కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు కం ఏపీ మంత్రి నారా లోకేశ్ తీరు అందరూ మాట్లాడుకునేలా మారటం తెలిసిందే. విపక్షంలో ఉన్నప్పుడు.. పార్టీ కోసం తీవ్రంగా తపించిన ఆయన.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం లోప్రొఫైల్ మొయింటైన్ చేయటం.. అవసరానికి మించి ఎక్కడా కనిపించకపోవటం.. మంత్రిగా తన భాధ్యతలతో పాటు.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టిన వైనం అప్పుడప్పుడు చర్చకు వస్తోంది.
తాజాగా విశాఖపట్నానికి వచ్చిన ప్రధాని మోడీ మనసులోనూ లోకేశ్ ముద్ర పడేలా వ్యవహరించారని చెప్పాలి. దీనికి సంబంధించి చోటు చేసుకున్న ఒక ఆసక్తికర ఉదంతమే కారణమని చెప్పాలి. సభా ప్రాంగణంలోకి వస్తున్న ప్రధాని మోడీని మంతరులు ఆహ్వానించే క్రమంలో.. ఆ వరుసలో లోకేశ్ కూడా ఉన్నారు. మంత్రులంతా ప్రధాని మోడీకి నమస్కరిస్తూ ఉండగా.. వారికి ప్రతి నమస్కారాన్ని తెలియజేసుకుంటూ ముందుకునడుస్తున్న వేళ.. వరుసలో మంత్రి లోకేశ్ కూడా ఉన్నారు.
ప్రధాని మోడీ లోకేశ్ వద్ద కాసేపు ఆగారు. ఆయనకు లోకేశ్ నమస్కారం పెట్టినంతనే.. నీ మీద నాకో కంప్లైంట్ ఉందన్నారు. పక్కనే ఉన్న సీఎం చంద్రబాబు ఆసక్తగా చూడగా.. అదేమిటో మీకు తెలుసు కదా? అంటూ చంద్రబాబు వైపు చూసి మాట్లాడుతూ.. ప్రభుత్వం వచ్చి ఆర్నెల్లు అయ్యింది. ఢిల్లీకి వచ్చి నన్ను ఎందుకు కలవలేదు? కుటుంబంతో వచ్చి నన్ను కలువు అంటూ లోకేశ్ భుజం తట్టారు.
దీనికి స్పందించిన లోకేశ్.. ‘త్వరలోనే వచ్చి కలుస్తా సార్’ అంటూ బదులిచ్చారు. ఈ ఉదంతం ఆసక్తికరంగా మారింది. లోప్రొఫైల్ ను మొయింటైన్ చేసిన లోకేశ్ తీరు.. ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర కూడా రిజిస్టర్ అయ్యిందనటానికి తాజా ఘటన ఒకటిగా చెబుతున్నారు. ఏమైనా.. మోడీ మనసులో తన పేరు రిజిస్టర్ అయ్యేలా చేసుకోవటం లోకేశ్ పనితీరుకు నిదర్శనమంటున్నారు.
This post was last modified on January 9, 2025 3:46 pm
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…