Political News

చంద్రబాబు… ‘బ్రాండ్ ఏపీ’కి బ్రాండ్

స్విట్జర్లాండ్ నగరం దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బ్రాండ్ ఏపీ నినాదంతో వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ టూర్ లో సీఎం నారా చంద్రబాబునాయుడితో పాటుగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఇతర అధికారుల బృందం ఏకంగా నాలుగు రోజుల పాటు దావోస్ లో పర్యటించింది. దావోస్ తో పాటు జూరిక్ లోనూ పలు సమావేశాలు ఏర్పాటు చేసిన చంద్రబాబు బృందం ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించింది. తాము అనుకున్న లక్ష్యాన్ని దిగ్విజయంగానే పూర్తి చేసింది.

అయితే దావోస్ లో ఇతర రాష్ట్రాలు పెద్ద ఎత్తున పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంటే చంద్రబాబు బృందం మాత్రం సింగిల్ పైసా పెట్టుబడులు తీసుకురాలేకపోయిందని విపక్షం వైసీపీ విమర్శించింది. అయితే తాము దావోస్ కు వెళ్లింది ఒప్పందాలు చేసుకోవడానికి కాదని…ఏపీలో పెట్టుబడులకు ఉన్నఅవకాశాలను ఆయా దేశాలు, కంపెనీలకు తెలియజేయడానికేనని చంద్రబాబు అండ్ కో ఆ విమర్శలను సమర్థంగానే తిప్పికొట్టింది. అంతేకాకుండా దావోస్ అంటే పెట్టుబడుల ఒప్పందాలు జరిగే ప్రదేశమనే భావన తప్పని… పెట్టుబడులకు గల అవకాశాలపై అన్వేషణ జరిగే ప్రదేశంగా దానిని భావించాలని తెలిపింది.

దావోస్ లో ఏం జరిగిందన్న దానిపై తాజాగా టీడీపీ యువనేత, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తాజాగా వివరించే యత్నం చేశారు. దావోస్ లో మహారాష్ట్ర, తెలంగాణలకు పెట్టుబడులు వచ్చిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. వాటిలో మహారాష్ట్రకు ముంబై, తెలంగాణకు హైదరాబాద్ లు బ్రాండ్ లుగా నిలిచిన వైనాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే ఏపీకి దావోస్ సదస్సుతో సంబంధం లేకుండానే… గడచిన 7 నెలల్లోనే ఏకంగా రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చిన విషయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.

మహారాష్ట్ర, తెలంగాణలు పెట్టుబడుల కోసం దావోస్ దాకా వెళ్లాల్సి వచ్చిందని రామ్మోహన్ పేర్కొన్నారు. అయితే ఏపీ ఎక్కడికీ వెళ్లకుండానే.. ఆ రాష్ట్రాలకు దావోస్ లో వచ్చిన పెట్టుబడుల కంటే అధిక శాతం పెట్టుబడులను రాబట్టుకోగలిగిందని తెలిపారు. ఇందుకు కారణం సీఎం చంద్రబాబేనన్న కేంద్ర మంత్రి… ఏపీకి బ్రాండ్ చంద్రబాబేనని తెలిపారు. మహారాష్ట్రకు ముంబై, తెలంగాణకు హైదరాబాద్ లు బ్రాండ్ లుగా కొనసాగుతుంటే…ఏపీకి మాత్రం చంద్రబాబు బ్రాండ్ గా నిలుస్తున్నారని, అందుకే పెట్టుబడులు ఏపీకి నడుచుకుంటూ వస్తున్నాయని ఆయన తెలిపారు. అయినా దావోస్ కు వెళ్లడం, అక్కడికి వచ్చే ప్రపంచ దిగ్గజ కంపెనీలకు తమ రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించడం కూడా ముఖ్యమని చంద్రబాబు భావించారని, అందుకే దావోస్ టూర్ కు వెళ్లారని ఆయన చెప్పుకొచ్చారు.

This post was last modified on January 28, 2025 9:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

4 minutes ago

మలుపు తిప్పేది అప్పాల సూరినే

ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…

1 hour ago

చిన్న నటుడే కానీ పెద్ద నిజం చెప్పాడు

పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…

1 hour ago

కేంద్రంతో క‌లుస్తాం.. మోడీతో కాదు: రేవంత్ అంత‌రంగం

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. నువ్వు నాతో…

2 hours ago

సీఎం విజయ్ కి బంపర్ ఆఫర్

తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి నిజంగానే బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. అదికార డీఎంకేతో…

2 hours ago

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

3 hours ago