Political News

చంద్రబాబు… ‘బ్రాండ్ ఏపీ’కి బ్రాండ్

స్విట్జర్లాండ్ నగరం దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బ్రాండ్ ఏపీ నినాదంతో వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ టూర్ లో సీఎం నారా చంద్రబాబునాయుడితో పాటుగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఇతర అధికారుల బృందం ఏకంగా నాలుగు రోజుల పాటు దావోస్ లో పర్యటించింది. దావోస్ తో పాటు జూరిక్ లోనూ పలు సమావేశాలు ఏర్పాటు చేసిన చంద్రబాబు బృందం ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించింది. తాము అనుకున్న లక్ష్యాన్ని దిగ్విజయంగానే పూర్తి చేసింది.

అయితే దావోస్ లో ఇతర రాష్ట్రాలు పెద్ద ఎత్తున పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంటే చంద్రబాబు బృందం మాత్రం సింగిల్ పైసా పెట్టుబడులు తీసుకురాలేకపోయిందని విపక్షం వైసీపీ విమర్శించింది. అయితే తాము దావోస్ కు వెళ్లింది ఒప్పందాలు చేసుకోవడానికి కాదని…ఏపీలో పెట్టుబడులకు ఉన్నఅవకాశాలను ఆయా దేశాలు, కంపెనీలకు తెలియజేయడానికేనని చంద్రబాబు అండ్ కో ఆ విమర్శలను సమర్థంగానే తిప్పికొట్టింది. అంతేకాకుండా దావోస్ అంటే పెట్టుబడుల ఒప్పందాలు జరిగే ప్రదేశమనే భావన తప్పని… పెట్టుబడులకు గల అవకాశాలపై అన్వేషణ జరిగే ప్రదేశంగా దానిని భావించాలని తెలిపింది.

దావోస్ లో ఏం జరిగిందన్న దానిపై తాజాగా టీడీపీ యువనేత, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తాజాగా వివరించే యత్నం చేశారు. దావోస్ లో మహారాష్ట్ర, తెలంగాణలకు పెట్టుబడులు వచ్చిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. వాటిలో మహారాష్ట్రకు ముంబై, తెలంగాణకు హైదరాబాద్ లు బ్రాండ్ లుగా నిలిచిన వైనాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే ఏపీకి దావోస్ సదస్సుతో సంబంధం లేకుండానే… గడచిన 7 నెలల్లోనే ఏకంగా రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చిన విషయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.

మహారాష్ట్ర, తెలంగాణలు పెట్టుబడుల కోసం దావోస్ దాకా వెళ్లాల్సి వచ్చిందని రామ్మోహన్ పేర్కొన్నారు. అయితే ఏపీ ఎక్కడికీ వెళ్లకుండానే.. ఆ రాష్ట్రాలకు దావోస్ లో వచ్చిన పెట్టుబడుల కంటే అధిక శాతం పెట్టుబడులను రాబట్టుకోగలిగిందని తెలిపారు. ఇందుకు కారణం సీఎం చంద్రబాబేనన్న కేంద్ర మంత్రి… ఏపీకి బ్రాండ్ చంద్రబాబేనని తెలిపారు. మహారాష్ట్రకు ముంబై, తెలంగాణకు హైదరాబాద్ లు బ్రాండ్ లుగా కొనసాగుతుంటే…ఏపీకి మాత్రం చంద్రబాబు బ్రాండ్ గా నిలుస్తున్నారని, అందుకే పెట్టుబడులు ఏపీకి నడుచుకుంటూ వస్తున్నాయని ఆయన తెలిపారు. అయినా దావోస్ కు వెళ్లడం, అక్కడికి వచ్చే ప్రపంచ దిగ్గజ కంపెనీలకు తమ రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించడం కూడా ముఖ్యమని చంద్రబాబు భావించారని, అందుకే దావోస్ టూర్ కు వెళ్లారని ఆయన చెప్పుకొచ్చారు.

Satya

Recent Posts

ఒక్కడు పోలికకు సైనికుడే దొరికిందా

దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…

46 minutes ago

“పాపం… పవన్ కల్యాణ్ ను బలి చేయొద్దు”

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన నవ నిర్మాణ…

2 hours ago

అస్సలు తగ్గనంటున్న గుణశేఖర్

సీనియర్ దర్శకుడు గుణశేఖర్‌ది ఎప్పుడూ సాహసోపేత ప్రయాణమే. కెరీర్ ఆరంభంలోనే ‘బాల రామాయణం’తో పెద్ద రిస్క్ చేశారాయన. దర్శకుడిగా తన…

2 hours ago

సుస్మితా సేన్ గోల్డ్ డిగ్గరా లలిత్ మోడీ?

బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద పెద్ద బిజినెస్‌మ్యాన్‌లను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం మామూలే. కొందరేమో కొన్నేళ్లు రిలేషన్‌షిప్‌లు ఉండి ఆర్థిక…

2 hours ago

నైజామ్ టికెట్ రేట్లు… ఎడతెగని టెన్షన్లు

పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…

5 hours ago

బడ్జెట్ బయటికి చెప్పడం రిస్కంటారా

మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…

6 hours ago