మంచు మోహన్ బాబు కుటుంబంలో వివాదం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పోలీసులు, పెద్దమనుషులు, కోర్టుల జోక్యంతో ఆ వివాదం కాస్త సద్దుమణిగింది. అయితే, సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుపతిలోని ఎంబీయూ దగ్గర మనోజ్ ఫ్లెక్సీలు తీసివేయడంతో ఈ వివాదం మళ్లీ రాజుకుంది.
ఈ క్రమంలోనే యూనివర్సిటీలోనికి మనోజ్, మౌనికలను వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి వెళ్లిపోయిన మనోజ్ దంపతులు….మంత్రి నారా లోకేశ్ తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మౌనికతో పాటు నారావారిపల్లెకు వెళ్లిన మనోజ్…నారా లోకేశ్ తో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య సమకాలీన రాజకీయాలు, సినిమాలు, మంచు మోహన్ బాబుతో వివాదం వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మనోజ్, మౌనికలు రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే లోకేశ్ తో ఈ దంపతుల భేటీ హాట్ టాపిక్ గా మారింది. టీడీపీలోకి మంచు మనోజ్ రాబోతున్నారా? లోకేశ్ తో అందుకే భేటీ అయ్యారా? అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది.
అయితే, ఆల్రెడీ కొద్ది రోజుల క్రితం లోకేశ్ తో మంచు విష్ణు భేటీ అయ్యారు. ఇక, చంద్రబాబుతో కలిసి మోహన్ బాబు దిగిన ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలు, లోకేశ్ తో విష్ణు ఉన్న ఫొటోల ఫ్లెక్సీలు తిరుపతిలో కనిపించాయి.
దీంతో, వారిద్దరూ టీడీపీకి మద్దతుగా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో లోకేశ్ తో మనోజ్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. లోకేశ్ తో భేటీ తర్వాత మనోజ్ దంపుతులు రంగంపేటలో జల్లికట్టు ఉత్సవాలు వీక్షించేందుకు వెళ్లారు.
This post was last modified on January 16, 2025 10:12 am
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఇమేజ్ ఉన్న హీరోలకు ఎదురయ్యే డైలమా ఒకటుంది. అదే వెబ్ సిరీస్ లకు ఎస్ చెప్పాలా వద్దాని. నాగ చైతన్య…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…