కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు కం ఏపీ మంత్రి నారా లోకేశ్ తీరు అందరూ మాట్లాడుకునేలా మారటం తెలిసిందే. విపక్షంలో ఉన్నప్పుడు.. పార్టీ కోసం తీవ్రంగా తపించిన ఆయన.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం లోప్రొఫైల్ మొయింటైన్ చేయటం.. అవసరానికి మించి ఎక్కడా కనిపించకపోవటం.. మంత్రిగా తన భాధ్యతలతో పాటు.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టిన వైనం అప్పుడప్పుడు చర్చకు వస్తోంది.
తాజాగా విశాఖపట్నానికి వచ్చిన ప్రధాని మోడీ మనసులోనూ లోకేశ్ ముద్ర పడేలా వ్యవహరించారని చెప్పాలి. దీనికి సంబంధించి చోటు చేసుకున్న ఒక ఆసక్తికర ఉదంతమే కారణమని చెప్పాలి. సభా ప్రాంగణంలోకి వస్తున్న ప్రధాని మోడీని మంతరులు ఆహ్వానించే క్రమంలో.. ఆ వరుసలో లోకేశ్ కూడా ఉన్నారు. మంత్రులంతా ప్రధాని మోడీకి నమస్కరిస్తూ ఉండగా.. వారికి ప్రతి నమస్కారాన్ని తెలియజేసుకుంటూ ముందుకునడుస్తున్న వేళ.. వరుసలో మంత్రి లోకేశ్ కూడా ఉన్నారు.
ప్రధాని మోడీ లోకేశ్ వద్ద కాసేపు ఆగారు. ఆయనకు లోకేశ్ నమస్కారం పెట్టినంతనే.. నీ మీద నాకో కంప్లైంట్ ఉందన్నారు. పక్కనే ఉన్న సీఎం చంద్రబాబు ఆసక్తగా చూడగా.. అదేమిటో మీకు తెలుసు కదా? అంటూ చంద్రబాబు వైపు చూసి మాట్లాడుతూ.. ప్రభుత్వం వచ్చి ఆర్నెల్లు అయ్యింది. ఢిల్లీకి వచ్చి నన్ను ఎందుకు కలవలేదు? కుటుంబంతో వచ్చి నన్ను కలువు అంటూ లోకేశ్ భుజం తట్టారు.
దీనికి స్పందించిన లోకేశ్.. ‘త్వరలోనే వచ్చి కలుస్తా సార్’ అంటూ బదులిచ్చారు. ఈ ఉదంతం ఆసక్తికరంగా మారింది. లోప్రొఫైల్ ను మొయింటైన్ చేసిన లోకేశ్ తీరు.. ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర కూడా రిజిస్టర్ అయ్యిందనటానికి తాజా ఘటన ఒకటిగా చెబుతున్నారు. ఏమైనా.. మోడీ మనసులో తన పేరు రిజిస్టర్ అయ్యేలా చేసుకోవటం లోకేశ్ పనితీరుకు నిదర్శనమంటున్నారు.
This post was last modified on January 9, 2025 3:46 pm
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…