ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ… రాష్ట్ర రాజకీయాల్లో బద్ధ శత్రువులుగా కీచులాడుకుంటున్న ఈ ఇద్దరు నేతలు కలిసే ఫారిన్ ట్రిప్ కు వెళుతున్నారా? అనుకోకండి. ఎందుకంటే… జగన్ పర్సనల్ పని మీద ఫారిన్ ట్రిప్ వెళుతుంటే… చంద్రబాబు మాత్రం సీఎం హోదాలో అదికారిక పర్యటనకు బయలుదేరుతున్నారు. ఇక ఇద్దరూ ఒకే సమయంలో విదేశాలకు వెళుతున్నా…వారి ప్రయాణ మార్గాలు మాత్రం వేర్వేరనే చెప్పాలి. అయితే ఈ నెల 20 నుంచి నాలుగు రోజుల పాటు ఇద్దరు నేతలూ ఫారిన్ లోనే ఉండనున్నారు. అంటే… ఆ రోజుల్లో ఇటు సీఎం చంద్రబాబు, అటు మాజీ సీఎం జగన్ రాష్ట్రానికి దూరంగా విదేశాల్లో ఉంటారన్న మాట.
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ఏటా జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు ఏపీ సీఎం హోదాలో చంద్రబాబు విదేశీ యానానికి వెళుతున్నారు. ఈ నెల 20న బయలుదేరనున్న చంద్రబాబు… నాలుగు రోజుల పాటు దావోస్ లోనే ఉండనున్నారు. అధికారులతో కలిసి వెళుతున్న చంద్రబాబు… అక్కడికి వచ్చే వ్యాపారవేత్తలతో చర్చల్లో పాలుపంచుకుంటారు. ఏపీకి పెట్టుబడులు రాబట్టే దిశగా చంద్రబాబు కృషి చేయనున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం దావోస్ లో ఓ స్టాల్ ను కూడా ఏర్పాటు చేసింది. ఈ స్టాల్, దాని పరిసరాల్లో ఉండనున్న చంద్రబాబు… తనను కలిసే పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. ఏపీలో ఉన్న అపార అవకాశాలను వారి ముందు పెట్టనున్నారు. ఈ సదస్సు ముగియగానే… చంద్రబాబు తిరిగి విజయవాడ వచ్చేస్తారు.
ఇక జగన్ విషయానికి వస్తే… జగన్ కుమార్తె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో విద్యనభ్యసిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం క్రితమే లండన్ వెళ్లిన ఆమె తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన సందర్బంగా జరిగే వేడుకల్లో పాలుపంచుకునేందుకు జగన్ లండన్ వెళుతున్నారు. ఇప్పటికే తన లండన్ టూర్ కు అనుమతి ఇవ్వాలంటూ ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఇదివరకే విచారణను ముగించిన కోర్టు.. గురువారం జగన్ లండన్ టూర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ముందుగా నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ నెల 11న లండన్ ఫ్లైట్ ఎక్కనున్న జగన్… ఈ నెల 30 వరకు అక్కడే ఉండనున్నారు. మొత్తంగా సీఎం, మాజీ సీఎంలు ఇద్దరూ ఒకే సమయంలో విదేశాలకు వెళుతున్న వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది.
This post was last modified on January 9, 2025 8:47 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…