Political News

తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణ

ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో ఈ న్యాయ విచారణ జరుగుతుందని తెలిపింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి… 6 నెలల్లోగా నివేదిక సమర్పించాలంటూ కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని వైైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకునే అవకాశాన్ని వీఐపీలకే కాకుండా సామాన్య భక్తులకూ కల్పిస్తూ గత ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం తిరుపతి, తిరుమలలో టోకెన్ల జారీకి కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఈ ఏడాది టోకెన్ల జారీ కోసం కూటమి సర్కారు భారీ ఏర్పాట్లు చేసింది. అదే సమయంలో టోకెన్ల జారీకి సంబంధించి టీటీడీ భారీ ఎత్తున ప్రచారం చేసింది. దీంతో తొలి రోజే ఊహించని రీతిలో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

ఈ క్రమంలో తిరుపతిలోని బైరాగిపట్టెడ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కౌంటర్ వద్దకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఊహించని రీతిలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 39 మంది గాయపడ్డారు.స్వామి వారి దర్శనం కోసం వచ్చి భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగానూ కలకలం రేపింది. ఈ ఘటనపై ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీటీడీ తరఫున చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పారు. అయినా విపక్షాలు ఈ ఘటనను రాజకీయం చేయడంతో ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

This post was last modified on January 22, 2025 6:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

41 minutes ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

48 minutes ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

1 hour ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

2 hours ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

2 hours ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

3 hours ago