Political News

నా గాయాలకు పిఠాపురం ప్రజలు మందు వేశారు: పవన్

2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కుంగిపోని పవన్ 2024 ఎన్నికల్లో పిఠాపురంలో అఖండ విజయం సాధించారు. తనతోపాటు తన పార్టీ నుంచి పోటీ చేసిన 21 మంది సభ్యులను గెలిపించుకొని 100 శాతం స్ట్రైక్ రేట్ తో అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా పిఠాపురంలో పర్యటిస్తున్న ఆ ప్రాంత ప్రజలనుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

తన గాయాలకు పిఠాపురం ప్రజలు మందు వేశారని పవన్ అన్నారు. తనకు పని చేయడం మాత్రమే వచ్చని, విజయం గురించి తెలీదని చెప్పారు. అటువంటిది, తనకు పిఠాపురం ప్రజలు ఘన విజయం అందించారని ప్రశంసించారు. తన గెలుపు ఆంధ్రా ఆత్మ గౌరవం అని, జన్మంతా పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు.

తిరుమలలో తొక్కిసలాట ఘటన బాధించిందని, సంక్రాంతికి పిఠాపురంలో ఊరంతా పందిరి వేద్దాం అనుకున్నానని, కానీ తిరుమల ఘటనతో సంబరాలు తగ్గించానని చెప్పారు. కుదిరితే దసరా బాగా చేసుకుందామని తెలిపారు. కూటమి విజయం ప్రజలకు గెలుపని.. రాష్ట్రం గెలుపని అన్నారు. ప్రజల బలం వల్ల రాష్ట్రానికి 2 లక్షల 8 కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ప్రభుత్వ జీతంతో బతికిన కుటుంబం తనదని, ఆ రుణం తీర్చుకోవాలని అన్నారు.

కూటమి పాలనపై తృప్తి లేదని వైసీపీ నేతలు అంటున్నారని, 6 నెలల్లో చాలా చేశామని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 260 గోకులాలు నిర్మిస్తే, 6 నెలల్లో 12,500 గోకులాలు నిర్మించామని చెప్పారు. పాడి రైతులు గుజరాత్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. స్కాముల్లో వైసీపీ ప్రభుత్వం రికార్డ్ సృష్టించిందని, తమ ప్రభుత్వం పెన్షన్ల పెంపు, అభివృద్ధిలో రికార్డులు సృష్టిస్తోందని చెప్పారు. ఓట్లు కోసం బుగ్గలు నిమరడం, తలకాయలు నిమరడం కాదని పరోక్షంగా జగన్ పై సెటైర్లు వేశారు. వేల కోట్ల రూపాయలను వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఏడీబీ రోడ్డును గత ప్రభుత్వం ఐదేళ్లు వదిలేసిందని విమర్శించారు.

Satya

Recent Posts

దేశంలో ఒకే ఒక్కడు… మోడీ రికార్డ్‌!!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తాజాగా స‌రికొత్త రికార్డు సృష్టించారు. దేశాన్ని సుదీర్ఘ‌కాలం పాలించిన ప్ర‌ధాన మంత్రిగా ఇప్ప‌టి వ‌ర‌కు…

12 minutes ago

పది మెట్లు ఎక్కేసిన రామ్ చరణ్

పెద్ది కమర్షియల్ రేంజ్, వసూళ్ల లెక్కలు ఇంకా చాలా దూరం తర్వాత డిస్కస్ చేయాల్సిన మ్యాటర్. కానీ ముందే మాట్లాడుకోవాల్సిన…

50 minutes ago

కాంగ్రెస్ కు ఎంపీ సీటు… విజయ్ వ్యూహం అదుర్స్?

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్… పాలనలో తనదైన శైలి కొత్త తరహాతో దూసుకుపోతున్నారు. అంతేకాదండోయ్..…

2 hours ago

తెలుగు రాష్ట్రాల థియేటర్లు ‘పెద్ది’ఫైడ్

నాలుగు నెలల తర్వాత ఏపీ తెలంగాణ థియేటర్లు నిండుగా కళకళలాడుతూ కనిపించాయి. కారణం పెద్ది. ఒక పెద్ద స్టార్ హీరో…

2 hours ago

రామాయణ ఇంకెప్పుడు మేలుకుంటుంది

ఇండియా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకుంటున్న రామాయణ విడుదలకు జూన్ మినహాయిస్తే ఇంకో నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది.…

7 hours ago

పెద్దోళ్ల కమిటీ… జగన్ కు నచ్చట్లేదా?

వైసీపీలో పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల్లో ప‌రాజయం త‌ర్వాత‌.. జ‌గ‌న్‌.. పీఏసీకి…

11 hours ago