కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు కం ఏపీ మంత్రి నారా లోకేశ్ తీరు అందరూ మాట్లాడుకునేలా మారటం తెలిసిందే. విపక్షంలో ఉన్నప్పుడు.. పార్టీ కోసం తీవ్రంగా తపించిన ఆయన.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం లోప్రొఫైల్ మొయింటైన్ చేయటం.. అవసరానికి మించి ఎక్కడా కనిపించకపోవటం.. మంత్రిగా తన భాధ్యతలతో పాటు.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టిన వైనం అప్పుడప్పుడు చర్చకు వస్తోంది.
తాజాగా విశాఖపట్నానికి వచ్చిన ప్రధాని మోడీ మనసులోనూ లోకేశ్ ముద్ర పడేలా వ్యవహరించారని చెప్పాలి. దీనికి సంబంధించి చోటు చేసుకున్న ఒక ఆసక్తికర ఉదంతమే కారణమని చెప్పాలి. సభా ప్రాంగణంలోకి వస్తున్న ప్రధాని మోడీని మంతరులు ఆహ్వానించే క్రమంలో.. ఆ వరుసలో లోకేశ్ కూడా ఉన్నారు. మంత్రులంతా ప్రధాని మోడీకి నమస్కరిస్తూ ఉండగా.. వారికి ప్రతి నమస్కారాన్ని తెలియజేసుకుంటూ ముందుకునడుస్తున్న వేళ.. వరుసలో మంత్రి లోకేశ్ కూడా ఉన్నారు.
ప్రధాని మోడీ లోకేశ్ వద్ద కాసేపు ఆగారు. ఆయనకు లోకేశ్ నమస్కారం పెట్టినంతనే.. నీ మీద నాకో కంప్లైంట్ ఉందన్నారు. పక్కనే ఉన్న సీఎం చంద్రబాబు ఆసక్తగా చూడగా.. అదేమిటో మీకు తెలుసు కదా? అంటూ చంద్రబాబు వైపు చూసి మాట్లాడుతూ.. ప్రభుత్వం వచ్చి ఆర్నెల్లు అయ్యింది. ఢిల్లీకి వచ్చి నన్ను ఎందుకు కలవలేదు? కుటుంబంతో వచ్చి నన్ను కలువు అంటూ లోకేశ్ భుజం తట్టారు.
దీనికి స్పందించిన లోకేశ్.. ‘త్వరలోనే వచ్చి కలుస్తా సార్’ అంటూ బదులిచ్చారు. ఈ ఉదంతం ఆసక్తికరంగా మారింది. లోప్రొఫైల్ ను మొయింటైన్ చేసిన లోకేశ్ తీరు.. ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర కూడా రిజిస్టర్ అయ్యిందనటానికి తాజా ఘటన ఒకటిగా చెబుతున్నారు. ఏమైనా.. మోడీ మనసులో తన పేరు రిజిస్టర్ అయ్యేలా చేసుకోవటం లోకేశ్ పనితీరుకు నిదర్శనమంటున్నారు.
This post was last modified on January 9, 2025 3:46 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…