Political News

లోకేశ్ గారూ… సరిరారు మీకెవ్వరూ!

రాజకీయాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ నవ శకానికి నాందీ పలికారు. నిన్నటిదాకా రాజకీయం అంటే… ఎన్నికలప్పుడే జనానికి నేతలు కనిపించే వారు. ఆ తర్వాత నేతలను వెతుక్కుంటూ జనం నానా పాట్లూ పడే వారు. ఆ పరిస్థితిని లోకేశ్ మార్చేశారు. తనను నమ్మిన జనానికి ఎంత చేసినా తక్కువేనని ఆయన భావించారు.

వారి బతుకులను అందలం ఎక్కించేందుకు ప్లాన్ రెడీ చేశారు. అధికారంలో ఉన్నది తన పార్టీ ప్రభుత్వమే అయినా… తన సొంత నిధులతో తన జనంలో వెలుగులు నింపాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం నిజంగానే లోకేశ్ ను ఏ ఒక్క రాజకీయ నేతకు అందనంత ఎత్తులో నిలిపింది.

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలోని మంగళగిరి నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని లోకేశ్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్లాన్ చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేసిన లోకేశ్ ఓటమిపాలయ్యారు. అయినా లోకేశ్ బాధపడలేదు. తన జనం చేతిలోనే కదా ఓడిపోయింది అనుకున్నారు. ఆపై మంగళగిరిలోనే తిష్ట వేశారు. ఇంటింటికీ దగ్గరయ్యారు.

ఈ క్రమంలో అదేంటీ… ఎన్నికలు లేకున్నా…లోకేశ్ తమ దగ్గరకు వస్తున్నారు అనే చర్చ జనంలో మొదలైంది. అంతే… లోకేశ్ లోని అసలు గుణాన్ని మంగళగిరి జనం అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. ఈలోగానే 2024 ఎన్నికలు రానే వచ్చాయి. తిరిగీ లోకేశ్ అక్కడే పోటీ చేశారు. గతంలో తప్పు చేశామని భావించిన మంగళగిరి జనం… ఈ దఫా లోకేశ్ ను రికార్డు మెజారిటీతో గెలిపించారు.

మంగళగిరి జనం తనను నమ్మారని గ్రహించిన లోకేశ్… వారి బాగు కోసం ఏదైనా చేయాలని తపించారు. ఇందులో భాగంగా అదిక జనాభాగా ఉన్న చేనేత కార్మికుల కోసం అంతర్జాతీయ స్థాయిలో చేనేత ఉత్పత్తుల సంఘాన్ని ఏర్పాటు చేసి… దాని భవనానికి స్థలాన్ని, ఆర్థిక వనరులను సమకూర్చారు. తాజాగా స్వర్ణకారుల జీవితాలను బాగు చేయడానికి లోకేశ్ కంకణం కట్టుకున్నారు.

ఈ చర్య అటు స్వర్ణకారులకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వడంతో పాటుగా రాష్ట్రానికి సిరులు కురిపించే దిశగా ఓ అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ప్రణాళికకు ప్రభుత్వం నుంచి తోడ్పాటు అందించే అవకాశం ఉన్నా…తొలుత తన సొంత నిధులతో ఈ ప్రణాళికను పట్టాలెక్కించాలని లోకేశ్ భావించారు. అనుకున్నదే తడవుగా ఆ ప్రణాళికను అమలులో పెట్టేశారు.

ఈ నయా ప్రణాళికలో భాగంగా మంగళగిరిలో వరల్డ్ క్లాస్ స్వర్ణాభరణాల తయారీ హబ్ ను ఏర్పాటు చేయనున్నారు. అది అంతిమ లక్ష్యం కాగా… దానికి దన్నుగా నిలిచే స్వర్ణకారుల శిక్షణను లోకేశ్ తన భుజస్కందాలపైకి ఎత్తుకున్నారు. గోల్డ్ హబ్ ఏర్పాటు కావడానికి ముందే స్వర్ణకారులను అంతర్జాతీయ స్థాయి వృత్తి నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దేందుకు ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేశారు. ఈ ఫౌండేషన్ లో ఇప్పటికే 77 మంది సభ్యులుగా చేరారు.

ఈ ఫౌండేషన్ కు గుంటి నాగరాజు, గాజుల శ్రీనివాసరావు, పడవల మహేశ్, మండవ హారికలతో డైరెక్టర్ల బోర్డును ఏర్పాటు చేశారు.ఈ ఫౌండేషన్ ద్వారా మంగళగిరిలోని 670 మంది స్వర్ణకారులకు ఉచితంగా శిక్షణ అందనుంది. అంతేకాకుండా శిక్షణ అనంతరం వీరికి ఆయా సంస్థల నుంచి వర్క్ ఆర్డర్లను ఇప్పించేందుకు కూడా ఫౌండేషన్ కృషి చేయనుంది. ఈ ఫౌండేషన్ వ్యవహారాలన్నీ లోకేశ్ సొంత నిధులతో నడవనున్నాయి.

This post was last modified on February 1, 2025 8:35 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

4 minutes ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

11 minutes ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

2 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

3 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago