ఐపీఎల్ ఫైనల్స్ లో ఆర్సీబీ వరుసగా రెండోసారి కప్పు గెలవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ ఆనందం శృతిమించి పబ్లిక్ న్యూసెన్స్ గా మారింది. హైదరాబాద్, కర్నూలు లాంటి నగరాల్లో కొందరు తెలుగు యువకులు రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. హైదరాబాద్ లో బారికేడ్లను ఇష్టమొచ్చినట్లు పడేసి బీభత్సం చేయడంతో, పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. కర్నూలులో కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ రోడ్ల మీద పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసి తమ పైత్యాన్ని చాటుకున్నారు.
ఆర్సీబీ మొదటిసారి కప్పు గెలిచినప్పుడు బెంగుళూరు స్టేడియంలో జరిగిన సెలబ్రేషన్స్ లో తొక్కిసలాట జరిగి ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ చేదు సంఘటన నుంచి పాఠాలు నేర్చుకోవాల్సింది పోయి, ఇప్పుడు రెండోసారి కప్పు కొట్టగానే కొందరు ఫ్యాన్స్ మళ్లీ వీధుల్లోకి వచ్చి పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం చాలా దారుణం. నిజానికి గ్రౌండ్ లో ప్లేయర్స్ ఎంతో కష్టపడి, చెమటోడ్చి ఆ ట్రోఫీలను గెలుస్తుంటారు. వాళ్ళు కప్పు కొడితే ఫ్యాన్స్ సంతోషించడం సహజమే. కానీ కొందరు హద్దులు మీరి ప్రవర్తిస్తూ సొంత టీమ్ కే చెడ్డపేరు తెస్తున్నారు.
కప్పు గెలిచిన వార్త కంటే, ఫ్యాన్స్ చేసిన ఈ అల్లరి వార్తలే ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. ప్లేయర్స్ పడ్డ కష్టమంతా ఇలాంటి చిల్లర వేషాల వల్ల పక్కదారి పడుతోంది. జట్టు మీద ఉన్న ప్రేమను చూపించడానికి ఇది సరైన పద్ధతి అస్సలు కాదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని యువత ఇలా పబ్లిక్ ప్రాపర్టీని నాశనం చేయడం అనేది అస్సలు హెల్తీ సెలబ్రేషన్ అనిపించుకోదు. అభిమాన జట్టు గెలిచిందన్న ఆనందాన్ని పది మందితో పంచుకోవాలి కానీ, ఇలా రోడ్ల మీదకు వచ్చి సామాన్యులను ఇబ్బంది పెడుతూ ఆస్తులు ధ్వంసం చేయడం ఎవరికి లాభం? ఈ అతి ప్రవర్తన వల్ల పోలీసుల దెబ్బలు తినడం, కేసులు ఎదుర్కోవడం తప్ప సాధించేది ఏమీ ఉండదు.
అభిమానం అనేది పాజిటివ్ గా ఉండాలి కానీ, పబ్లిక్ కు ప్రాబ్లమ్ అయ్యేలా ఉండకూడదు. ఫ్యాన్స్ కోసం ప్రాణం పెట్టి ఆడుతూ, కప్పులు గెలిచి ఇస్తున్న ఆ జట్టు ప్లేయర్స్ కోసమైనా సరే ఇలాంటి డిజాస్టర్ సెలబ్రేషన్స్ ఆపేయాలి. ఒక ట్రోఫీ గెలిచిన మూమెంట్ ను ఎంజాయ్ చేస్తూ మంచి జ్ఞాపకంగా మిగిల్చుకోవాలి తప్ప, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఆటను ఆటలా చూస్తూ, బాధ్యత గల ఫ్యాన్స్ గా ప్రవర్తిస్తేనే ఆ జట్టుకు కూడా అసలైన గౌరవం దక్కుతుందని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
This post was last modified on June 1, 2026 11:16 am
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…
యూట్యూబ్లో వెబ్ సిరీస్లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…
తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…