Political News

తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణ

ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో ఈ న్యాయ విచారణ జరుగుతుందని తెలిపింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి… 6 నెలల్లోగా నివేదిక సమర్పించాలంటూ కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని వైైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకునే అవకాశాన్ని వీఐపీలకే కాకుండా సామాన్య భక్తులకూ కల్పిస్తూ గత ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం తిరుపతి, తిరుమలలో టోకెన్ల జారీకి కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఈ ఏడాది టోకెన్ల జారీ కోసం కూటమి సర్కారు భారీ ఏర్పాట్లు చేసింది. అదే సమయంలో టోకెన్ల జారీకి సంబంధించి టీటీడీ భారీ ఎత్తున ప్రచారం చేసింది. దీంతో తొలి రోజే ఊహించని రీతిలో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

ఈ క్రమంలో తిరుపతిలోని బైరాగిపట్టెడ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కౌంటర్ వద్దకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఊహించని రీతిలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 39 మంది గాయపడ్డారు.స్వామి వారి దర్శనం కోసం వచ్చి భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగానూ కలకలం రేపింది. ఈ ఘటనపై ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీటీడీ తరఫున చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పారు. అయినా విపక్షాలు ఈ ఘటనను రాజకీయం చేయడంతో ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

This post was last modified on January 22, 2025 6:36 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

2 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

2 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

3 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

3 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

4 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

5 hours ago