ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ… రాష్ట్ర రాజకీయాల్లో బద్ధ శత్రువులుగా కీచులాడుకుంటున్న ఈ ఇద్దరు నేతలు కలిసే ఫారిన్ ట్రిప్ కు వెళుతున్నారా? అనుకోకండి. ఎందుకంటే… జగన్ పర్సనల్ పని మీద ఫారిన్ ట్రిప్ వెళుతుంటే… చంద్రబాబు మాత్రం సీఎం హోదాలో అదికారిక పర్యటనకు బయలుదేరుతున్నారు. ఇక ఇద్దరూ ఒకే సమయంలో విదేశాలకు వెళుతున్నా…వారి ప్రయాణ మార్గాలు మాత్రం వేర్వేరనే చెప్పాలి. అయితే ఈ నెల 20 నుంచి నాలుగు రోజుల పాటు ఇద్దరు నేతలూ ఫారిన్ లోనే ఉండనున్నారు. అంటే… ఆ రోజుల్లో ఇటు సీఎం చంద్రబాబు, అటు మాజీ సీఎం జగన్ రాష్ట్రానికి దూరంగా విదేశాల్లో ఉంటారన్న మాట.
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ఏటా జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు ఏపీ సీఎం హోదాలో చంద్రబాబు విదేశీ యానానికి వెళుతున్నారు. ఈ నెల 20న బయలుదేరనున్న చంద్రబాబు… నాలుగు రోజుల పాటు దావోస్ లోనే ఉండనున్నారు. అధికారులతో కలిసి వెళుతున్న చంద్రబాబు… అక్కడికి వచ్చే వ్యాపారవేత్తలతో చర్చల్లో పాలుపంచుకుంటారు. ఏపీకి పెట్టుబడులు రాబట్టే దిశగా చంద్రబాబు కృషి చేయనున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం దావోస్ లో ఓ స్టాల్ ను కూడా ఏర్పాటు చేసింది. ఈ స్టాల్, దాని పరిసరాల్లో ఉండనున్న చంద్రబాబు… తనను కలిసే పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. ఏపీలో ఉన్న అపార అవకాశాలను వారి ముందు పెట్టనున్నారు. ఈ సదస్సు ముగియగానే… చంద్రబాబు తిరిగి విజయవాడ వచ్చేస్తారు.
ఇక జగన్ విషయానికి వస్తే… జగన్ కుమార్తె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో విద్యనభ్యసిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం క్రితమే లండన్ వెళ్లిన ఆమె తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన సందర్బంగా జరిగే వేడుకల్లో పాలుపంచుకునేందుకు జగన్ లండన్ వెళుతున్నారు. ఇప్పటికే తన లండన్ టూర్ కు అనుమతి ఇవ్వాలంటూ ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఇదివరకే విచారణను ముగించిన కోర్టు.. గురువారం జగన్ లండన్ టూర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ముందుగా నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ నెల 11న లండన్ ఫ్లైట్ ఎక్కనున్న జగన్… ఈ నెల 30 వరకు అక్కడే ఉండనున్నారు. మొత్తంగా సీఎం, మాజీ సీఎంలు ఇద్దరూ ఒకే సమయంలో విదేశాలకు వెళుతున్న వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…