వరస ఫ్లాపులతో సతమవుతున్నప్పుడు యూత్ హీరో కిరణ్ అబ్బవరంకు ‘క’ ఇచ్చిన బ్లాక్ బస్టర్ సక్సెస్ ఒక్కసారిగా మార్కెట్ ని నిలబెట్టింది. నిర్మాణంలో ఉన్న సినిమాలు వేగమందుకోవడంతో పాటు కొత్త ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం రెమ్యూనరేషన్ అయిదు కోట్ల దాకా పలుకుతోందని ఇండస్ట్రీ టాక్ ఉంది. అదెంత వరకు నిజమో కానీ కుర్రాడికి డిమాండ్ పెరిగిన మాట నిజమే.
తన కొత్త సినిమా దిల్ రుబా ఫిబ్రవరి 14 విడుదలకు రెడీ అవుతోంది. దానికి అనుగుణంగా ప్రమోషన్లలో డేట్ వేసుకుంటూ వచ్చారు. లిరికల్ వీడియోలోనూ అదే ఉంది. కానీ తాజా పరిణామాలు మనసు మార్చుకునేలా చేస్తున్నాయని సమాచారం.
చేతిలో ఉన్నది పదమూడు రోజులు. ఇంత తక్కువ గ్యాప్ లో పబ్లిసిటీతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్, బాలన్స్ పాటల రిలీజ్ పూర్తి చేయాలి. బయట కార్యక్రమాల్లో పాల్గొనాలి. బజ్ వచ్చేందుకు ఏదైనా వెరైటీగా డిజైన్ చేయాలి. పైగా వారం ముందు వస్తున్న తండేల్ కు కనక బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కనీసం రెండు వారాలు దాని దూకుడు ఉంటుంది.
తట్టుకోవడం అంత సులభం కాదు. పుష్ప 2 ది రూల్ సునామిలో చాలా సినిమాలు ఈ సమస్యను ఎదురుకుని కలెక్షన్లు రాబట్టుకోలేకపోయాయి. అందుకే తండేల్ గురించి సీరియస్ ఆలోచన చేస్తునట్టు తెలిసింది. దానికి తోడు విశ్వక్ సేన్ లైలా కూడా అదే రోజు వాయిదా లేకుండా దిగుతోంది.
ఈ పరిణామాలన్నీ చూస్తే దిల్ రుబా వాయిదా పడటం ఖాయమని ఇన్ సైడ్ న్యూస్. ఫిబ్రవరి చివరి వారంని నెక్స్ట్ ఆప్షన్ గా చూస్తున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవాళో రేపో రావొచ్చు. ఒకవేళ అదే ఫిబ్రవరి 14 డేట్ కి కట్టుబడితే మాత్రం ప్రచారాన్ని స్పీడప్ చేయాలి.
విశ్వ కరుణ్ దర్శకత్వం వహించిన దిల్ రుబాలో రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్ గా నటించింది. క, పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మంచి పేరు తెచ్చుకున్న సామ్ సిఎస్ మ్యూజిక్ మరోసారి పెద్ద ప్లస్ అవుతుందని కిరణ్ నమ్మకంగా ఉన్నాడు. ఆవేశంతో ఊగిపోయే కాలేజీ కుర్రాడిగా తన పాత్ర కాస్త డిఫరెంట్ గానే ఉంటుందట. చూడాలి.
This post was last modified on February 1, 2025 8:47 am
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…