Political News

నాటి నా విజన్ తో నేడు అద్భుత ఫలితాలు: చంద్రబాబు

టెక్నాలజీ రంగంలో తెలుగు ప్రజలు ఇప్పుడు విశ్వవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. ఐటీలో మేటి సంస్థలు మైక్రోసాఫ్ట్, గూగుల్ లకు భారతీయులు… అది కూడా తెలుగు వారు అయిన సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ లు నేతృత్వం వహిస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి ఐటీ సంస్థల్లో కనీసం ఒక్క తెలుగు టెకీ అయినా తప్పనిసరిగా ఉంటున్నారన్నది అతిశయోక్తి అయితే కాదు. ఎక్కడికెళ్లినా… తెలుగు ప్రజలు సత్తా చాటుతూ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. ఈ విషయాన్ని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఎప్పటికప్పుడు మనకు గుర్తు చేస్తూనే ఉంటారు. తెలుగువారు ఇప్పుడు సత్తా చాటడానికి గల కారణాలు ఏమిటన్న దానిపైనా ఆయన తనదైన శలి విజన్ ను ఆవిష్కరిస్తూ ఉంటారు.

తాజాగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాలుపంచుకునే నిమిత్తం దావోస్ వెళ్లిన చంద్రబాబు… సదస్సులో రెండో రోజైన మంగళవారం గ్రీన్ ఎనర్జీపై జరిగిన సమావేశంలో చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. ఏపీలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రూ.2 కోట్ల భారీ పెట్టుబడితో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని వేదికపై ప్రస్తావించిన చంద్రబాబు… భవిష్యత్తు అంతా గ్రీన్ ఎనర్జీదేనని చెప్పారు. గ్రీన్ ఎనర్జీకి ఏపీ కేంద్రంగా మారుతుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. తెలుగు నేల ఎప్పుడైనా నూతన ఆవిష్కరణలకు స్వాగతం పలుకుతుందని తెలిపారు. అందులో భాగంగా 25 ఏళ్ల క్రితం జరిగిన పరిణామాలను చంద్రబాబు వివరించారు.

1990లో భారత్ లో ఆర్థిక సంస్కరణలకు బీజం పడగా… అదే సమయంలో బిల్ గేట్స్ ఇంటర్నెట్ ను కనిపెట్టారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. సరికొత్తగా అందుబాటులోకి వచ్చిన సదరు ఇంటర్నెట్ ను ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దిశగా ఆలోచన చేసిన తాను…బిల్ గేట్స్ సహకారంతోనే ఆధునిక సాంకేతికతను ఏపీలోకి ఆహ్వానించానన్నారు. నాడు తన ఆసక్తిని గమనించిన బిల్ గేట్స్ తన సంస్థకు చెందిన మైక్రోసాఫ్ట్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ఒప్పుకున్నారని గుర్తు చేశారు. ఈ కేంద్రం భారత ఐటీ రంగానికి… ప్రత్యేకించి హైదరాబాద్ ఈ మేర అభివృద్ధి సాధించడానికి కీలక అడుగు పడేలా చేసిందన్నారు. నాడు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కు రావడంతోనే నేడు సత్య నాదెళ్ల ఆ సంస్థకు సీఈఓ కాగలిగారన్నారు. ఓ విజన్ తో నాడు ముందుకు వెళ్లిన కారణంగానే… నేడు తెలుగు ప్రజలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు.

ప్రస్తుతం ప్రపంచం సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగుతోందని చంద్రబాబు అన్నారు. అలాంటి నూతన ఆవిష్కరణలను అందిపుచ్చుకోవాలంటే… సుస్థిర ప్రభుత్వాలు ఉండాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆ విషయంలో భారత్ ఇతర అన్ని దేశాల కంటే కూడామెరుగైన పరిస్థితిలో ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఓ స్పష్టమైన విజన్ తో ముందుకు సాగుతున్నారని తెలిపారు. అంతేకాకుండా ఎప్పుడు ఏ నిర్ణయాన్ని తీసుకోవాలన్న అవగాహన కూడా మోదీకి ఉందన్నారు. మోదీ లాంటి విజన్ ఉన్న నేత.. భారత్ కు పాలకుడిగా ఉండటం మనం చేసుకున్న అదృష్టమన్నారు. మోదీ మార్గదర్శకత్వంలో బారత్ మంచి పురోభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. ఈ వృద్ధిలో తెలుగు వారు కూడా కీలక బూమిక పోషించడం ఖాయమేనని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

This post was last modified on January 21, 2025 6:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

శంకర్‌ డ్రీమ్ ప్రాజెక్టులో ధనుష్?

ఒకప్పుడు శంకర్‌తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…

22 minutes ago

క్రికెట్ మ్యాచ్ గురించి ఎందుకు జగన్?

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…

32 minutes ago

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

1 hour ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

2 hours ago

వారణాసికి అన్నీ పక్కా ప్లానింగ్

రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…

3 hours ago

ఫస్ట్ టైమ్.. అసెంబ్లీలో చే’నేత’ స్టాళ్లు

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో ప‌లు ఆసక్తిక‌ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ స‌మావేశాల‌కు విద్యార్థుల‌ను అనుమ‌తిస్తున్నారు. స‌మావేశాల‌ను వారు ప్ర‌త్య‌క్షంగా…

3 hours ago