దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ పురుష సమాజం మాత్రం ఇంకా కారు చీకట్లోనే ఉండిపోతానంటోంది. ఈ మాట నిజమేనన్నట్టుగా మధ్య ప్రదేశ్ లో ఓ దారుణం వెలుగు చూసింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఈ దారుణంపై బాధిత మహిళ నోరు విప్పి న్యాయం కోసం పోరాటం చేసేందుకే ఏళ్ల సమయం పట్టిందంటే… పరిస్థితులు ఇంకా ఎలా ఉన్నాయో ఇట్టే అర్థం కాక మానదు.
సభ్య సమాజాన్ని తల దించుకునేలా చేస్తున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే…మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఓ మహిళకు 2019లో భోపాల్ కు చెందిన యువకుడితో వివాహం జరిగింది. అనంతరం అందరి మాదిరే కోటి కొత్త ఆశలతో దాంపత్య బంధంలోకి అడుగు పెడుతున్నానని సదరు యువతి సంబరపడింది. అయితే ఆ సంబరం ఆమెలో ఎంతో సేపు నిలవలేదు. ఎందుకంటే… తనను పెళ్లి చేసుకున్న భర్త, అతడి కుటుంబం శోభనానికి ముందు ఓ దారుణానికి పాల్పడింది. ఆ మహిళకు నిందితులు కన్వత్య పరీక్ష నిర్వహించారు. అది కూడా నాటు పద్ధతుల్లో ఈ పరీక్షను ఆ దుర్మార్గులు చేపట్టింది.
ఆ సమయంలో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో సదరు మహిళ నరక యాతన అనుభవించింది. ఓ వైపు మానసిక వేధన, మరోవైపు నాటు పద్ధతుల్లో జరుగుతున్న పరీక్షతో శారీరక బాధతో ఆమె సతమతమైపోయింది. అయితే… నాడు దీనిపై ఎలా స్పందించాలో కూడా ఆమెకు తెలియలేదు. దీంతో తనకు జరిగిన అవమానాన్ని పంటి బిగువునే భరిస్తూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. అయితే ఆ తర్వాత కూడా భర్త కుటుంబం తమ దారుణాలను ఆపలేదు. పెళ్లి జరిగిన తర్వాత తొలిసారి ఆమె గర్భం దాలిస్తే… దానిపైనా అనుమానంగా చూసి అబార్షన్ చేయించింది.
ఇన్ని జరిగినా… తనకు పెళ్లి జరిగి ఐధేళ్లు పూర్తి అవుతున్నా కూడా తన పట్ల భర్త తరఫు కుటుంబం అనుసరిస్తున్న వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఐధేళ్ల పాటు అవమానాలు పడుతూనే భర్త ఇంట కాపురం చేసిన బాధితురాలు… న్యాయ పోరాటం చేయాలని తీర్మానించుకుంది. తన కుమార్తెతో కలిసి భర్త ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె నేరుగా ఇండోర్ జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. బాధితురాలు చెప్పిన విషయాన్ని విన్న కోర్టు ఆమె భర్త కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది.
This post was last modified on January 22, 2025 3:54 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…