బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ చిత్రాలు తీస్తూ ఎక్కువ పారితోషకం పుచ్చుకుంటున్నా సరే.. సినిమా సినిమాకు మధ్య ఎక్కువ గ్యాప్ వచ్చేది. కానీ అక్షయ్ వాళ్లు ఒక సినిమా చేసే టైంలో మూణ్నాలుగు సినిమాలు చేస్తూ అందులో రెండైనా హిట్లు ఇచ్చేవాడు. తద్వారా అతడి సక్సెస్ రేట్, ఆదాయం ఖాన్ త్రయం కన్నా ఎక్కువగా ఉండేది. అలా ఒక దశలో హైయెస్ట్ పెయిడ్ ఇండియన్ స్టార్గానూ అతను రికార్డు సృష్టించాడు.
ఐతే గత కొన్నేళ్ల నుంచి అక్షయ్ నుంచి సినిమాల ఫ్రీక్వెన్సీ అయితే తగ్గడం లేదు కానీ.. సక్సెస్ రేట్ మాత్రం బాగా పడిపోయింది. చివరగా అతను ఎప్పుడు పెద్ద హిట్ కొట్టాడో అభిమానులకు కూడా గుర్తు లేదు. ముఖ్యంగా కొవిడ్ తర్వాత అక్షయ్ సినిమాలకు ఆడియన్స్ కనెక్ట్ కావడం లేదు. వరుసగా రెండంకెల సంఖ్యలో అతడికి ఫెయిల్యూర్లు వచ్చాయి. కొవిడ్ తర్వాత సినిమాల తీరు పూర్తిగా మారిపోయిందని.. ప్రేక్షకుల అభిరుచి కూడా మారిపోయిందని.. అందుకే థియేటర్లలో సక్సెస్ రేట్ పడిపోయిందని అక్షయ్ అభివర్ణించాడు.
కరోనా సమయంలో ప్రేక్షకులకు ఓటీటీలకు అలవాటు పడిపోయారని.. ఏదైనా సినిమా రిలీజైతే ఓటీటీలోకి వచ్చాక చూస్తాం అనే పరిస్థితి వచ్చేసిందని అక్షయ్ తెలిపాడు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే ఎలాంటి సినిమాలు తీయాలో తెలియని అయోమయం నెలకొందని.. వాళ్లు ఎక్కువగా ఎంటర్టైనర్లు, భారీతనం ఉన్న చిత్రాలనే ఇష్టపడుతున్నారని అతనన్నాడు.
తాను కూడా అలాంటి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు. ఇదిలా ఉంటే అక్షయ్ నటించిన ‘భూల్ భులయియా’ సూపర్ హిట్ అయినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన రెండు సీక్వెల్స్లో అతను నటించని సంగతి తెలిసిందే. సీక్వెల్స్ రెండింట్లో కార్తీక్ ఆర్యన్ హీరోగా చేశాడు. అవి ఇంకా పెద్ద సక్సెస్ అయ్యాయి. మరి సీక్వెల్స్లో మీరెందుకు నటించలేదు అని అక్షయ్ని అడిగితే.. వాటిలో తాను నటించకపోవడం అంటూ ఏమీ లేదని.. ఆ చిత్రాల నుంచి తనను తప్పించారని అక్షయ్ వ్యాఖ్యానించడడం విశేషం.
This post was last modified on January 22, 2025 5:54 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…