Political News

19 నుంచి చంద్ర‌బాబు పెట్టుబ‌డుల ప్ర‌యాణం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఈ నెల 19వ తేదీ నుంచి పెట్టుబ‌డుల కోసం ప్ర‌పంచ ప్ర‌యాణం చేయ‌నున్నారు. ఏపీలో ఆయ‌న ప‌గ్గాలు చేప‌ట్టిన నాటి నుంచి పెట్టుబ‌డుల‌పై దృష్టి పెట్టిన విష‌యం తెలిసిందే. అనేక సంస్థ‌ల‌ను ఇప్ప‌టికే ఆయ‌న రాష్ట్రానికి ఆహ్వానించారు. అదేస‌మయంలో మ‌రికొన్ని గ‌తంలోనే పెట్టుబ‌డులు పెట్టేందుకు వ‌చ్చి.. వైసీపీ జ‌మానాలు వెన‌క్కి మ‌ళ్లిపోయాయి. వాటిని కూడా తాజాగా చంద్ర‌బాబు ఆహ్వానించారు. త్వ‌ర‌లోనే ఆయా సంస్థ‌లు పెట్టుబ‌డులు పెట్ట‌నున్నాయి. ఇవి కాకుండా.. ప్ర‌త్యేకంగా విదేశీ సంస్థ‌ల‌ను ఆహ్వానించేందుకు మంత్రి నారా లోకేష్ రెండు నెల‌ల కింద‌ట అమెరికా ప‌ర్య‌ట‌న‌కు కూడా వెళ్లారు.

ఇక‌, ఇప్పుడు దావోస్ ప‌ర్య‌ట‌న‌కు సీఎం చంద్ర‌బాబు, మంత్రులు నారా లోకేష్‌, మండ‌ప‌ల్లి రాంప్ర‌సాద్‌రెడ్డి, ప‌య్యావుల కేశ‌వ్ త‌దిత‌రులు వెళ్తున్నారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ఏటా ప్రపంచ ఆర్థిక వాణిజ్య సదస్సు నిర్వహిస్తారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 20 నుంచి 24వ తేదీ వ‌ర‌కు వరకు దావోస్ ఈ సదస్సు జరగనుంది. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’ ఆధ్వర్యంలో ఈ స‌ద‌స్సు ఐదు రోజుల పాటు నిర్వ‌హిస్తారు. ఈ స‌ద‌స్సుకు ప్ర‌పంచ దేశాల నుంచి పెట్టుబ‌డి దారులు, అగ్ర స్థాయి వాణిజ్య వేత్త‌లు, వ్యాపార వేత్త‌లు కూడా హాజ‌రు కానున్నారు. ఈ నేప‌థ్యంలోవారిని ఆక‌ర్షించేందుకు చంద్ర‌బాబు బృందం ఈ నెల 19నే దావోస్‌కు వెళ్ల‌నుంది.

రాష్ట్రంలో ప్ర‌బుత్వం మారిన త‌ర్వాత‌.. ఏర్ప‌డిన సానుకూల ప‌రిణామాలు, శాంతి భ‌ద్ర‌త‌లు, పెట్టుబ‌డుల‌కు ఉన్న అవ‌కాశాల‌ను ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు వివ‌రించ‌నున్నారు. అదేస‌మ‌యంలో కూట‌మి ప్ర‌భుత్వం పెట్టుబ‌డులకు ఇస్తున్న ప్రాధాన్యాల‌ను కూడా వివ‌రిస్తారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్కిల్ డూయింగ్ బిజినెస్‌ను తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయా వివ‌రాల‌ను దావోస్ స‌ద‌స్సులో వివ‌రించ‌నున్నారు. అదేవిధంగా ‘షేపింగ్ ద ఇంటెలిజెంట్ ఏజ్’ థీమ్ ను ప‌రిచ‌యం చేయ‌నున్నారు. రాష్ట్రంలో సాంకేతిక పాల‌న‌, పునరుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రులు, స్మార్ట్ న‌గ‌రాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా ప్ర‌పంచ స్థాయి పెట్టుబ‌డి దారుల‌కు వివ‌రించి.. వారిని ఏపీకి ర‌ప్పించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ ప‌ర్య‌ట‌న సాగ‌నుంద‌ని ముఖ్య‌మంత్రి కార్యాల‌యం తెలిపింది.

This post was last modified on January 2, 2025 9:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

26 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago