Political News

ఆ ‘టైగర్’ ఇంకా బతికే ఉన్నాడా…?

తమిళనాట గడచిన రెండు రోజులుగా ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. తమిళనాడు వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ వార్తపైనే చర్చ జరుగుతోంది. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా కూడా దీనిపైనే చర్చించుకుంటున్నారు. ఫలితంగా చోటామోటా వెబ్ సైట్లను దాటేసిన ఈ వార్త ఇప్పుడు మెయిన్ మీడియాకూ ఎక్కేసింది. ఫలితంగా సోమవారం తమిళనాడు వ్యాప్తంగా ఈ వార్తే టాప్ ట్రెండింగ్ లో నడిచింది. మరింత కాలం పాటు ఈ వార్త ట్రెండింగ్ లోనే కొనసాగడం ఖాయమన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

అసలు విషయం చెప్పకుండా… ఈ ఇంట్రడక్షన్ ఏమిటీ? అంటారా… అయితే అసలు స్టోరీలోకి వెళ్లిపోదాం పదండి. శ్రీలంకలో తమిళవాసులు ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని గతంలో పెద్ద ఉద్యమమే జరిగింది కదా. ఇందుకోసం లిబరేషన్ ఆఫ్ తమిళ టైగర్స్ ఈలం (ఎల్టీటీఈ) పేరిట దశాబ్దాల పాటు ఓ యుద్ధమే జరిగింది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో టాలీవుడ్ హీరోయిన్ సమంత నటించిన వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ లో ఆమె ఎల్టీటీఈ యాక్టివస్ట్ గానే కనిపించి… ఆ సంస్థ ఎంతటి డేంజర్ సంస్థో చెప్పేసింది. ఆ సంస్థను వేలెపిళ్లై ప్రభాకరన్ అనే వ్యక్తి స్థాపించాడు. అంతా ఇతడిని టైగర్ అని ముద్దుగా పిలుచుకునేవారు.

మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసింది కూడా ఈ సంస్థనే. తర్వాత కాలంలో శ్రీలంక సర్కారు ఎల్టీటీఈని చక్రబంధంలో ఇరికించేసి దాని సైన్యంతో పాటుగా చీఫ్ ప్రభాకరన్ ను కూడా హతమార్చింది. 2009 ,మే 18న ప్రభాకరన్ ను చంపేశామంటూ శ్రీలంక సైన్యం ప్రకటించింది. ప్రపంచం కూడా నమ్మేసింది. అప్పటినుంచి ఆయన ప్రస్తావనే రావట్లేదు. అయితే ఇప్పటికీ సింహళ భూభాగంలో తమిళ రాజ్య స్థాపనపై ఇంకా ఆశలు చావని తమిళులు తమ టైగర్ అసలు చనిపోనే లేదని, ఇంకా బ్రతికే ఉన్నాడని అప్పుడప్పుడూ చెబుతూ వస్తున్నారు. తమిళనాడులో ఎల్టీటీఈకి మద్దతు పలికే పార్టీలు కూడా అడపాదడపా ఈ ప్రకటనలు చేస్తూనే ఉన్నాయి.

ఇలాంటి క్రమంతో సోమవారం తమిళనాట ప్రభాకరన్ బ్రతికే ఉన్నారని, ఈ మే నెలలో ఆయన ప్రజల ముందుకు రానున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. శ్రీలంక అధికారిక ప్రకటన ప్రకారం… ప్రభాకరన్ చనిపోయి ఇప్పటికి దాదాపుగా 15 ఏళ్లు దాటిపోతోంది. అయినా కూడా ఎల్టీటీఈ అనుకూలురు మాత్రం ప్రభాకరన్ చనిపోలేదనే చెబుతున్నారు. మే నెలలో ప్రభాకరన్ తన ప్రధాన అనుచరుడు పొట్టు అమ్మన్ తో కలిసి ప్రజల ముందుకు రానున్నారని ఆ వార్తలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా పలు దేశాల్లో బలమైన నెట్ వర్క్ ఎల్టీటీఈ సొంతం. ఈ నేపథ్యంలో ప్రబాకరన్ ఇప్పటికీ సజీవంగానే ఉన్నా ఆశ్చర్యం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Satya

Recent Posts

నైజామ్ టికెట్ రేట్లు… ఎడతెగని టెన్షన్లు

పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…

2 hours ago

బడ్జెట్ బయటికి చెప్పడం రిస్కంటారా

మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…

3 hours ago

మాటల్లో రాజీ లేదు.. చేతల్లో ఆలస్యం కాదు..

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…

5 hours ago

బాడీగార్డ్ గురించి ఓపెన్ అయిన చ‌ర‌ణ్‌

త‌న కొత్త సినిమా పెద్ది ప్ర‌మోష‌న్లలో భాగంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డికి వెళ్లినా… ఆయ‌న వెంట…

7 hours ago

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

12 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

13 hours ago