రాజకీయాల్లో ఎవరూ ఎవరినీ నమ్మరు. కానీ..రాజకీయాలు సాగుతాయి. అయితే.. ఉన్నవారిలో ఎవరు బెస్ట్ అనేది పార్టీల అధినేతలు నిర్ణయించుకోవాలి. కొన్ని సార్లు తగ్గడం.. మరికొన్ని సార్లు నెగ్గడం అనేది ఈ స్ట్రాటజీపైనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో టీడీపీని చూసి వైసీపీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు .. భీష్మించుకుని కూర్చున్న పరిస్థితి మనకు ఆయన రాజకీయ జీవితంలో ఎక్కడా కనిపించదు.
కొన్ని రోజులు పంతానికి పోయినా.. తర్వాత తనేమిటో.. తన రాజకీయ ప్రస్థానం ఏమిటో చంద్రబాబు సాధ్యమైనంత వేగంగా తెలుసుకున్నారు. దీంతో నాలుగు మెట్లు కాదు.. నలభై మెట్లు దిగి వచ్చారు. ఇదీ.. రాజకీయం అంటే చూపించారు. అనేక సందర్భాల్లో తనకోసం వేచి ఉన్న వారి దగ్గర.. తను వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చినా.. తలాడించారే తప్ప ఎగరేయలేదు. ఫలితంగానే మరోసారి వస్తుందో రాదో అనుకున్న పరిస్థితి నుంచి అధికారంలోకి వచ్చేయడం ఖాయమనే పరిస్థితికి వచ్చారు.
ఇప్పుడు వైసీపీ పరిస్థితిని గమనిస్తే.. ఉన్నవారు ఒక్కొక్కరు కాదు.. మందలు మందలుగానే వెళ్లిపోతున్నా రు. ఇంకా వెళ్లిపోయే వారి జాబితా చాలా పెద్దదిగానే ఉంది. కాబట్టి.. వైసీపీకి వచ్చే నాలుగేళ్లు కూడా.. నరకమేనని చెప్పడంలో సందేహం లేదు. ప్రజా ఉద్యమాలకుసిద్ధమైన సమయంలోనే భారీ షాక్ ఇస్తూ.. కూటమి స్ట్రాటజీ ప్లాన్ చేయడంతో వైసీపీ విలవిలాడిపోయింది. అయినా.. పోయింది ఏమీ లేదని అనుకుంటే పొరపాటే. పోతున్నదానిని పరిగణనలోకి తీసుకుని.. మార్పు దిశగా వైసీపీ అడుగులు వేయాల్సి ఉంది.
ఇప్పటికిప్పుడు చేయాల్సింది.. వైసీపీలో అంతర్యుద్ధమే. తాడేపల్లి ప్యాలెస్ను సమూలంగా ప్రక్షాళన చేయాల్సి ఉంది. అదేసమయంలో పార్టీలో ఉండే వారికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందరి నీ పరిగణనలోకి తీసుకోవాలి. అన్ని విషయాలూ వినాలి. ముందుగా.. అధినేతపై గౌరవం కంటే.. నమ్మకం కలిగించాలి. ఏమో.. మనం ఏం చెప్పినా ఆయన వినడు! అనే మాటకు తావులే కుండా.. చంద్రబాబు అనుసరించిన వ్యూహాన్ని జగన్ అనుసరించి.. అడుగులు వేయాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయం లేదని.. తామే పెద్ద పార్టీని నిర్వహిస్తున్నామని అనుకుంటే అంతకన్నా పెద్ద పొరపాటు మరొకటి లేదు. ప్రజలకు ఎప్పుడూ ప్రత్యామ్నాయం ఉంటూనే ఉంటుంది. పార్టీలకే ఉండదు..!
This post was last modified on December 15, 2024 8:46 am
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత సున్నిత మనస్కులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ గా చెప్పుకునే సినిమాల్లో బాషా స్థానం చాలా…
2008లో 166 మందిని పొట్టనపెట్టుకున్న ముంబై 26/11 ఉగ్రదాడికి సంబంధించి కీలక నిందితుడైన తహావూర్ హుస్సేన్ రాణా ఎట్టకేలకు భారత్కు…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అదికార కూటమి పూర్తిగా కార్నర్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. తనకు తానుగా ఏ…
టాలీవుడ్ కల్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా చెప్పుకునే అర్జున్ రెడ్డికి సంగీత దర్శకుడు రధన్ ఇచ్చిన పాటలు ఎంత…
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థగా వెలిగిపోతున్న మైత్రి మూవీ మేకర్స్ కి ఈ రోజు చాలా కీలకం. తెలుగులో కాకుండా…