రాబోయే జూన్ 1 నుంచి తమ రాష్ట్ర సినీ పరిశ్రమను స్ట్రైక్ రూపంలో స్థంబింపజేయాలని నిర్ణయం తీసుకున్న కేరళ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ పెద్ద ఇరకాటంలో పడేలా ఉంది. దీనికి ఎంత మాత్రం మద్దతు ఇచ్చేది లేదంటూ మళయాలం మూవీ ఆర్టిస్ట్స్ సంఘం (అమ్మ) తేల్చి చెప్పడంతో వ్యవహారం వాడివేడిగా మారిపోయింది. నటీనటుల పారితోషికాలు, పన్ను విధానాలు భారంగా మారాయని, వీటికి పరిష్కారం కనుగొనేంత వరకు ఎక్కడిక్కడ షూటింగ్స్ ఆపేస్తామని కమిటీ తరఫున సురేష్ కుమార్ గతంలోనే ప్రకటించారు. మమ్ముట్టి, మోహన్ లాల్ తదితరులంతా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఇలా చేయడం వల్ల వేలాది కార్మికుల జీవనోపాధికి అడ్డు తగిలినట్టు అవుతుందని, అందువల్ల సపోర్ట్ చేయలేమంటూ, పైగా కొందరు ప్రొడ్యూసర్ల స్వార్థ పూరిత ఆలోచనలను సమర్ధించమని చెప్పడంతో వివాదం కొత్త మలుపు తిరుగుతోంది. సరే ప్రస్తుతానికి ఇది మల్లువుడ్ సమస్యగానే కనిపిస్తున్నప్పటికీ అందరూ ఆలోచించాల్సిన విషయాలు ఇందులో కొన్ని ఉన్నాయి. ఇచ్చేవాడు ఉన్నాడు కాబట్టే తీసుకునేవాడు రేట్ పెంచడం అనేది ప్రతి వ్యాపారంలో ఉన్నదే. కాయగూరల దగ్గర నుంచి ఖరీదైన కార్ల దాకా అందరిదీ ఇదే సూత్రం.కొనేవాడు లేకపోతే ఐఫోన్ లక్షకు పైనే ఎందుకుంటుంది.
అలాంటప్పుడు మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా హీరో హీరోయిన్లు రెమ్యునరేషన్లు తీసుకుంటారు. ఒకవేళ అది ఎక్కువనిపిస్తే వద్దనుకుని వేరే ఆప్షన్ చూసుకునే స్వాతంత్రం ప్రొడ్యూసర్ కు ఎప్పుడూ ఉంటుంది. అలా కాకుండా ఇలా స్ట్రైక్ లకు దిగడం ఏమిటనేది ఆర్టిస్టుల వాదన. సొమ్ము తగ్గించుకుంటే మరిన్ని ఎక్కువ సినిమాలు తీస్తామనేది నిర్మాతల వెర్షన్. అయినా కంటెంట్ ఆధారంగా తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీసే కేరళలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ వాటిని తట్టుకుని నిలబడటం చూస్తే గ్రేటే అనిపిస్తుంది. అయినా లోగుట్టు పెరుమాళ్ళకెరుకని ఏ ఇబ్బందులు ఎవరికి తెలుసని.
This post was last modified on February 25, 2025 2:02 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…