Political News

జగన్ కాదు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ తన రాజకీయ ప్రత్యర్థులకు అసలు ఊపిరి తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదనే చెప్పాలి. గతంలో మాదిరిగా ఒకింత స్వరం పెంచి మాట్లాడటానికి స్వస్తి చెప్పిన లోకేశ్… సుతిమెత్తగానే ప్రత్యర్థులకు చురకలు అంటిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మొదలు అయ్యింది. ఇందులో భాగంగా శాసనమండలిలో వైసీపీ సభ్యురాలు వరుదు కల్యాణి ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులకు సమాధానం చెప్పేందుకు సహచర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత, సవితలతో కలిసి లోకేశ్ మండలికి వచ్చారు.

ఈ సందర్భంగా ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ… కేంద్రానికి తన మద్దతు ఉపసంహరిస్తే మోదీ సర్కారు ఏపికి ఏం చేయాలన్నా చేస్తుందని తెలిపారు. అంతటి మంచి అవకాశాన్ని కూటమి సర్కారు ఎందుకు వినియోగించుకోలేకపోతోందని కూడా ఆమె ప్రశ్నించారు. ఈ సందర్భంగా కల్యాణి వ్యాఖ్యలకు అభ్యంతరం చెప్పిన లోకేశ్… తాము ఎన్డీఏతో ఎన్నికలకు ముందే కలిశామని తెలిపారు. ఏపీకి అండగా నిలవాలన్న ఏకైన అజెండాతోనే అన్ కండీషనల్ మద్దతును బీజేపీకి ఇచ్చామని తెలిపారు. అలాంటప్పుడు టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తామని ఎలా బెదిరింపులకు దిగుతామని ఆమెను నిలదీశారు. అయినా పార్టీల మధ్య పొత్తుల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్న లోకేశ్… వైసీపీ అధికారంలో ఉండగా రాష్ట్రానికి ఏం ఒరగబెట్టిందని ప్రశ్నించారు.

2019 ఎన్నికల్లో వైసీపీకి 22 ఎంపీ సీట్లను రాష్ట్ర ప్రజలు ఇస్తే ఏం చేశారని లోకేశ్ విపక్షాన్ని ప్రశ్నించారు. నాడు సరిపడినన్ని ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచుతానన్న మీ పార్టీ అధినేత జగన్… ఎన్నికల తర్వాత ఏం చేశారని ఆయన నిలదీశారు. ఈ సందర్భంగా జగన్ పేరును లోకేశ్ ప్రస్తావించలేదు. జగన్ ను ఆయన పులివెందుల ఎమ్మెల్యే అంటూ ప్రస్తావించారు. ఆ తర్వాత కూడా అవసరం వచ్చినా కూడా లోకేశ్… జగన్ పేరునే ప్రస్తావించకపోవడం గమనార్హం. పులివెందుల ఎమ్మెల్యే అంటూ జగన్ ను ప్రస్తావిస్తున్న లోకేశ్.. వైసీపీకి ఇకపై ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నట్లుగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సభకు వెన్ను చూపి పారిపోయిన నేతగా జగన్ ను పరిగణిస్తున్న లోకేశ్.. ఆయన పేరును నేరుగా ప్రస్తావించడానికి కూడా ఇస్టపడటం లేదని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.

This post was last modified on February 25, 2025 1:29 pm

Share

Recent Posts

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

2 hours ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

3 hours ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

3 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

3 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

4 hours ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

6 hours ago