Trends

ఎంపీలో ఘోరం!… శోభనానికి ముందు కన్యత్వ పరీక్ష!

దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ పురుష సమాజం మాత్రం ఇంకా కారు చీకట్లోనే ఉండిపోతానంటోంది. ఈ మాట నిజమేనన్నట్టుగా మధ్య ప్రదేశ్ లో ఓ దారుణం వెలుగు చూసింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఈ దారుణంపై బాధిత మహిళ నోరు విప్పి న్యాయం కోసం పోరాటం చేసేందుకే ఏళ్ల సమయం పట్టిందంటే… పరిస్థితులు ఇంకా ఎలా ఉన్నాయో ఇట్టే అర్థం కాక మానదు.

సభ్య సమాజాన్ని తల దించుకునేలా చేస్తున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే…మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఓ మహిళకు 2019లో భోపాల్ కు చెందిన యువకుడితో వివాహం జరిగింది. అనంతరం అందరి మాదిరే కోటి కొత్త ఆశలతో దాంపత్య బంధంలోకి అడుగు పెడుతున్నానని సదరు యువతి సంబరపడింది. అయితే ఆ సంబరం ఆమెలో ఎంతో సేపు నిలవలేదు. ఎందుకంటే… తనను పెళ్లి చేసుకున్న భర్త, అతడి కుటుంబం శోభనానికి ముందు ఓ దారుణానికి పాల్పడింది. ఆ మహిళకు నిందితులు కన్వత్య పరీక్ష నిర్వహించారు. అది కూడా నాటు పద్ధతుల్లో ఈ పరీక్షను ఆ దుర్మార్గులు చేపట్టింది.

ఆ సమయంలో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో సదరు మహిళ నరక యాతన అనుభవించింది. ఓ వైపు మానసిక వేధన, మరోవైపు నాటు పద్ధతుల్లో జరుగుతున్న పరీక్షతో శారీరక బాధతో ఆమె సతమతమైపోయింది. అయితే… నాడు దీనిపై ఎలా స్పందించాలో కూడా ఆమెకు తెలియలేదు. దీంతో తనకు జరిగిన అవమానాన్ని పంటి బిగువునే భరిస్తూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. అయితే ఆ తర్వాత కూడా భర్త కుటుంబం తమ దారుణాలను ఆపలేదు. పెళ్లి జరిగిన తర్వాత తొలిసారి ఆమె గర్భం దాలిస్తే… దానిపైనా అనుమానంగా చూసి అబార్షన్ చేయించింది.

ఇన్ని జరిగినా… తనకు పెళ్లి జరిగి ఐధేళ్లు పూర్తి అవుతున్నా కూడా తన పట్ల భర్త తరఫు కుటుంబం అనుసరిస్తున్న వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఐధేళ్ల పాటు అవమానాలు పడుతూనే భర్త ఇంట కాపురం చేసిన బాధితురాలు… న్యాయ పోరాటం చేయాలని తీర్మానించుకుంది. తన కుమార్తెతో కలిసి భర్త ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె నేరుగా ఇండోర్ జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. బాధితురాలు చెప్పిన విషయాన్ని విన్న కోర్టు ఆమె భర్త కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది.

Satya

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

2 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

3 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

4 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

6 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

6 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

7 hours ago