వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పనులు సొంత పార్టీ వారికే కోపం తెప్పిస్తున్న విషయం తెలిసిందే. ‘జగన్లో మార్పు రావాలి’ అని చాలా మంది నాయకులు చెబుతున్నారు. అయినా.. జగన్ మాత్రం ఎక్కడా మారక పోవడం గమనార్హం. దీనికి తాజాగా జరిగిన పరిణామమే ఉదాహరణ. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం వైసీపీ నేతలను రంగంలోకి దింపారు జగన్. కూటమి సర్కారు రైతులకు అన్యాయం చేస్తోందని.. దీనిపై పోరాడాలని ఆయన పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు ధర్నాలు నిరసనలు చేస్తున్నారు. మరోవైపు గుంటూరు, రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగిన వైసీపీ నాయకులను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. అంతేకాదు.. కొందరిని అరెస్టు చేసినట్టు ప్రచారం కూడా జరుగుతోంది. ఇంత కీలకమైన సందర్భంలో జగన్ ఏం చేయాలి? పార్టీ అధినేతగా వారిని ముందుండి నడిపించాలి. లేదా.. తాడేపల్లిలో అయినా.. ఉంది దిశానిర్దేశం చేయాలి.
కానీ, ఈ రెండు విషయాలను వదిలేసిన జగన్.. తాను ఎంచక్కా బెంగళూరుకు వెళ్లిపోయారు. ఒకవైపు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీనేతలను ధర్నాలకు, నిరసనలకు దిగాలని చెప్పిన పార్టీ అధినేత ఇలా బెంగళూరుకు చడీ చప్పుడు లేకుండా వెళ్లిపోవడాన్ని పార్టీ నాయకులు తప్పుబడుతున్నారు. కొందరైతే.. మధ్యలోనే కార్యక్రమాన్ని వదిలేసి వెళ్లిపోయారు.
విజయవాడ, విశాఖపట్నం వంటి కీలక నగరాల్లో ఒక్కరంటే ఒక్కరూ బయటకు రాలేదు. ధర్నాలు చేయలేదు. అంటే.. ఇప్పుడు వైసీపీలో నాయకులకు దిశానిర్దేశం చేయాల్సిన అధినేతే.. బెంగళూరుకు వెళ్లిపోతే.. తాము మాత్రం ఎందుకు రంగంలో ఉండాలన్న చర్చ అయితే.. తెరమీదికి వచ్చింది. ఇదేం పద్ధతి? అంటూ.. ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
This post was last modified on December 13, 2024 4:02 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…