వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పనులు సొంత పార్టీ వారికే కోపం తెప్పిస్తున్న విషయం తెలిసిందే. ‘జగన్లో మార్పు రావాలి’ అని చాలా మంది నాయకులు చెబుతున్నారు. అయినా.. జగన్ మాత్రం ఎక్కడా మారక పోవడం గమనార్హం. దీనికి తాజాగా జరిగిన పరిణామమే ఉదాహరణ. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం వైసీపీ నేతలను రంగంలోకి దింపారు జగన్. కూటమి సర్కారు రైతులకు అన్యాయం చేస్తోందని.. దీనిపై పోరాడాలని ఆయన పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు ధర్నాలు నిరసనలు చేస్తున్నారు. మరోవైపు గుంటూరు, రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగిన వైసీపీ నాయకులను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. అంతేకాదు.. కొందరిని అరెస్టు చేసినట్టు ప్రచారం కూడా జరుగుతోంది. ఇంత కీలకమైన సందర్భంలో జగన్ ఏం చేయాలి? పార్టీ అధినేతగా వారిని ముందుండి నడిపించాలి. లేదా.. తాడేపల్లిలో అయినా.. ఉంది దిశానిర్దేశం చేయాలి.
కానీ, ఈ రెండు విషయాలను వదిలేసిన జగన్.. తాను ఎంచక్కా బెంగళూరుకు వెళ్లిపోయారు. ఒకవైపు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీనేతలను ధర్నాలకు, నిరసనలకు దిగాలని చెప్పిన పార్టీ అధినేత ఇలా బెంగళూరుకు చడీ చప్పుడు లేకుండా వెళ్లిపోవడాన్ని పార్టీ నాయకులు తప్పుబడుతున్నారు. కొందరైతే.. మధ్యలోనే కార్యక్రమాన్ని వదిలేసి వెళ్లిపోయారు.
విజయవాడ, విశాఖపట్నం వంటి కీలక నగరాల్లో ఒక్కరంటే ఒక్కరూ బయటకు రాలేదు. ధర్నాలు చేయలేదు. అంటే.. ఇప్పుడు వైసీపీలో నాయకులకు దిశానిర్దేశం చేయాల్సిన అధినేతే.. బెంగళూరుకు వెళ్లిపోతే.. తాము మాత్రం ఎందుకు రంగంలో ఉండాలన్న చర్చ అయితే.. తెరమీదికి వచ్చింది. ఇదేం పద్ధతి? అంటూ.. ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
This post was last modified on December 13, 2024 4:02 pm
ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా వేలు.. లక్షల్లోనే ఉద్యోగాలకు ప్రతిష్టాత్మక సంస్థలు మంగళం పాడుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఫోక్స్…
ఇండియాలో ఓటీటీల హవా మొదలయ్యాక పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్న వెబ్ సిరీస్ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. ఇండియాలో…
తెలుగు వారికి అత్యంత ప్రీతిపాత్రమైన టీవీ ఛానెళ్లలో ఈటీవీ ఒకటి. 90వ దశకంలో ప్రైవేటు టీవీ ఛానెళ్ల జోరు పెరుగుతున్న…
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో సీనియర్ నటుడు నరేష్, దివంగత నటుడు కోటా శ్రీనివాసరావులు నటించిన ‘హై హై…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ఫలితం పట్ల దర్శకుడు ఆదిత్య హాసన్ టెన్షన్ పడుతున్న…
భారత్లో కొత్త కార్లు కొనేవాళ్లలో ఊహించని మార్పు కనిపిస్తోంది. ఆగస్టులో పెట్రోల్ కార్ల కంటే CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు…