2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కుంగిపోని పవన్ 2024 ఎన్నికల్లో పిఠాపురంలో అఖండ విజయం సాధించారు. తనతోపాటు తన పార్టీ నుంచి పోటీ చేసిన 21 మంది సభ్యులను గెలిపించుకొని 100 శాతం స్ట్రైక్ రేట్ తో అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా పిఠాపురంలో పర్యటిస్తున్న ఆ ప్రాంత ప్రజలనుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
తన గాయాలకు పిఠాపురం ప్రజలు మందు వేశారని పవన్ అన్నారు. తనకు పని చేయడం మాత్రమే వచ్చని, విజయం గురించి తెలీదని చెప్పారు. అటువంటిది, తనకు పిఠాపురం ప్రజలు ఘన విజయం అందించారని ప్రశంసించారు. తన గెలుపు ఆంధ్రా ఆత్మ గౌరవం అని, జన్మంతా పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు.
తిరుమలలో తొక్కిసలాట ఘటన బాధించిందని, సంక్రాంతికి పిఠాపురంలో ఊరంతా పందిరి వేద్దాం అనుకున్నానని, కానీ తిరుమల ఘటనతో సంబరాలు తగ్గించానని చెప్పారు. కుదిరితే దసరా బాగా చేసుకుందామని తెలిపారు. కూటమి విజయం ప్రజలకు గెలుపని.. రాష్ట్రం గెలుపని అన్నారు. ప్రజల బలం వల్ల రాష్ట్రానికి 2 లక్షల 8 కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ప్రభుత్వ జీతంతో బతికిన కుటుంబం తనదని, ఆ రుణం తీర్చుకోవాలని అన్నారు.
కూటమి పాలనపై తృప్తి లేదని వైసీపీ నేతలు అంటున్నారని, 6 నెలల్లో చాలా చేశామని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 260 గోకులాలు నిర్మిస్తే, 6 నెలల్లో 12,500 గోకులాలు నిర్మించామని చెప్పారు. పాడి రైతులు గుజరాత్ను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. స్కాముల్లో వైసీపీ ప్రభుత్వం రికార్డ్ సృష్టించిందని, తమ ప్రభుత్వం పెన్షన్ల పెంపు, అభివృద్ధిలో రికార్డులు సృష్టిస్తోందని చెప్పారు. ఓట్లు కోసం బుగ్గలు నిమరడం, తలకాయలు నిమరడం కాదని పరోక్షంగా జగన్ పై సెటైర్లు వేశారు. వేల కోట్ల రూపాయలను వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఏడీబీ రోడ్డును గత ప్రభుత్వం ఐదేళ్లు వదిలేసిందని విమర్శించారు.
This post was last modified on January 11, 2025 10:18 am
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…
ఇప్పుడు అన్ని పరిశ్రమల్లో, సోషల్ మీడియాలో హాట్ గా ఉన్న డిస్కషన్స్ లో రామాయణ టీజర్ దే ఫస్ట్ ప్లేస్.…
సమాజం ఎంతో అభివృద్ధి చెందుతున్నా... లింగ బేధానికి దిక్కే లేకున్నా.. మగ పిల్లలే కావాలి... ఆడపిల్లలు వద్దన్న భావన ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదు. అందుకు నిదర్శనమే…
విలక్షణమైన కథలు ఎంచుకుంటాడని పేరున్న అడివి శేష్ సినిమా వచ్చి చాలా కాలమయ్యింది. హిట్ 2 ది సెకండ్ కేస్…
సంతోష్ శోభన్, సంగీత్ శోభన్. ఈ రెండు పేర్లు చూసి ఇండస్ట్రీలో వాళ్లే అప్పుడప్పుడూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మొన్న…