వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పనులు సొంత పార్టీ వారికే కోపం తెప్పిస్తున్న విషయం తెలిసిందే. ‘జగన్లో మార్పు రావాలి’ అని చాలా మంది నాయకులు చెబుతున్నారు. అయినా.. జగన్ మాత్రం ఎక్కడా మారక పోవడం గమనార్హం. దీనికి తాజాగా జరిగిన పరిణామమే ఉదాహరణ. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం వైసీపీ నేతలను రంగంలోకి దింపారు జగన్. కూటమి సర్కారు రైతులకు అన్యాయం చేస్తోందని.. దీనిపై పోరాడాలని ఆయన పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు ధర్నాలు నిరసనలు చేస్తున్నారు. మరోవైపు గుంటూరు, రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగిన వైసీపీ నాయకులను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. అంతేకాదు.. కొందరిని అరెస్టు చేసినట్టు ప్రచారం కూడా జరుగుతోంది. ఇంత కీలకమైన సందర్భంలో జగన్ ఏం చేయాలి? పార్టీ అధినేతగా వారిని ముందుండి నడిపించాలి. లేదా.. తాడేపల్లిలో అయినా.. ఉంది దిశానిర్దేశం చేయాలి.
కానీ, ఈ రెండు విషయాలను వదిలేసిన జగన్.. తాను ఎంచక్కా బెంగళూరుకు వెళ్లిపోయారు. ఒకవైపు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీనేతలను ధర్నాలకు, నిరసనలకు దిగాలని చెప్పిన పార్టీ అధినేత ఇలా బెంగళూరుకు చడీ చప్పుడు లేకుండా వెళ్లిపోవడాన్ని పార్టీ నాయకులు తప్పుబడుతున్నారు. కొందరైతే.. మధ్యలోనే కార్యక్రమాన్ని వదిలేసి వెళ్లిపోయారు.
విజయవాడ, విశాఖపట్నం వంటి కీలక నగరాల్లో ఒక్కరంటే ఒక్కరూ బయటకు రాలేదు. ధర్నాలు చేయలేదు. అంటే.. ఇప్పుడు వైసీపీలో నాయకులకు దిశానిర్దేశం చేయాల్సిన అధినేతే.. బెంగళూరుకు వెళ్లిపోతే.. తాము మాత్రం ఎందుకు రంగంలో ఉండాలన్న చర్చ అయితే.. తెరమీదికి వచ్చింది. ఇదేం పద్ధతి? అంటూ.. ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
This post was last modified on December 13, 2024 4:02 pm
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన కథానాయిక సమంత. కానీ కొన్నేళ్లుగా…
సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తన…