78 ల‌క్ష‌ల కోట్లు సాధించామ‌న్నారు. ఇవ‌న్నీ త్వ‌ర‌లోనే సాకారం అవుతాయ‌ని తెలిపారు. త‌ద్వారా.. 1 ట్రిలియ‌న్ డాల‌ర్ల జీడీపీ సాకారం అవుతుంద‌ని చెప్పారు.

క‌నీవినీ ఎరుగ‌ని..

రాష్ట్రంలో క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో ఉద్యోగాల క‌ల్ప‌న‌కు ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు సీఎం చెప్పారు. గ‌తంలో ప‌ది మందికి ఉద్యోగం ఇవ్వాలంటేనే ఏళ్లు ప‌ట్టేద‌ని.. బీఆర్ఎస్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. కానీ, తాము వ‌చ్చాక 55 వేల మందికి 15 నెల‌ల స్వ‌ల్ప‌కాలంలోనే ఉద్యోగాలు ఇచ్చి.. దేశానికే ఆద‌ర్శంగా నిలిచామ‌న్నారు. “తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు. మా పోటీ ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి న‌గ‌రాల‌తో కాదు.. ప్ర‌పంచ దేశాల‌తోనే” అని రేవంత్ ఉద్ఘాటించారు.

విద్యుత్ వాహ‌నాల త‌యారీ, ఉత్ప‌త్తిలో హైద‌రాబాద్‌ను నెంబ‌ర్ 1 చేసినట్ట తెలిపారు. దీంతో హ‌రిత ఇంధ‌నం, బ‌యో సాంకేతిక‌త అందుబాటులోకి వ‌చ్చాయ‌న్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ కంపెనీల్లో ఒకటైన ఆమ్జెన్‌ను ఇటీవలే ప్రారంభించిన విష‌యాన్ని సీఎం రేవంత్ ప్ర‌స్తావించారు.

Satya

Recent Posts

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

20 minutes ago

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

52 minutes ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

3 hours ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

8 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

9 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

11 hours ago