Political News

టీటీడీ బోర్డు మీటింగ్‌లో ఫ‌స్ట్ టైమ్‌.. ఏం జ‌రిగింది?

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి బోర్డుకు చాలా విశిష్ఠ‌త ఉంది. ఎన్టీఆర్ హ‌యాంలో తొలిసారి ఆరుగురు స‌భ్యుల‌తో ఏర్ప‌డిన బోర్డులో.. ప్ర‌స్తుతం 52 మంది వ‌ర‌కు ఉన్నారు. ప్ర‌తి నెల లేదా.. నిర్ణీత స‌మ‌యాల్లో బోర్డు స‌భ్యులు స‌మావేశమై తిరు మ‌లలో చేయాల్సిన ప‌నులు, ఉన్న‌ఖ‌ర్చులు.. ఆదాయ వ్య‌యాలు వంటివాటిపై నిర్ణ‌యాలు తీసుకుంటారు. అదేవిధంగా ఏటా నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌ణాళిక‌లు రెడీ చేసుకుంటారు. ఈ బోర్డు స‌భ్యులు తీసుకున్న నిర్ణ‌యాల‌ను అధికారులు అమ‌లు చేస్తారు.

తాజాగా టీటీడీ బోర్డు స‌మావేశం జ‌రిగింది. చైర్మ‌న్ బీఆర్ నాయుడు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన అత్య‌వ‌స‌ర స‌మావేశంలో బోర్డు చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌ని ఘట‌న ఒకటి జ‌ర‌గ‌డం విశేషం.అదే.. ‘సంతాపం’. ఇప్ప‌టి వ‌ర‌కు తిరుమ‌ల‌లో సంతాపం అన్న మాటే వినిపించ‌లేదు. కానీ, తాజాగా వైకుంఠ ఏకాద‌శిని పుర‌స్క‌రించుకుని తిరుప‌తిలో ఇచ్చే టోకెన్ల కార్య‌క్ర‌మంలో జ‌రిగిన తొక్కిస‌లా టలో ఆరుగురు భ‌క్తులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న రాష్ట్రంలోనే కాకుండా.. దేశ‌వ్యాప్తంగా కూడా సంచ‌ల‌నం రేపింది. ఆవేద‌న మిగిల్చింది. ఈ నేప‌థ్యంలో మృతుల ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటూ తిరుమ‌ల తిరుప‌తి పాల‌క మండలి సంతాపం తెలిపింది.

ఇలా జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి. అయితే.. ఇలా చేయ‌డం ద్వారా మృతుల కుటుంబాల‌కు టీటీడీ భ‌రోసా క‌ల్పించ‌డంతోపాటు.. వారికి అండ‌గా ఉన్నామ‌న్న సంకేతాలు ఇచ్చిన‌ట్టు అయింద‌ని.. చైర్మ‌న్ బీఆర్ నాయుడు తెలిపారు. ఇక‌, ఈ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. మృతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించ‌డంతోపాటు.. ప‌రిహారం అందించేందుకు నిర్ణ‌యించారు. మృతుల కుటుంబ సభ్యుల చదువులకు అయ్యే ఖర్చును టీటీడీ భరిస్తుందని, టీటీడీ స‌భ్యులు స్వయంగా వెళ్లి నష్టపరిహారాన్ని అందిస్తార‌ని నాయుడు పేర్కొన్నారు. కాగా, తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై జ్యూడీషియ‌ల్ విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటాన్నారు. చనిపోయిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం కల్పిస్తామ‌న్నారు.

This post was last modified on January 11, 2025 10:21 am

Share
Show comments
Published by
Satya
Tags: BR NaiduTTD

Recent Posts

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…

4 minutes ago

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

6 hours ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

8 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

8 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

9 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

10 hours ago