Movie News

ఆ సినిమాల నుంచి నన్ను తీసేశారు – అక్షయ్

బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ చిత్రాలు తీస్తూ ఎక్కువ పారితోషకం పుచ్చుకుంటున్నా సరే.. సినిమా సినిమాకు మధ్య ఎక్కువ గ్యాప్ వచ్చేది. కానీ అక్షయ్ వాళ్లు ఒక సినిమా చేసే టైంలో మూణ్నాలుగు సినిమాలు చేస్తూ అందులో రెండైనా హిట్లు ఇచ్చేవాడు. తద్వారా అతడి సక్సెస్ రేట్, ఆదాయం ఖాన్ త్రయం కన్నా ఎక్కువగా ఉండేది. అలా ఒక దశలో హైయెస్ట్ పెయిడ్ ఇండియన్ స్టార్‌గానూ అతను రికార్డు సృష్టించాడు.

ఐతే గత కొన్నేళ్ల నుంచి అక్షయ్ నుంచి సినిమాల ఫ్రీక్వెన్సీ అయితే తగ్గడం లేదు కానీ.. సక్సెస్ రేట్ మాత్రం బాగా పడిపోయింది. చివరగా అతను ఎప్పుడు పెద్ద హిట్ కొట్టాడో అభిమానులకు కూడా గుర్తు లేదు. ముఖ్యంగా కొవిడ్ తర్వాత అక్షయ్ సినిమాలకు ఆడియన్స్ కనెక్ట్ కావడం లేదు. వరుసగా రెండంకెల సంఖ్యలో అతడికి ఫెయిల్యూర్లు వచ్చాయి. కొవిడ్ తర్వాత సినిమాల తీరు పూర్తిగా మారిపోయిందని.. ప్రేక్షకుల అభిరుచి కూడా మారిపోయిందని.. అందుకే థియేటర్లలో సక్సెస్ రేట్ పడిపోయిందని అక్షయ్ అభివర్ణించాడు.

కరోనా సమయంలో ప్రేక్షకులకు ఓటీటీలకు అలవాటు పడిపోయారని.. ఏదైనా సినిమా రిలీజైతే ఓటీటీలోకి వచ్చాక చూస్తాం అనే పరిస్థితి వచ్చేసిందని అక్షయ్ తెలిపాడు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే ఎలాంటి సినిమాలు తీయాలో తెలియని అయోమయం నెలకొందని.. వాళ్లు ఎక్కువగా ఎంటర్టైనర్లు, భారీతనం ఉన్న చిత్రాలనే ఇష్టపడుతున్నారని అతనన్నాడు.

తాను కూడా అలాంటి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు. ఇదిలా ఉంటే అక్షయ్ నటించిన ‘భూల్ భులయియా’ సూపర్ హిట్ అయినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన రెండు సీక్వెల్స్‌లో అతను నటించని సంగతి తెలిసిందే. సీక్వెల్స్ రెండింట్లో కార్తీక్ ఆర్యన్ హీరోగా చేశాడు. అవి ఇంకా పెద్ద సక్సెస్ అయ్యాయి. మరి సీక్వెల్స్‌లో మీరెందుకు నటించలేదు అని అక్షయ్‌ని అడిగితే.. వాటిలో తాను నటించకపోవడం అంటూ ఏమీ లేదని.. ఆ చిత్రాల నుంచి తనను తప్పించారని అక్షయ్ వ్యాఖ్యానించడడం విశేషం.

This post was last modified on January 22, 2025 5:54 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Akshay Kumar

Recent Posts

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

31 minutes ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

1 hour ago

వారణాసికి అన్నీ పక్కా ప్లానింగ్

రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…

2 hours ago

ఫస్ట్ టైమ్.. అసెంబ్లీలో చే’నేత’ స్టాళ్లు

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో ప‌లు ఆసక్తిక‌ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ స‌మావేశాల‌కు విద్యార్థుల‌ను అనుమ‌తిస్తున్నారు. స‌మావేశాల‌ను వారు ప్ర‌త్య‌క్షంగా…

2 hours ago

ఈసారి డీఎస్సీలో వారిపైనే ప్రత్యేక దృష్టి?

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…

2 hours ago

ఉస్తాద్ బిజినెస్ కెపాసిటీ ఎంత

ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…

5 hours ago