Trends

ఎంపీలో ఘోరం!… శోభనానికి ముందు కన్యత్వ పరీక్ష!

దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ పురుష సమాజం మాత్రం ఇంకా కారు చీకట్లోనే ఉండిపోతానంటోంది. ఈ మాట నిజమేనన్నట్టుగా మధ్య ప్రదేశ్ లో ఓ దారుణం వెలుగు చూసింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఈ దారుణంపై బాధిత మహిళ నోరు విప్పి న్యాయం కోసం పోరాటం చేసేందుకే ఏళ్ల సమయం పట్టిందంటే… పరిస్థితులు ఇంకా ఎలా ఉన్నాయో ఇట్టే అర్థం కాక మానదు.

సభ్య సమాజాన్ని తల దించుకునేలా చేస్తున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే…మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఓ మహిళకు 2019లో భోపాల్ కు చెందిన యువకుడితో వివాహం జరిగింది. అనంతరం అందరి మాదిరే కోటి కొత్త ఆశలతో దాంపత్య బంధంలోకి అడుగు పెడుతున్నానని సదరు యువతి సంబరపడింది. అయితే ఆ సంబరం ఆమెలో ఎంతో సేపు నిలవలేదు. ఎందుకంటే… తనను పెళ్లి చేసుకున్న భర్త, అతడి కుటుంబం శోభనానికి ముందు ఓ దారుణానికి పాల్పడింది. ఆ మహిళకు నిందితులు కన్వత్య పరీక్ష నిర్వహించారు. అది కూడా నాటు పద్ధతుల్లో ఈ పరీక్షను ఆ దుర్మార్గులు చేపట్టింది.

ఆ సమయంలో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో సదరు మహిళ నరక యాతన అనుభవించింది. ఓ వైపు మానసిక వేధన, మరోవైపు నాటు పద్ధతుల్లో జరుగుతున్న పరీక్షతో శారీరక బాధతో ఆమె సతమతమైపోయింది. అయితే… నాడు దీనిపై ఎలా స్పందించాలో కూడా ఆమెకు తెలియలేదు. దీంతో తనకు జరిగిన అవమానాన్ని పంటి బిగువునే భరిస్తూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. అయితే ఆ తర్వాత కూడా భర్త కుటుంబం తమ దారుణాలను ఆపలేదు. పెళ్లి జరిగిన తర్వాత తొలిసారి ఆమె గర్భం దాలిస్తే… దానిపైనా అనుమానంగా చూసి అబార్షన్ చేయించింది.

ఇన్ని జరిగినా… తనకు పెళ్లి జరిగి ఐధేళ్లు పూర్తి అవుతున్నా కూడా తన పట్ల భర్త తరఫు కుటుంబం అనుసరిస్తున్న వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఐధేళ్ల పాటు అవమానాలు పడుతూనే భర్త ఇంట కాపురం చేసిన బాధితురాలు… న్యాయ పోరాటం చేయాలని తీర్మానించుకుంది. తన కుమార్తెతో కలిసి భర్త ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె నేరుగా ఇండోర్ జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. బాధితురాలు చెప్పిన విషయాన్ని విన్న కోర్టు ఆమె భర్త కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది.

This post was last modified on January 22, 2025 3:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘హైదరాబాద్ హౌస్’లో పుతిన్ బస.. ఈ ప్యాలెస్ ఎవరిదో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…

21 minutes ago

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

3 hours ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

4 hours ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

6 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

7 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

7 hours ago