ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను కించపరిచేలా మాట్లాడిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వైఖరికి నిరసనగా ఆమె ఈ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన అమిత్ షా తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అమిత్ షా రాజీనామా చేయని పక్షంలో ప్రధాని నరేంద్రమ మోదీ ఆయనను తన కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ఆమె కోరారు.
కాంగ్రెస్ మినహా పార్లమెుంటులోని దాదాపుగా అన్ని పార్టీల ఎంపీలు అమిత్ షా వ్యాఖ్యలను ఖండించడానికే భయపడిపోయారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలోని అధికార కూటమిలోని టీడీపీ, జనసేనలు సైతం అమిత్ షా వ్యాఖ్యలను ఖండించే సాహసం చేయలేకపోయాయని ఆమె అన్నారు. ఏపీలో దళితులు, బీసీలతో ఓట్లు వేయించుకున్న టీడీపీ, జనసేనలు ఆ వర్గాలకు ఆశాదీపమైన అంబేద్కర్ ను అవమానిస్తే చోద్యం చూస్తూ ఉండిపోయాయని ఆమె మండిపడ్డారు. ఇప్పటికైనా ఆ పార్టీలు తమ వైఖరిని మార్చుకోవాలని, రాజ్యాంగ నిర్మాతను గౌరవించే పార్టీలతో స్నేహం చేయాలని సూచించారు.
ఇక తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీని కూడా ఆమె వదిలి పెట్టలేదు. ఏపీలో దళితుగు, బీసీల ఓట్లతో అధికారం అనుభవించిన వైసీపీ… అంబేద్కర్ ను అమిత్ షా అవమానిస్తే కనీసం నోరు మెదిపేందుకు కూడా ఆ పార్టీ సాహసించలేదని ఆమె ఆరోపించారు. కేంద్రంలో అధికారంలోని బీజేపీతో జగన్ ది అక్రమ సంబంధమని కూడా ఆమె ఒకింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ కారణంగానే భిన్న మతాలు, కులాల సమాహారమైన భారత్ ఇప్పటికీ ఏకతాటిపై నడుస్తుందన్న విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలని షర్మిల పిలుపునిచ్చారు.
This post was last modified on January 10, 2025 1:13 pm
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…