మంచు మోహన్ బాబు కుటుంబంలో వివాదం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పోలీసులు, పెద్దమనుషులు, కోర్టుల జోక్యంతో ఆ వివాదం కాస్త సద్దుమణిగింది. అయితే, సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుపతిలోని ఎంబీయూ దగ్గర మనోజ్ ఫ్లెక్సీలు తీసివేయడంతో ఈ వివాదం మళ్లీ రాజుకుంది.
ఈ క్రమంలోనే యూనివర్సిటీలోనికి మనోజ్, మౌనికలను వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి వెళ్లిపోయిన మనోజ్ దంపతులు….మంత్రి నారా లోకేశ్ తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మౌనికతో పాటు నారావారిపల్లెకు వెళ్లిన మనోజ్…నారా లోకేశ్ తో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య సమకాలీన రాజకీయాలు, సినిమాలు, మంచు మోహన్ బాబుతో వివాదం వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మనోజ్, మౌనికలు రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే లోకేశ్ తో ఈ దంపతుల భేటీ హాట్ టాపిక్ గా మారింది. టీడీపీలోకి మంచు మనోజ్ రాబోతున్నారా? లోకేశ్ తో అందుకే భేటీ అయ్యారా? అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది.
అయితే, ఆల్రెడీ కొద్ది రోజుల క్రితం లోకేశ్ తో మంచు విష్ణు భేటీ అయ్యారు. ఇక, చంద్రబాబుతో కలిసి మోహన్ బాబు దిగిన ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలు, లోకేశ్ తో విష్ణు ఉన్న ఫొటోల ఫ్లెక్సీలు తిరుపతిలో కనిపించాయి.
దీంతో, వారిద్దరూ టీడీపీకి మద్దతుగా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో లోకేశ్ తో మనోజ్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. లోకేశ్ తో భేటీ తర్వాత మనోజ్ దంపుతులు రంగంపేటలో జల్లికట్టు ఉత్సవాలు వీక్షించేందుకు వెళ్లారు.
This post was last modified on January 16, 2025 10:12 am
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…