Political News

బీజేపీతో జగన్ ది అక్రమ బంధం: వైఎస్ షర్మిల

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను కించపరిచేలా మాట్లాడిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వైఖరికి నిరసనగా ఆమె ఈ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన అమిత్ షా తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అమిత్ షా రాజీనామా చేయని పక్షంలో ప్రధాని నరేంద్రమ మోదీ ఆయనను తన కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ఆమె కోరారు.

కాంగ్రెస్ మినహా పార్లమెుంటులోని దాదాపుగా అన్ని పార్టీల ఎంపీలు అమిత్ షా వ్యాఖ్యలను ఖండించడానికే భయపడిపోయారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలోని అధికార కూటమిలోని టీడీపీ, జనసేనలు సైతం అమిత్ షా వ్యాఖ్యలను ఖండించే సాహసం చేయలేకపోయాయని ఆమె అన్నారు. ఏపీలో దళితులు, బీసీలతో ఓట్లు వేయించుకున్న టీడీపీ, జనసేనలు ఆ వర్గాలకు ఆశాదీపమైన అంబేద్కర్ ను అవమానిస్తే చోద్యం చూస్తూ ఉండిపోయాయని ఆమె మండిపడ్డారు. ఇప్పటికైనా ఆ పార్టీలు తమ వైఖరిని మార్చుకోవాలని, రాజ్యాంగ నిర్మాతను గౌరవించే పార్టీలతో స్నేహం చేయాలని సూచించారు.

ఇక తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీని కూడా ఆమె వదిలి పెట్టలేదు. ఏపీలో దళితుగు, బీసీల ఓట్లతో అధికారం అనుభవించిన వైసీపీ… అంబేద్కర్ ను అమిత్ షా అవమానిస్తే కనీసం నోరు మెదిపేందుకు కూడా ఆ పార్టీ సాహసించలేదని ఆమె ఆరోపించారు. కేంద్రంలో అధికారంలోని బీజేపీతో జగన్ ది అక్రమ సంబంధమని కూడా ఆమె ఒకింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ కారణంగానే భిన్న మతాలు, కులాల సమాహారమైన భారత్ ఇప్పటికీ ఏకతాటిపై నడుస్తుందన్న విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలని షర్మిల పిలుపునిచ్చారు.

This post was last modified on January 10, 2025 1:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

29 minutes ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

4 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

4 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

5 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

7 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

7 hours ago