ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను కించపరిచేలా మాట్లాడిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వైఖరికి నిరసనగా ఆమె ఈ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన అమిత్ షా తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అమిత్ షా రాజీనామా చేయని పక్షంలో ప్రధాని నరేంద్రమ మోదీ ఆయనను తన కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ఆమె కోరారు.
కాంగ్రెస్ మినహా పార్లమెుంటులోని దాదాపుగా అన్ని పార్టీల ఎంపీలు అమిత్ షా వ్యాఖ్యలను ఖండించడానికే భయపడిపోయారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలోని అధికార కూటమిలోని టీడీపీ, జనసేనలు సైతం అమిత్ షా వ్యాఖ్యలను ఖండించే సాహసం చేయలేకపోయాయని ఆమె అన్నారు. ఏపీలో దళితులు, బీసీలతో ఓట్లు వేయించుకున్న టీడీపీ, జనసేనలు ఆ వర్గాలకు ఆశాదీపమైన అంబేద్కర్ ను అవమానిస్తే చోద్యం చూస్తూ ఉండిపోయాయని ఆమె మండిపడ్డారు. ఇప్పటికైనా ఆ పార్టీలు తమ వైఖరిని మార్చుకోవాలని, రాజ్యాంగ నిర్మాతను గౌరవించే పార్టీలతో స్నేహం చేయాలని సూచించారు.
ఇక తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీని కూడా ఆమె వదిలి పెట్టలేదు. ఏపీలో దళితుగు, బీసీల ఓట్లతో అధికారం అనుభవించిన వైసీపీ… అంబేద్కర్ ను అమిత్ షా అవమానిస్తే కనీసం నోరు మెదిపేందుకు కూడా ఆ పార్టీ సాహసించలేదని ఆమె ఆరోపించారు. కేంద్రంలో అధికారంలోని బీజేపీతో జగన్ ది అక్రమ సంబంధమని కూడా ఆమె ఒకింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ కారణంగానే భిన్న మతాలు, కులాల సమాహారమైన భారత్ ఇప్పటికీ ఏకతాటిపై నడుస్తుందన్న విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలని షర్మిల పిలుపునిచ్చారు.
This post was last modified on January 10, 2025 1:13 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…