ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను కించపరిచేలా మాట్లాడిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వైఖరికి నిరసనగా ఆమె ఈ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన అమిత్ షా తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అమిత్ షా రాజీనామా చేయని పక్షంలో ప్రధాని నరేంద్రమ మోదీ ఆయనను తన కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ఆమె కోరారు.
కాంగ్రెస్ మినహా పార్లమెుంటులోని దాదాపుగా అన్ని పార్టీల ఎంపీలు అమిత్ షా వ్యాఖ్యలను ఖండించడానికే భయపడిపోయారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలోని అధికార కూటమిలోని టీడీపీ, జనసేనలు సైతం అమిత్ షా వ్యాఖ్యలను ఖండించే సాహసం చేయలేకపోయాయని ఆమె అన్నారు. ఏపీలో దళితులు, బీసీలతో ఓట్లు వేయించుకున్న టీడీపీ, జనసేనలు ఆ వర్గాలకు ఆశాదీపమైన అంబేద్కర్ ను అవమానిస్తే చోద్యం చూస్తూ ఉండిపోయాయని ఆమె మండిపడ్డారు. ఇప్పటికైనా ఆ పార్టీలు తమ వైఖరిని మార్చుకోవాలని, రాజ్యాంగ నిర్మాతను గౌరవించే పార్టీలతో స్నేహం చేయాలని సూచించారు.
ఇక తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీని కూడా ఆమె వదిలి పెట్టలేదు. ఏపీలో దళితుగు, బీసీల ఓట్లతో అధికారం అనుభవించిన వైసీపీ… అంబేద్కర్ ను అమిత్ షా అవమానిస్తే కనీసం నోరు మెదిపేందుకు కూడా ఆ పార్టీ సాహసించలేదని ఆమె ఆరోపించారు. కేంద్రంలో అధికారంలోని బీజేపీతో జగన్ ది అక్రమ సంబంధమని కూడా ఆమె ఒకింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ కారణంగానే భిన్న మతాలు, కులాల సమాహారమైన భారత్ ఇప్పటికీ ఏకతాటిపై నడుస్తుందన్న విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలని షర్మిల పిలుపునిచ్చారు.
This post was last modified on January 10, 2025 1:13 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…