దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ పురుష సమాజం మాత్రం ఇంకా కారు చీకట్లోనే ఉండిపోతానంటోంది. ఈ మాట నిజమేనన్నట్టుగా మధ్య ప్రదేశ్ లో ఓ దారుణం వెలుగు చూసింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఈ దారుణంపై బాధిత మహిళ నోరు విప్పి న్యాయం కోసం పోరాటం చేసేందుకే ఏళ్ల సమయం పట్టిందంటే… పరిస్థితులు ఇంకా ఎలా ఉన్నాయో ఇట్టే అర్థం కాక మానదు.
సభ్య సమాజాన్ని తల దించుకునేలా చేస్తున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే…మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఓ మహిళకు 2019లో భోపాల్ కు చెందిన యువకుడితో వివాహం జరిగింది. అనంతరం అందరి మాదిరే కోటి కొత్త ఆశలతో దాంపత్య బంధంలోకి అడుగు పెడుతున్నానని సదరు యువతి సంబరపడింది. అయితే ఆ సంబరం ఆమెలో ఎంతో సేపు నిలవలేదు. ఎందుకంటే… తనను పెళ్లి చేసుకున్న భర్త, అతడి కుటుంబం శోభనానికి ముందు ఓ దారుణానికి పాల్పడింది. ఆ మహిళకు నిందితులు కన్వత్య పరీక్ష నిర్వహించారు. అది కూడా నాటు పద్ధతుల్లో ఈ పరీక్షను ఆ దుర్మార్గులు చేపట్టింది.
ఆ సమయంలో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో సదరు మహిళ నరక యాతన అనుభవించింది. ఓ వైపు మానసిక వేధన, మరోవైపు నాటు పద్ధతుల్లో జరుగుతున్న పరీక్షతో శారీరక బాధతో ఆమె సతమతమైపోయింది. అయితే… నాడు దీనిపై ఎలా స్పందించాలో కూడా ఆమెకు తెలియలేదు. దీంతో తనకు జరిగిన అవమానాన్ని పంటి బిగువునే భరిస్తూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. అయితే ఆ తర్వాత కూడా భర్త కుటుంబం తమ దారుణాలను ఆపలేదు. పెళ్లి జరిగిన తర్వాత తొలిసారి ఆమె గర్భం దాలిస్తే… దానిపైనా అనుమానంగా చూసి అబార్షన్ చేయించింది.
ఇన్ని జరిగినా… తనకు పెళ్లి జరిగి ఐధేళ్లు పూర్తి అవుతున్నా కూడా తన పట్ల భర్త తరఫు కుటుంబం అనుసరిస్తున్న వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఐధేళ్ల పాటు అవమానాలు పడుతూనే భర్త ఇంట కాపురం చేసిన బాధితురాలు… న్యాయ పోరాటం చేయాలని తీర్మానించుకుంది. తన కుమార్తెతో కలిసి భర్త ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె నేరుగా ఇండోర్ జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. బాధితురాలు చెప్పిన విషయాన్ని విన్న కోర్టు ఆమె భర్త కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది.
This post was last modified on January 22, 2025 3:54 pm
‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు ప్రభాస్. అలాంటి హీరోతో సినిమా తీసే…
తెలంగాణ రాష్ట్ర సేన.. అంటూ టీఆర్ ఎస్ పార్టీని స్థాపించిన కవిత వ్యవహారంపై బీఆర్ ఎస్ నాయకులు మౌనంగా ఉన్నారు.…
మోహన్ లాల్ దృశ్యం 3 మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించింది. మే 21 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా…
బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…
సొంత పార్టీ నాయకుడు తప్పు చేస్తే ఒకవిధంగా.. ప్రత్యర్థి పార్టీ నేతలు తప్పులు చేస్తే మరో విధంగా మారి పోయిన…
మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…