వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పనులు సొంత పార్టీ వారికే కోపం తెప్పిస్తున్న విషయం తెలిసిందే. ‘జగన్లో మార్పు రావాలి’ అని చాలా మంది నాయకులు చెబుతున్నారు. అయినా.. జగన్ మాత్రం ఎక్కడా మారక పోవడం గమనార్హం. దీనికి తాజాగా జరిగిన పరిణామమే ఉదాహరణ. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం వైసీపీ నేతలను రంగంలోకి దింపారు జగన్. కూటమి సర్కారు రైతులకు అన్యాయం చేస్తోందని.. దీనిపై పోరాడాలని ఆయన పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు ధర్నాలు నిరసనలు చేస్తున్నారు. మరోవైపు గుంటూరు, రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగిన వైసీపీ నాయకులను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. అంతేకాదు.. కొందరిని అరెస్టు చేసినట్టు ప్రచారం కూడా జరుగుతోంది. ఇంత కీలకమైన సందర్భంలో జగన్ ఏం చేయాలి? పార్టీ అధినేతగా వారిని ముందుండి నడిపించాలి. లేదా.. తాడేపల్లిలో అయినా.. ఉంది దిశానిర్దేశం చేయాలి.
కానీ, ఈ రెండు విషయాలను వదిలేసిన జగన్.. తాను ఎంచక్కా బెంగళూరుకు వెళ్లిపోయారు. ఒకవైపు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీనేతలను ధర్నాలకు, నిరసనలకు దిగాలని చెప్పిన పార్టీ అధినేత ఇలా బెంగళూరుకు చడీ చప్పుడు లేకుండా వెళ్లిపోవడాన్ని పార్టీ నాయకులు తప్పుబడుతున్నారు. కొందరైతే.. మధ్యలోనే కార్యక్రమాన్ని వదిలేసి వెళ్లిపోయారు.
విజయవాడ, విశాఖపట్నం వంటి కీలక నగరాల్లో ఒక్కరంటే ఒక్కరూ బయటకు రాలేదు. ధర్నాలు చేయలేదు. అంటే.. ఇప్పుడు వైసీపీలో నాయకులకు దిశానిర్దేశం చేయాల్సిన అధినేతే.. బెంగళూరుకు వెళ్లిపోతే.. తాము మాత్రం ఎందుకు రంగంలో ఉండాలన్న చర్చ అయితే.. తెరమీదికి వచ్చింది. ఇదేం పద్ధతి? అంటూ.. ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
This post was last modified on December 13, 2024 4:02 pm
పశ్చిమ బెంగాల్ రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. గత పదిహేనేళ్లుగా రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కోట…
తమిళనాడు ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసుకున్న విజయ్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…
లోకనాయకుడు కమల్ హాసన్ తమిళనాట రాజకీయాల్లో అడుగు పెట్టి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ…
శివలో సైడ్ విలన్ గా పరిచయమై తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుని గులాబీ, సత్యతో సోలో హీరోగా మంచి…
తమిళనాట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ విజయదుందుభి మోగించారు. ఏకపక్షంగా 110 స్థానాల్లో ఆయన విజయం దక్కించుకునే దిశగా…
నాలుగు నెలల క్రితం జన నాయకుడు వాయిదా పడినప్పుడు అభిమానులు తెగ కలవరపడ్డారు. సెన్సార్ వివాదాల వల్ల ఎప్పుడు వస్తుందో…