ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 19వ తేదీ నుంచి పెట్టుబడుల కోసం ప్రపంచ ప్రయాణం చేయనున్నారు. ఏపీలో ఆయన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పెట్టుబడులపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. అనేక సంస్థలను ఇప్పటికే ఆయన రాష్ట్రానికి ఆహ్వానించారు. అదేసమయంలో మరికొన్ని గతంలోనే పెట్టుబడులు పెట్టేందుకు వచ్చి.. వైసీపీ జమానాలు వెనక్కి మళ్లిపోయాయి. వాటిని కూడా తాజాగా చంద్రబాబు ఆహ్వానించారు. త్వరలోనే ఆయా సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇవి కాకుండా.. ప్రత్యేకంగా విదేశీ సంస్థలను ఆహ్వానించేందుకు మంత్రి నారా లోకేష్ రెండు నెలల కిందట అమెరికా పర్యటనకు కూడా వెళ్లారు.
ఇక, ఇప్పుడు దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, మండపల్లి రాంప్రసాద్రెడ్డి, పయ్యావుల కేశవ్ తదితరులు వెళ్తున్నారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ఏటా ప్రపంచ ఆర్థిక వాణిజ్య సదస్సు నిర్వహిస్తారు. ఈ ఏడాది జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు వరకు దావోస్ ఈ సదస్సు జరగనుంది. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’ ఆధ్వర్యంలో ఈ సదస్సు ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడి దారులు, అగ్ర స్థాయి వాణిజ్య వేత్తలు, వ్యాపార వేత్తలు కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోవారిని ఆకర్షించేందుకు చంద్రబాబు బృందం ఈ నెల 19నే దావోస్కు వెళ్లనుంది.
రాష్ట్రంలో ప్రబుత్వం మారిన తర్వాత.. ఏర్పడిన సానుకూల పరిణామాలు, శాంతి భద్రతలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ సందర్భంగా చంద్రబాబు వివరించనున్నారు. అదేసమయంలో కూటమి ప్రభుత్వం పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యాలను కూడా వివరిస్తారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్కిల్ డూయింగ్ బిజినెస్ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయా వివరాలను దావోస్ సదస్సులో వివరించనున్నారు. అదేవిధంగా ‘షేపింగ్ ద ఇంటెలిజెంట్ ఏజ్’ థీమ్ ను పరిచయం చేయనున్నారు. రాష్ట్రంలో సాంకేతిక పాలన, పునరుత్పాదక ఇంధన వనరులు, స్మార్ట్ నగరాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా ప్రపంచ స్థాయి పెట్టుబడి దారులకు వివరించి.. వారిని ఏపీకి రప్పించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
This post was last modified on January 2, 2025 9:37 am
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…