Political News

19 నుంచి చంద్ర‌బాబు పెట్టుబ‌డుల ప్ర‌యాణం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఈ నెల 19వ తేదీ నుంచి పెట్టుబ‌డుల కోసం ప్ర‌పంచ ప్ర‌యాణం చేయ‌నున్నారు. ఏపీలో ఆయ‌న ప‌గ్గాలు చేప‌ట్టిన నాటి నుంచి పెట్టుబ‌డుల‌పై దృష్టి పెట్టిన విష‌యం తెలిసిందే. అనేక సంస్థ‌ల‌ను ఇప్ప‌టికే ఆయ‌న రాష్ట్రానికి ఆహ్వానించారు. అదేస‌మయంలో మ‌రికొన్ని గ‌తంలోనే పెట్టుబ‌డులు పెట్టేందుకు వ‌చ్చి.. వైసీపీ జ‌మానాలు వెన‌క్కి మ‌ళ్లిపోయాయి. వాటిని కూడా తాజాగా చంద్ర‌బాబు ఆహ్వానించారు. త్వ‌ర‌లోనే ఆయా సంస్థ‌లు పెట్టుబ‌డులు పెట్ట‌నున్నాయి. ఇవి కాకుండా.. ప్ర‌త్యేకంగా విదేశీ సంస్థ‌ల‌ను ఆహ్వానించేందుకు మంత్రి నారా లోకేష్ రెండు నెల‌ల కింద‌ట అమెరికా ప‌ర్య‌ట‌న‌కు కూడా వెళ్లారు.

ఇక‌, ఇప్పుడు దావోస్ ప‌ర్య‌ట‌న‌కు సీఎం చంద్ర‌బాబు, మంత్రులు నారా లోకేష్‌, మండ‌ప‌ల్లి రాంప్ర‌సాద్‌రెడ్డి, ప‌య్యావుల కేశ‌వ్ త‌దిత‌రులు వెళ్తున్నారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ఏటా ప్రపంచ ఆర్థిక వాణిజ్య సదస్సు నిర్వహిస్తారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 20 నుంచి 24వ తేదీ వ‌ర‌కు వరకు దావోస్ ఈ సదస్సు జరగనుంది. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’ ఆధ్వర్యంలో ఈ స‌ద‌స్సు ఐదు రోజుల పాటు నిర్వ‌హిస్తారు. ఈ స‌ద‌స్సుకు ప్ర‌పంచ దేశాల నుంచి పెట్టుబ‌డి దారులు, అగ్ర స్థాయి వాణిజ్య వేత్త‌లు, వ్యాపార వేత్త‌లు కూడా హాజ‌రు కానున్నారు. ఈ నేప‌థ్యంలోవారిని ఆక‌ర్షించేందుకు చంద్ర‌బాబు బృందం ఈ నెల 19నే దావోస్‌కు వెళ్ల‌నుంది.

రాష్ట్రంలో ప్ర‌బుత్వం మారిన త‌ర్వాత‌.. ఏర్ప‌డిన సానుకూల ప‌రిణామాలు, శాంతి భ‌ద్ర‌త‌లు, పెట్టుబ‌డుల‌కు ఉన్న అవ‌కాశాల‌ను ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు వివ‌రించ‌నున్నారు. అదేస‌మ‌యంలో కూట‌మి ప్ర‌భుత్వం పెట్టుబ‌డులకు ఇస్తున్న ప్రాధాన్యాల‌ను కూడా వివ‌రిస్తారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్కిల్ డూయింగ్ బిజినెస్‌ను తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయా వివ‌రాల‌ను దావోస్ స‌ద‌స్సులో వివ‌రించ‌నున్నారు. అదేవిధంగా ‘షేపింగ్ ద ఇంటెలిజెంట్ ఏజ్’ థీమ్ ను ప‌రిచ‌యం చేయ‌నున్నారు. రాష్ట్రంలో సాంకేతిక పాల‌న‌, పునరుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రులు, స్మార్ట్ న‌గ‌రాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా ప్ర‌పంచ స్థాయి పెట్టుబ‌డి దారుల‌కు వివ‌రించి.. వారిని ఏపీకి ర‌ప్పించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ ప‌ర్య‌ట‌న సాగ‌నుంద‌ని ముఖ్య‌మంత్రి కార్యాల‌యం తెలిపింది.

This post was last modified on January 2, 2025 9:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారి.. దీదీ కోటలో బీజేపీ మ్యాజిక్!

పశ్చిమ బెంగాల్ రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. గత పదిహేనేళ్లుగా రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కోట…

17 minutes ago

బీజేపీ కూటమితో విజ‌య్ క‌లుస్తారా?.. ఏం జ‌రుగుతుంది?

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం న‌మోదు చేసుకున్న విజ‌య్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…

1 hour ago

‘టైగర్ తమ్ముళ్ల’ ఆశలు మళ్లీ చిగురించాయి

లోకనాయకుడు కమల్ హాసన్ తమిళనాట రాజకీయాల్లో అడుగు పెట్టి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ…

1 hour ago

JD చక్రవర్తిని ఇలాగేనా వాడుకోవడం

శివలో సైడ్ విలన్ గా పరిచయమై తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుని గులాబీ, సత్యతో సోలో హీరోగా మంచి…

1 hour ago

విజ‌య్‌ను క‌ట్ట‌డి చేయ‌డ‌మే వాళ్ళ కొంప ముంచిందా?

త‌మిళ‌నాట జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ద‌ళ‌ప‌తి విజ‌య్ విజ‌య‌దుందుభి మోగించారు. ఏక‌ప‌క్షంగా 110 స్థానాల్లో ఆయ‌న విజ‌యం ద‌క్కించుకునే దిశ‌గా…

1 hour ago

జాక్ పాట్ కొట్టిన జన నాయకుడు

నాలుగు నెలల క్రితం జన నాయకుడు వాయిదా పడినప్పుడు అభిమానులు తెగ కలవరపడ్డారు. సెన్సార్ వివాదాల వల్ల ఎప్పుడు వస్తుందో…

2 hours ago