Political News

టీటీడీ బోర్డు మీటింగ్‌లో ఫ‌స్ట్ టైమ్‌.. ఏం జ‌రిగింది?

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి బోర్డుకు చాలా విశిష్ఠ‌త ఉంది. ఎన్టీఆర్ హ‌యాంలో తొలిసారి ఆరుగురు స‌భ్యుల‌తో ఏర్ప‌డిన బోర్డులో.. ప్ర‌స్తుతం 52 మంది వ‌ర‌కు ఉన్నారు. ప్ర‌తి నెల లేదా.. నిర్ణీత స‌మ‌యాల్లో బోర్డు స‌భ్యులు స‌మావేశమై తిరు మ‌లలో చేయాల్సిన ప‌నులు, ఉన్న‌ఖ‌ర్చులు.. ఆదాయ వ్య‌యాలు వంటివాటిపై నిర్ణ‌యాలు తీసుకుంటారు. అదేవిధంగా ఏటా నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌ణాళిక‌లు రెడీ చేసుకుంటారు. ఈ బోర్డు స‌భ్యులు తీసుకున్న నిర్ణ‌యాల‌ను అధికారులు అమ‌లు చేస్తారు.

తాజాగా టీటీడీ బోర్డు స‌మావేశం జ‌రిగింది. చైర్మ‌న్ బీఆర్ నాయుడు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన అత్య‌వ‌స‌ర స‌మావేశంలో బోర్డు చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌ని ఘట‌న ఒకటి జ‌ర‌గ‌డం విశేషం.అదే.. ‘సంతాపం’. ఇప్ప‌టి వ‌ర‌కు తిరుమ‌ల‌లో సంతాపం అన్న మాటే వినిపించ‌లేదు. కానీ, తాజాగా వైకుంఠ ఏకాద‌శిని పుర‌స్క‌రించుకుని తిరుప‌తిలో ఇచ్చే టోకెన్ల కార్య‌క్ర‌మంలో జ‌రిగిన తొక్కిస‌లా టలో ఆరుగురు భ‌క్తులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న రాష్ట్రంలోనే కాకుండా.. దేశ‌వ్యాప్తంగా కూడా సంచ‌ల‌నం రేపింది. ఆవేద‌న మిగిల్చింది. ఈ నేప‌థ్యంలో మృతుల ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటూ తిరుమ‌ల తిరుప‌తి పాల‌క మండలి సంతాపం తెలిపింది.

ఇలా జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి. అయితే.. ఇలా చేయ‌డం ద్వారా మృతుల కుటుంబాల‌కు టీటీడీ భ‌రోసా క‌ల్పించ‌డంతోపాటు.. వారికి అండ‌గా ఉన్నామ‌న్న సంకేతాలు ఇచ్చిన‌ట్టు అయింద‌ని.. చైర్మ‌న్ బీఆర్ నాయుడు తెలిపారు. ఇక‌, ఈ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. మృతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించ‌డంతోపాటు.. ప‌రిహారం అందించేందుకు నిర్ణ‌యించారు. మృతుల కుటుంబ సభ్యుల చదువులకు అయ్యే ఖర్చును టీటీడీ భరిస్తుందని, టీటీడీ స‌భ్యులు స్వయంగా వెళ్లి నష్టపరిహారాన్ని అందిస్తార‌ని నాయుడు పేర్కొన్నారు. కాగా, తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై జ్యూడీషియ‌ల్ విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటాన్నారు. చనిపోయిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం కల్పిస్తామ‌న్నారు.

This post was last modified on January 11, 2025 10:21 am

Share
Show comments
Published by
Satya
Tags: BR NaiduTTD

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

45 minutes ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

1 hour ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

2 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

3 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

4 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

5 hours ago