Political News

కిడ్నాప్ తర్వాత వంశీ ‘తాడేపల్లి’ వెళ్లారా..?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు సంబంధించిన అంశాలు ఒక్కటొక్కటిగానే వెలుగులోకి వస్తూ అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్ పైనే గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీ… ఆ తర్వాత అధికార పార్టీగా ఉన్న వైసీపీకి దగ్గరైపోయారు. జగన్ ఆదేశాలు జారీ చేశారో… లేదంటే జగన్ వద్ద మార్కులు కొట్టేయడానికి వంశీనే చేశారో తెలియదు గానీ… గన్నవరం టీడీపీ కార్యాలయంపై ఆయన తన అనుచరులతో దాడి చేయించారు.

ఈ ఘటనను సీరియస్ గా పరిగణించిన టీడీపీ… తాను అధికారంలోకి రాగానే.. ఆ కేసును తిరగదోడింది. అయితే కేసు నుంచి బయటపడే దిశగా పావులు కదిపిన వంశీ… ఈ కేసులో ప్రధాన ఫిర్యాదుదారుడిగా ఉన్న టీడీపీ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ ముదునూరి సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసి.. బెదిరించి, డబ్బులు ఇస్తామని ఆశ చూపి కేసు విత్ డ్రా చేసుకునే దిశగా ఒప్పించారు.

సత్యవర్థన్ సోదరుడి ఫిర్యాదుతో వంశీపై కిడ్పాప్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. తాజాగా కోర్టు అనుమతితో మంగళవారం ఆయనను తమ కస్టడీలోకి తీసుకున్నారు. వరుసగా 3 రోజుల పాటు వంశీని పోలీసులు విచారించనున్నారు. ఇలాంటి సమయంలో వంశీకి సంబంధించిన ఓ విషయం వెలుగులోకి వచ్చింది.

సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లి… కేసు విత్ డ్రా చేసుకునే దిశగా అతడిని ఒప్పంచి… ఆపై అతడిని తన మనుషులతో విశాఖకు పంపించిన తర్వాత వంశీ ఒక్కరే… హైదరాబాద్ నుంచి నేరుగా తాడేపల్లి వెళ్లారట. తాడేపల్లిలో ఆయన జగన్ నివాసానికి వెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పక్కా ఆధారాలు అయితే పోలీసులకు ఇప్పటిదాకా లభించలేదు. విచారణలో భాగంగా వంశీ దీని గురించి చెబుతారా? లేదా? అన్నది వేచి చూడాలి.

సత్యవర్ధన్ ను విశాఖకు పంపిన తర్వాత వంశీ తన సెల్ ఫోన్ ను పలుమార్లు స్విచ్ ఆఫ్ చేసిన విషయాన్ని పోలీసులు గమనించారు. తన లొకేషన్ పోలీసులకు దొరకకుండా ఉండేందుకే వంశీ ఇలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని తన వ్యవహారాలను చక్కబెట్టుకున్నట్లుగా అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో కాస్తంత లోతుగా దర్యాప్తు చేయగా… హైదరాబాద్ లోని తన ఇంటి నుంచి కారులో ఒంటరిగానే వంశీ బయలుదేరినట్లు పోలీసులకు ఫుటేజీ దొరికింది. ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్లారన్నది తెలియరాలేదు.

అయితే విశ్వసనీయ సమాచారం మేరకు సత్యవర్ధన్ విషయంలో ఎలా ముందుకు సాగాలి అన్న దానిపై సలహాల కోసమే ఆయన తాడేపల్లి వెళ్లినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వంశీ ఫొన్ లొకేషన్ ను ఎలాగైనా వెలికి తీసి ఈ సీక్రెట్ టూర్ గుట్టును విప్పేందుకు పోలీసులు యత్నిస్తున్నట్లు సమాచారం.

This post was last modified on February 25, 2025 12:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

1 hour ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

1 hour ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago