Political News

`ఉండ‌వ‌ల్లి`కి ఛాన్స్ లేదా…?

రాజ‌కీయాల్లోకి రావ‌డం.. పోవడం.. అనేది నాయ‌కుల ఇష్టం. అయితే.. మారుతున్న కాలంలో.. నాయ‌కుల ఇష్టాల‌తో పాటు పార్టీల‌కు అవ‌స‌రాలు కూడా ముఖ్యంగా మారాయి. పార్టీల అవ‌స‌రం ఉంటేనే.. నాయ‌కుల‌కు ఎంట్రీ ఉంటోంది. రాజ‌కీయ‌, సామాజిక, ఆర్థిక ప‌రంగా పార్టీల‌కు ద‌న్నుగా మారుతున్న వారిని పార్టీలు ఎప్పుడూ వ‌దులుకునే ప‌రిస్థితిలేదు. ఉదాహ‌ర‌ణ‌కు ఏలూరులో వైసీపీనాయ‌కుడు ఆళ్ల నాని చేరిక విష‌యంలో టీడీపీలో త‌ర్జ‌న భ‌ర్జ‌న జ‌రిగింది. నిజానికి స్థానిక నాయ‌కులు పెద్ద‌గా ఇష్ట ప‌డ‌లేదు. దీంతో నాని చేరిక వ్య‌వ‌హారం.. ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా ప‌డింది.

అయిన‌ప్ప‌టికీ.. సామాజికంగా, ఆర్థికంగా కూడా నాని బెట‌ర్ అని భావించ‌డంతో చంద్ర‌బాబు చివ‌ర‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఆయ‌న చేరిక జ‌రిగిపోయింది. ఇక‌, వైసీపీలోనూ ఇలాంటి చేరిక‌లే ఉన్నాయి. ఇటీవ‌ల సాకే శైల‌జానాథ్ వైసీపీలో చేరారు. నిజానికి ఎవ‌రూ కూడా ఓడిపోయిన పార్టీలో చేరేందుకు సిద్ధ‌ప‌డ‌రు. కానీ, ఆయ‌న వ్యూహాలు వేరే ఉండ‌డంతో వైసీపీ కూడా ఎస్సీ సామాజిక వ‌ర్గం ఓట్ల‌ను దృష్టిలో పెట్టుకుని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. దీంతో సాకే ఫ్యాను కింద‌కు చేరిపోయారు. సో.. ఇటు నాయ‌కుల అవ‌స‌రం.. అటు పార్టీల అవ‌స‌రం రెండూక‌లిసి వ‌స్తే.. నేత‌ల చేరిక‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేందుకు పార్టీలు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాయి.

ఇక, మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న వైసీపీలో చేరుతున్నార‌న్న ప్ర‌చారం గ‌త రెండు వారాలుగా జోరుగా సాగింది. నిజానికి ఆయ‌న తిరిగి రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌న్న ప్ర‌చారం ఎప్ప‌టి నుంచో ఉంది. 2014లో రాష్ట్ర విభ‌జ‌న‌ను వ్య‌తిరేకిస్తూ.. ఆయ‌న రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు. ఆ త‌ర్వాత‌.. మౌనంగా ఉన్నా.. త‌ర్వాత త‌ర్వాత రాజ‌కీయ విశ్లేష‌కుడిగా మారారు. జ‌గ‌న్ హ‌యాంలో అయితే.. ఆయ‌న పాల‌న‌ను కూడా మెచ్చుకున్నారు. క‌రోనా స‌మ‌యంలో దేశంలోని ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ్డార‌ని.. కానీ, ఇక్క‌డ ఏపీలో మాత్రం ప్ర‌జ‌లు సేఫ్‌గా ఉన్నార‌ని.. ఆదాయాలు కూడా పెరిగాయ‌ని చెప్పారు.

ఈ ప‌రిణామాల‌తో జ‌గ‌న్ గూటికి ఉండ‌వ‌ల్లి చేరిపోతార‌ని అప్ప‌ట్లోనూ అనుకున్నారు. ఇక‌, తాజాగా సాకే శైల‌జానాథ్ వంటివారు చేర‌డంతో ఈ ప్ర‌చారానికి మ‌రింత ఊపొచ్చింది. అయితే… ఉండ‌వల్లి మాత్రం చేర‌లేదు. ఇక‌, టీడీపీలో చేరినా అభ్యంత‌రం లేని ఉండ‌వ‌ల్లికి మిత్రుడు, రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి మ‌రో బాంబు పేల్చారు. అయితే.. ఉండ‌వ‌ల్లి తాజాగా తాను ఏ పార్టీలోనూ చేర‌డం లేద‌న్నారు. వాస్త‌వానికి ఉండ‌వ‌ల్లి చేరుతారా? లేదా? అనేది ప‌క్క‌న పెడితే.. సామాజికంగా, ఆర్థికంగా కూడా..ఉండ‌వ‌ల్లికి రాజ‌కీయంగా పుంజుకునే అవ‌కాశం ఇప్పుడు లేదు. దీంతో పార్టీలు సైతం.. ఆయ‌న‌ను చేర్చుకునేందుకు పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌డం లేద‌న్న చ‌ర్చ ఉంది. అందుకే.. ఉండ‌వ‌ల్లికి ఛాన్స్ లేకుండా పోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on February 20, 2025 10:18 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

3 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

4 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

5 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

7 hours ago