ఏపీలో రాజకీయం అంతకంతకూ రసవత్తరంగా మారుతోంది. మొన్నటి ఎన్నికల్లో అందరి అంచనాలు తలకిందులు కాగా… ఆ విస్తుగొలిపే ఫలితాలకు అనుగుణంగానే రాజకీయంగానూ పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పుంగనూరులో కూటమి భాగస్వామ్య పార్టీ జనసేన రేపు ఓ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. పుంగనూరు పరిధిలోని సోమలలో ఈ సభకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
పెద్దిరెడ్డికి గట్టి పట్టు ఉన్న పుంగనూరులో జరుగుతున్న ఈ సభకు జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరు కావడం లేదు. అయితే ఆయన తరఫున పార్టీ కీలక నేత, పవన్ సోదరుడు నాగేంద్ర బాబు స్వయంగా ఈ సభకు హాజరవుతున్నారు. నాగబాబుతో పాటుగా తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న ఆరణి శ్రీనివాసులు, చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ లతో పాటు చిత్తూరు, తిరుపతి జిల్లాల పార్టీ కీలక నేతలు బారీ సంఖ్యలో పాలుపంచుంటున్నారు.
ఈ సభ ద్వారా పెద్దిరెడ్డి ఇలాకాలో జనసేనకు గ్రాండ్ ఎంట్రీ ఇప్పించాలన్నదే పవన్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే పుంగనూరులోనూ పార్టీ శ్రేణులు ఉన్నా… పెద్దిరెడ్డి వర్గం భయంతో అంతగా బయటకు రాలేకపోతున్నారన్న వాదనలు ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల పెద్దిరెడ్డి భూ ఆక్రమణలను పవన్ స్వయంగా బట్టబయలు చేయడంతో పాటుగా వాటిపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యేలా చేశారు. దీంతో పెద్దిరెడ్డి ఆత్మ రక్షణలో పడిపోయారు. ఇలాంటి కీలక తరుణంలో తన ఇలాకాలో జనసేన భారీ బహిరంగ సభ అంటే పెద్దిరెడ్డికి ఇబ్బందేనని విశ్లేషణలు సాగుతున్నాయి.
This post was last modified on February 1, 2025 9:14 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…