Political News

టీటీడీ బోర్డు మీటింగ్‌లో ఫ‌స్ట్ టైమ్‌.. ఏం జ‌రిగింది?

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి బోర్డుకు చాలా విశిష్ఠ‌త ఉంది. ఎన్టీఆర్ హ‌యాంలో తొలిసారి ఆరుగురు స‌భ్యుల‌తో ఏర్ప‌డిన బోర్డులో.. ప్ర‌స్తుతం 52 మంది వ‌ర‌కు ఉన్నారు. ప్ర‌తి నెల లేదా.. నిర్ణీత స‌మ‌యాల్లో బోర్డు స‌భ్యులు స‌మావేశమై తిరు మ‌లలో చేయాల్సిన ప‌నులు, ఉన్న‌ఖ‌ర్చులు.. ఆదాయ వ్య‌యాలు వంటివాటిపై నిర్ణ‌యాలు తీసుకుంటారు. అదేవిధంగా ఏటా నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌ణాళిక‌లు రెడీ చేసుకుంటారు. ఈ బోర్డు స‌భ్యులు తీసుకున్న నిర్ణ‌యాల‌ను అధికారులు అమ‌లు చేస్తారు.

తాజాగా టీటీడీ బోర్డు స‌మావేశం జ‌రిగింది. చైర్మ‌న్ బీఆర్ నాయుడు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన అత్య‌వ‌స‌ర స‌మావేశంలో బోర్డు చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌ని ఘట‌న ఒకటి జ‌ర‌గ‌డం విశేషం.అదే.. ‘సంతాపం’. ఇప్ప‌టి వ‌ర‌కు తిరుమ‌ల‌లో సంతాపం అన్న మాటే వినిపించ‌లేదు. కానీ, తాజాగా వైకుంఠ ఏకాద‌శిని పుర‌స్క‌రించుకుని తిరుప‌తిలో ఇచ్చే టోకెన్ల కార్య‌క్ర‌మంలో జ‌రిగిన తొక్కిస‌లా టలో ఆరుగురు భ‌క్తులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న రాష్ట్రంలోనే కాకుండా.. దేశ‌వ్యాప్తంగా కూడా సంచ‌ల‌నం రేపింది. ఆవేద‌న మిగిల్చింది. ఈ నేప‌థ్యంలో మృతుల ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటూ తిరుమ‌ల తిరుప‌తి పాల‌క మండలి సంతాపం తెలిపింది.

ఇలా జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి. అయితే.. ఇలా చేయ‌డం ద్వారా మృతుల కుటుంబాల‌కు టీటీడీ భ‌రోసా క‌ల్పించ‌డంతోపాటు.. వారికి అండ‌గా ఉన్నామ‌న్న సంకేతాలు ఇచ్చిన‌ట్టు అయింద‌ని.. చైర్మ‌న్ బీఆర్ నాయుడు తెలిపారు. ఇక‌, ఈ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. మృతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించ‌డంతోపాటు.. ప‌రిహారం అందించేందుకు నిర్ణ‌యించారు. మృతుల కుటుంబ సభ్యుల చదువులకు అయ్యే ఖర్చును టీటీడీ భరిస్తుందని, టీటీడీ స‌భ్యులు స్వయంగా వెళ్లి నష్టపరిహారాన్ని అందిస్తార‌ని నాయుడు పేర్కొన్నారు. కాగా, తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై జ్యూడీషియ‌ల్ విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటాన్నారు. చనిపోయిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం కల్పిస్తామ‌న్నారు.

This post was last modified on January 11, 2025 10:21 am

Share
Show comments
Published by
Satya
Tags: BR NaiduTTD

Recent Posts

ఏప్రిల్ నెలను వారణాసే కాపాడాలి

టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…

1 hour ago

రాకీ భాయ్ తిరిగి వస్తాడా?

కొన్ని క‌థ‌లు ముగిసిపోవ‌డాన్ని ప్రేక్ష‌కులు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. వాటికి కొన‌సాగింపు ఉంటేనే బాగుంటుంద‌ని ఆశిస్తారు. వాటి మేక‌ర్స్ కూడా ఆ…

2 hours ago

బాలయ్య మూవీ అంటే కొరటాలకు సవాలే

దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…

2 hours ago

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

6 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

6 hours ago

‘చంద్రబాబు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు’

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ప్ర‌తిప‌క్ష(ప్ర‌ధాన కాదు) నాయ‌కుడు, వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు రాష్ట్రంలో అన్యాయంగా…

7 hours ago