ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో ఈ న్యాయ విచారణ జరుగుతుందని తెలిపింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి… 6 నెలల్లోగా నివేదిక సమర్పించాలంటూ కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని వైైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకునే అవకాశాన్ని వీఐపీలకే కాకుండా సామాన్య భక్తులకూ కల్పిస్తూ గత ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం తిరుపతి, తిరుమలలో టోకెన్ల జారీకి కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఈ ఏడాది టోకెన్ల జారీ కోసం కూటమి సర్కారు భారీ ఏర్పాట్లు చేసింది. అదే సమయంలో టోకెన్ల జారీకి సంబంధించి టీటీడీ భారీ ఎత్తున ప్రచారం చేసింది. దీంతో తొలి రోజే ఊహించని రీతిలో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
ఈ క్రమంలో తిరుపతిలోని బైరాగిపట్టెడ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కౌంటర్ వద్దకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఊహించని రీతిలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 39 మంది గాయపడ్డారు.స్వామి వారి దర్శనం కోసం వచ్చి భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగానూ కలకలం రేపింది. ఈ ఘటనపై ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీటీడీ తరఫున చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పారు. అయినా విపక్షాలు ఈ ఘటనను రాజకీయం చేయడంతో ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
This post was last modified on January 22, 2025 6:36 pm
స్టార్ పవర్ అంటే మాటల్లో కొలిచేది కాదు. దాని సత్తా ఏ స్థాయిలో ఉంటుదంటే ఒక్కసారి ట్రేడ్ వర్గాలకు సైతం…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురం మీద సినిమా కంటే ఎక్కువగా మహేష్ బాబు ఆ మూవీ…
ఈ రోజుల్లో పెద్ద స్టార్లు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడం అన్నది దాదాపు అసాధ్యంగా మారిపోయింది. మిడ్ రేంజ్ హీరోలు…
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన జనసేన నాయకుడు, సీనియర్ నేత ఆరణి శ్రీనివాసులు రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర…
కొందరు నటనలోకి రావాలని ముందే ఒక లక్ష్యం పెట్టుకుని పని చేస్తారు. కొందరు అనుకోకుండా ఈ రంగంలోకి అడుగు పెడతారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరి.. పార్టీ నాయకులకు బాగా కలిసి వస్తోందన్నవాదన వినిపిస్తోంది. ఇప్పటికి రెండు సంవత్సరాలుగా చంద్రబాబు.. తమ్ముళ్లకు…