వచ్చే నెల మార్చి 22 జపాన్ దేశంలో దేవర విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లు మొదలుపెట్టిన టీమ్ స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ నే రంగంలోకి దింపింది. గత ఏడాది సెప్టెంబర్ లో రిలీజైన ఈ బ్లాక్ బస్టర్ తెలుగు, హిందీ వెర్షన్లలో భారీ విజయం నమోదు చేసుకుంది. ఓవర్సీస్ లోనూ పెద్ద నెంబర్లు కనిపించాయి. అరవింద సమేత వీరరాఘవ తర్వాత సోలో హీరోగా వచ్చిన సుదీర్ఘమైన గ్యాప్ కు న్యాయం చేకూరుస్తూ తారక్ అభిమానులను సంతృప్తి పరిచాడు. వెయ్యి కోట్ల మార్కు అందుకోలేకపోయినా అర సహస్రం దాటేయడం చిన్న విషయం కాదు. చాలా చోట్ల పాత రికార్డులు బద్దలయ్యాయి.
జపాన్ మీద దేవర ఇంత ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి కారణముంది. యాక్షన్, ఎమోషన్, ఎలివేషన్, మ్యూజిక్ ఈ నాలుగు అంశాలు బాలన్స్డ్ గా ఉన్న భారతీయ సినిమాలకు ఆ దేశంలో చాలా ఆదరణ ఉంటుంది. ఇప్పటి దాకా టాప్ 1 స్థానంలో ఆర్ఆర్ఆర్ ఉండగా ఆ తర్వాత ముత్తు, బాహుబలి 2, త్రి ఇడియట్స్, ఇంగ్లీష్ వింగ్లిష్, మగధీర, రోబో, ధూమ్ 3, భజరంగి భాయ్ జాన్, పఠాన్, సలార్ లాంటి సూపర్ హిట్లు చాలానే ఉన్నాయి. సో దేవరని కనక సరైన రీతిలో జనంలోకి తీసుకెళితే వసూళ్ల మేజిక్ చేయొచ్చు. అందుకే జూనియర్ అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
నెట్ ఫ్లిక్స్ లో కొన్ని వారాల పాటు ట్రెండింగ్ లో ఉన్న దేవర ఇప్పటిదాకా జపాన్ కు ఏ రూపంలోనూ వెళ్ళలేదు. అక్కడ పైరసీ నిషేధం. మిగిలిన దేశాల ఓటిటిలో దొరికే కంటెంట్ అంతా అక్కడ దొరకదు. మొత్తం ప్రభుత్వం నియంత్రణ, అనుమతులకు లోబడే ఉంటుంది. అందుకే ఎంత లేట్ అయినా సరే మన బ్లాక్ బస్టర్స్ జపాన్ లో రిలీజయ్యేందుకు ఉత్సాహం చూపిస్తుంటాయి. ఇటీవలే కల్కి 2898 ఏడికి అక్కడ ఆశించిన ఫలితం దక్కలేదు. విజువల్ ఎఫెక్ట్స్ ఆధిపత్యం కాబట్టి జపాన్ జనాలకు అంతగా నచ్చలేదు. కానీ దేవరలో ఆ సమస్య లేదు. బలమైన కథా కథనాలున్నాయి. చూడాలి ఎలాంటి ఆదరణ దక్కుతుందో.
This post was last modified on February 25, 2025 12:45 pm
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…