Political News

తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణ

ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో ఈ న్యాయ విచారణ జరుగుతుందని తెలిపింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి… 6 నెలల్లోగా నివేదిక సమర్పించాలంటూ కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని వైైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకునే అవకాశాన్ని వీఐపీలకే కాకుండా సామాన్య భక్తులకూ కల్పిస్తూ గత ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం తిరుపతి, తిరుమలలో టోకెన్ల జారీకి కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఈ ఏడాది టోకెన్ల జారీ కోసం కూటమి సర్కారు భారీ ఏర్పాట్లు చేసింది. అదే సమయంలో టోకెన్ల జారీకి సంబంధించి టీటీడీ భారీ ఎత్తున ప్రచారం చేసింది. దీంతో తొలి రోజే ఊహించని రీతిలో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

ఈ క్రమంలో తిరుపతిలోని బైరాగిపట్టెడ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కౌంటర్ వద్దకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఊహించని రీతిలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 39 మంది గాయపడ్డారు.స్వామి వారి దర్శనం కోసం వచ్చి భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగానూ కలకలం రేపింది. ఈ ఘటనపై ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీటీడీ తరఫున చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పారు. అయినా విపక్షాలు ఈ ఘటనను రాజకీయం చేయడంతో ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

This post was last modified on January 22, 2025 6:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

4 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

6 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

8 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

8 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

10 hours ago

సమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటే

సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…

12 hours ago