Political News

చంద్రబాబు… ‘బ్రాండ్ ఏపీ’కి బ్రాండ్

స్విట్జర్లాండ్ నగరం దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బ్రాండ్ ఏపీ నినాదంతో వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ టూర్ లో సీఎం నారా చంద్రబాబునాయుడితో పాటుగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఇతర అధికారుల బృందం ఏకంగా నాలుగు రోజుల పాటు దావోస్ లో పర్యటించింది. దావోస్ తో పాటు జూరిక్ లోనూ పలు సమావేశాలు ఏర్పాటు చేసిన చంద్రబాబు బృందం ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించింది. తాము అనుకున్న లక్ష్యాన్ని దిగ్విజయంగానే పూర్తి చేసింది.

అయితే దావోస్ లో ఇతర రాష్ట్రాలు పెద్ద ఎత్తున పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంటే చంద్రబాబు బృందం మాత్రం సింగిల్ పైసా పెట్టుబడులు తీసుకురాలేకపోయిందని విపక్షం వైసీపీ విమర్శించింది. అయితే తాము దావోస్ కు వెళ్లింది ఒప్పందాలు చేసుకోవడానికి కాదని…ఏపీలో పెట్టుబడులకు ఉన్నఅవకాశాలను ఆయా దేశాలు, కంపెనీలకు తెలియజేయడానికేనని చంద్రబాబు అండ్ కో ఆ విమర్శలను సమర్థంగానే తిప్పికొట్టింది. అంతేకాకుండా దావోస్ అంటే పెట్టుబడుల ఒప్పందాలు జరిగే ప్రదేశమనే భావన తప్పని… పెట్టుబడులకు గల అవకాశాలపై అన్వేషణ జరిగే ప్రదేశంగా దానిని భావించాలని తెలిపింది.

దావోస్ లో ఏం జరిగిందన్న దానిపై తాజాగా టీడీపీ యువనేత, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తాజాగా వివరించే యత్నం చేశారు. దావోస్ లో మహారాష్ట్ర, తెలంగాణలకు పెట్టుబడులు వచ్చిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. వాటిలో మహారాష్ట్రకు ముంబై, తెలంగాణకు హైదరాబాద్ లు బ్రాండ్ లుగా నిలిచిన వైనాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే ఏపీకి దావోస్ సదస్సుతో సంబంధం లేకుండానే… గడచిన 7 నెలల్లోనే ఏకంగా రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చిన విషయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.

మహారాష్ట్ర, తెలంగాణలు పెట్టుబడుల కోసం దావోస్ దాకా వెళ్లాల్సి వచ్చిందని రామ్మోహన్ పేర్కొన్నారు. అయితే ఏపీ ఎక్కడికీ వెళ్లకుండానే.. ఆ రాష్ట్రాలకు దావోస్ లో వచ్చిన పెట్టుబడుల కంటే అధిక శాతం పెట్టుబడులను రాబట్టుకోగలిగిందని తెలిపారు. ఇందుకు కారణం సీఎం చంద్రబాబేనన్న కేంద్ర మంత్రి… ఏపీకి బ్రాండ్ చంద్రబాబేనని తెలిపారు. మహారాష్ట్రకు ముంబై, తెలంగాణకు హైదరాబాద్ లు బ్రాండ్ లుగా కొనసాగుతుంటే…ఏపీకి మాత్రం చంద్రబాబు బ్రాండ్ గా నిలుస్తున్నారని, అందుకే పెట్టుబడులు ఏపీకి నడుచుకుంటూ వస్తున్నాయని ఆయన తెలిపారు. అయినా దావోస్ కు వెళ్లడం, అక్కడికి వచ్చే ప్రపంచ దిగ్గజ కంపెనీలకు తమ రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించడం కూడా ముఖ్యమని చంద్రబాబు భావించారని, అందుకే దావోస్ టూర్ కు వెళ్లారని ఆయన చెప్పుకొచ్చారు.

This post was last modified on January 28, 2025 9:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

2 minutes ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

24 minutes ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

3 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

4 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

4 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

6 hours ago