Political News

చంద్రబాబు… ‘బ్రాండ్ ఏపీ’కి బ్రాండ్

స్విట్జర్లాండ్ నగరం దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బ్రాండ్ ఏపీ నినాదంతో వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ టూర్ లో సీఎం నారా చంద్రబాబునాయుడితో పాటుగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఇతర అధికారుల బృందం ఏకంగా నాలుగు రోజుల పాటు దావోస్ లో పర్యటించింది. దావోస్ తో పాటు జూరిక్ లోనూ పలు సమావేశాలు ఏర్పాటు చేసిన చంద్రబాబు బృందం ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించింది. తాము అనుకున్న లక్ష్యాన్ని దిగ్విజయంగానే పూర్తి చేసింది.

అయితే దావోస్ లో ఇతర రాష్ట్రాలు పెద్ద ఎత్తున పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంటే చంద్రబాబు బృందం మాత్రం సింగిల్ పైసా పెట్టుబడులు తీసుకురాలేకపోయిందని విపక్షం వైసీపీ విమర్శించింది. అయితే తాము దావోస్ కు వెళ్లింది ఒప్పందాలు చేసుకోవడానికి కాదని…ఏపీలో పెట్టుబడులకు ఉన్నఅవకాశాలను ఆయా దేశాలు, కంపెనీలకు తెలియజేయడానికేనని చంద్రబాబు అండ్ కో ఆ విమర్శలను సమర్థంగానే తిప్పికొట్టింది. అంతేకాకుండా దావోస్ అంటే పెట్టుబడుల ఒప్పందాలు జరిగే ప్రదేశమనే భావన తప్పని… పెట్టుబడులకు గల అవకాశాలపై అన్వేషణ జరిగే ప్రదేశంగా దానిని భావించాలని తెలిపింది.

దావోస్ లో ఏం జరిగిందన్న దానిపై తాజాగా టీడీపీ యువనేత, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తాజాగా వివరించే యత్నం చేశారు. దావోస్ లో మహారాష్ట్ర, తెలంగాణలకు పెట్టుబడులు వచ్చిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. వాటిలో మహారాష్ట్రకు ముంబై, తెలంగాణకు హైదరాబాద్ లు బ్రాండ్ లుగా నిలిచిన వైనాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే ఏపీకి దావోస్ సదస్సుతో సంబంధం లేకుండానే… గడచిన 7 నెలల్లోనే ఏకంగా రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చిన విషయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.

మహారాష్ట్ర, తెలంగాణలు పెట్టుబడుల కోసం దావోస్ దాకా వెళ్లాల్సి వచ్చిందని రామ్మోహన్ పేర్కొన్నారు. అయితే ఏపీ ఎక్కడికీ వెళ్లకుండానే.. ఆ రాష్ట్రాలకు దావోస్ లో వచ్చిన పెట్టుబడుల కంటే అధిక శాతం పెట్టుబడులను రాబట్టుకోగలిగిందని తెలిపారు. ఇందుకు కారణం సీఎం చంద్రబాబేనన్న కేంద్ర మంత్రి… ఏపీకి బ్రాండ్ చంద్రబాబేనని తెలిపారు. మహారాష్ట్రకు ముంబై, తెలంగాణకు హైదరాబాద్ లు బ్రాండ్ లుగా కొనసాగుతుంటే…ఏపీకి మాత్రం చంద్రబాబు బ్రాండ్ గా నిలుస్తున్నారని, అందుకే పెట్టుబడులు ఏపీకి నడుచుకుంటూ వస్తున్నాయని ఆయన తెలిపారు. అయినా దావోస్ కు వెళ్లడం, అక్కడికి వచ్చే ప్రపంచ దిగ్గజ కంపెనీలకు తమ రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించడం కూడా ముఖ్యమని చంద్రబాబు భావించారని, అందుకే దావోస్ టూర్ కు వెళ్లారని ఆయన చెప్పుకొచ్చారు.

Satya

Recent Posts

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

36 minutes ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

46 minutes ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

2 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

2 hours ago

పాజిటివ్ టాక్ ఉన్నా పనవ్వడం లేదా

బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…

2 hours ago

బీఆర్ఎస్ `బ్లెడ్` పాలిటిక్స్‌.. ఇంత అవ‌స‌ర‌మా?

తెలంగాణ‌లో రైతుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం ముందుకు రావ‌డం లేద‌ని, ప్రాజెక్టుల‌కు నీటిని విడుద‌ల చేయ‌డం లేద‌ని ఆరోపిస్తూ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం…

2 hours ago