తమిళనాట గడచిన రెండు రోజులుగా ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. తమిళనాడు వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ వార్తపైనే చర్చ జరుగుతోంది. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా కూడా దీనిపైనే చర్చించుకుంటున్నారు. ఫలితంగా చోటామోటా వెబ్ సైట్లను దాటేసిన ఈ వార్త ఇప్పుడు మెయిన్ మీడియాకూ ఎక్కేసింది. ఫలితంగా సోమవారం తమిళనాడు వ్యాప్తంగా ఈ వార్తే టాప్ ట్రెండింగ్ లో నడిచింది. మరింత కాలం పాటు ఈ వార్త ట్రెండింగ్ లోనే కొనసాగడం ఖాయమన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
అసలు విషయం చెప్పకుండా… ఈ ఇంట్రడక్షన్ ఏమిటీ? అంటారా… అయితే అసలు స్టోరీలోకి వెళ్లిపోదాం పదండి. శ్రీలంకలో తమిళవాసులు ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని గతంలో పెద్ద ఉద్యమమే జరిగింది కదా. ఇందుకోసం లిబరేషన్ ఆఫ్ తమిళ టైగర్స్ ఈలం (ఎల్టీటీఈ) పేరిట దశాబ్దాల పాటు ఓ యుద్ధమే జరిగింది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో టాలీవుడ్ హీరోయిన్ సమంత నటించిన వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ లో ఆమె ఎల్టీటీఈ యాక్టివస్ట్ గానే కనిపించి… ఆ సంస్థ ఎంతటి డేంజర్ సంస్థో చెప్పేసింది. ఆ సంస్థను వేలెపిళ్లై ప్రభాకరన్ అనే వ్యక్తి స్థాపించాడు. అంతా ఇతడిని టైగర్ అని ముద్దుగా పిలుచుకునేవారు.
మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసింది కూడా ఈ సంస్థనే. తర్వాత కాలంలో శ్రీలంక సర్కారు ఎల్టీటీఈని చక్రబంధంలో ఇరికించేసి దాని సైన్యంతో పాటుగా చీఫ్ ప్రభాకరన్ ను కూడా హతమార్చింది. 2009 ,మే 18న ప్రభాకరన్ ను చంపేశామంటూ శ్రీలంక సైన్యం ప్రకటించింది. ప్రపంచం కూడా నమ్మేసింది. అప్పటినుంచి ఆయన ప్రస్తావనే రావట్లేదు. అయితే ఇప్పటికీ సింహళ భూభాగంలో తమిళ రాజ్య స్థాపనపై ఇంకా ఆశలు చావని తమిళులు తమ టైగర్ అసలు చనిపోనే లేదని, ఇంకా బ్రతికే ఉన్నాడని అప్పుడప్పుడూ చెబుతూ వస్తున్నారు. తమిళనాడులో ఎల్టీటీఈకి మద్దతు పలికే పార్టీలు కూడా అడపాదడపా ఈ ప్రకటనలు చేస్తూనే ఉన్నాయి.
ఇలాంటి క్రమంతో సోమవారం తమిళనాట ప్రభాకరన్ బ్రతికే ఉన్నారని, ఈ మే నెలలో ఆయన ప్రజల ముందుకు రానున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. శ్రీలంక అధికారిక ప్రకటన ప్రకారం… ప్రభాకరన్ చనిపోయి ఇప్పటికి దాదాపుగా 15 ఏళ్లు దాటిపోతోంది. అయినా కూడా ఎల్టీటీఈ అనుకూలురు మాత్రం ప్రభాకరన్ చనిపోలేదనే చెబుతున్నారు. మే నెలలో ప్రభాకరన్ తన ప్రధాన అనుచరుడు పొట్టు అమ్మన్ తో కలిసి ప్రజల ముందుకు రానున్నారని ఆ వార్తలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా పలు దేశాల్లో బలమైన నెట్ వర్క్ ఎల్టీటీఈ సొంతం. ఈ నేపథ్యంలో ప్రబాకరన్ ఇప్పటికీ సజీవంగానే ఉన్నా ఆశ్చర్యం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on January 28, 2025 9:57 am
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…