తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి బోర్డుకు చాలా విశిష్ఠత ఉంది. ఎన్టీఆర్ హయాంలో తొలిసారి ఆరుగురు సభ్యులతో ఏర్పడిన బోర్డులో.. ప్రస్తుతం 52 మంది వరకు ఉన్నారు. ప్రతి నెల లేదా.. నిర్ణీత సమయాల్లో బోర్డు సభ్యులు సమావేశమై తిరు మలలో చేయాల్సిన పనులు, ఉన్నఖర్చులు.. ఆదాయ వ్యయాలు వంటివాటిపై నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా ఏటా నిర్వహించే కార్యక్రమాలపై ప్రణాళికలు రెడీ చేసుకుంటారు. ఈ బోర్డు సభ్యులు తీసుకున్న నిర్ణయాలను అధికారులు అమలు చేస్తారు.
తాజాగా టీటీడీ బోర్డు సమావేశం జరిగింది. చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో బోర్డు చరిత్రలో ఇప్పటి వరకు జరగని ఘటన ఒకటి జరగడం విశేషం.అదే.. ‘సంతాపం’. ఇప్పటి వరకు తిరుమలలో సంతాపం అన్న మాటే వినిపించలేదు. కానీ, తాజాగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుపతిలో ఇచ్చే టోకెన్ల కార్యక్రమంలో జరిగిన తొక్కిసలా టలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. ఈ ఘటన రాష్ట్రంలోనే కాకుండా.. దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. ఆవేదన మిగిల్చింది. ఈ నేపథ్యంలో మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ తిరుమల తిరుపతి పాలక మండలి సంతాపం తెలిపింది.
ఇలా జరగడం ఇదే తొలిసారి. అయితే.. ఇలా చేయడం ద్వారా మృతుల కుటుంబాలకు టీటీడీ భరోసా కల్పించడంతోపాటు.. వారికి అండగా ఉన్నామన్న సంకేతాలు ఇచ్చినట్టు అయిందని.. చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఇక, ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించడంతోపాటు.. పరిహారం అందించేందుకు నిర్ణయించారు. మృతుల కుటుంబ సభ్యుల చదువులకు అయ్యే ఖర్చును టీటీడీ భరిస్తుందని, టీటీడీ సభ్యులు స్వయంగా వెళ్లి నష్టపరిహారాన్ని అందిస్తారని నాయుడు పేర్కొన్నారు. కాగా, తొక్కిసలాట ఘటనపై జ్యూడీషియల్ విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటాన్నారు. చనిపోయిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం కల్పిస్తామన్నారు.
This post was last modified on January 11, 2025 10:21 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…