ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 2 వారాల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో, ఆయనను చంచల్ గూడ జైలుకు తరలిస్తున్నారు. మరోవైపు, తనపై నమోదైన ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలంటూ అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై వాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అరెస్టుపై ఏపీ మాజీ సీఎం జగన్ స్పందించారు.
అల్లు అర్జున్ అరెస్టును జగన్ ఖండించారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళ మరణించడం బాధాకరమని, ఆమెను తిరిగి తీసుకురాలేమని అన్నారు. ఆ అభిమాని మృతిపై అల్లు అర్జున్ తన విచారం వ్యక్తం చేశారని, ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసానిచ్చారని జగన్ చెప్పారు. అల్లు అర్జున్ బాధ్యతాయుతంగా వ్యవహరించారని, అయినప్పటికీ ఈ ఘటనకు ఆయనను నేరుగా బాధ్యుడిని చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనలలో అల్లు అర్జున్ ప్రమేయం లేనప్పటికీ క్రిమినల్ కేసులు బనాయించి అరెస్టు చేయడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు, తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై అల్లు అర్జున్ తరఫు లాయర్లు, ప్రభుత్వం, పోలీసుల తరఫు లాయర్లు వాడీవేడీ వాదనలు వినిపిస్తున్నారు. 2017లో రాయీస్ చిత్రం ప్రమోషన్ సందర్భంగా బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ పై కూడా ఈ తరహా కేసు నమోదైందని, అప్పుడు షారుఖ్ ఖాన్ ను నేరస్తుడిగా కోర్టు పరిగణించలేదని అల్లు అర్జున్ తరఫు లాయర్ నిరంజన్ రెడ్డి వాదిస్తున్నారు.
This post was last modified on December 13, 2024 5:52 pm
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…