Political News

ఏపీలో కూట‌మి స‌ర్కార్‌కు పింఛ‌న్ల ఎఫెక్ట్ ప‌డుతోందా..?

ఏపీలో సామాజిక భ‌ద్ర‌త కింద ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న పింఛ‌న్ల ప‌థ‌కం.. ఇప్పుడు తీవ్ర స్థాయిలో చ‌ర్చ‌కు దారితీస్తోంది. గ‌త వారం ప‌ది రోజులుగా ఎక్క‌డ చూసినా పింఛ‌న్ల ప‌థ‌కంపైనే ఎక్కువ‌గా చ‌ర్చ నడుస్తోంది. త‌మ పింఛ‌న్ తీసేస్తారేమో.. అనే బెంగ‌తో చాలా మంది ల‌బ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. తెలిసిన వారిని అడుగుతున్నారు. దీనికి కార‌ణం.. ప్ర‌భుత్వం నుంచి పింఛ‌న్ల ను త‌గ్గించాల‌న్న స్ప‌ష్ట‌మైన ఆదేశాలు రావ‌డమే. ఇప్ప‌టికే రెండు రోజులు 9, 10 తేదీల్లో స‌ర్వే చేయాల‌ని స‌ర్కారు ఆదేశించింది.

అయితే.. దీనిని క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు నేప‌థ్యంలో వాయిదా వేశారు. కానీ, ఇప్పుడు పూర్తిస్థాయి ప‌గ్గాల‌ను క‌లెక్ట ర్ల‌కే అప్ప‌గించారు. అర్హులు కాని వారికి పింఛ‌న్లు ఆపేయాల‌ని.. ముఖ్యంగా దివ్యాంగుల పింఛ‌న్ల‌ను త‌గ్గిం చాల‌ని సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా చెప్పారు. ఇదే ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ఎవ‌రైనా పెంచి న‌ప్పుడు ఆనందిస్తారు. కానీ, వ‌స్తున్న సొమ్మును తీసేస్తే.. మాత్రం వ్య‌తిరేకిస్తారు. పైగా ఇప్ప‌టి వ‌ర‌కు దివ్యాంగుల పింఛ‌న్ విష‌యంలో ఎన్న‌డూలేని విధంగా స‌ర్కారు వ్య‌వ‌హ‌రించ‌డం కూడా.. చ‌ర్చ‌కు దారితీసింది.

అయితే.. ప్ర‌భుత్వానికి అనుమానాలు.. అన‌ర్హులు కూడా ల‌బ్ధి పొందుతున్నార‌న్న సందేహాలు ఉంటే.. అలాంటి వారిని గుర్తించ‌డం వ‌ర‌కు త‌ప్పులేదు. పైగా.. వీరంతా ఈ ఆరు మాసాల్లో ల‌బ్ధి పొందిన వారు కాదు. వైసీపీ హ‌యాం నుంచి రూ.3000 చొప్పున తీసుకుంటున్న‌వారే. పోనీ.. వీరిలోనూ అన‌ర్హులు ఉన్నార‌ని అనుకుంటే.. వారిని గుర్తించి.. పింఛ‌న్ మొత్తాన్ని త‌గ్గిస్తే స‌రిపోతుంది.. త‌ప్ప‌.. అస‌లు తీసేస్తే.. అది స‌ర్కారుపై వ్య‌తిరేక‌త‌ను.. సీఎం చంద్ర‌బాబపై అప‌న‌మ్మ‌కాన్ని పెంచుతుంది. సునిశిత‌మైన ఈ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

ఇక‌, అనాథ‌ల‌కు పింఛ‌ను ఇస్తామ‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. ఇవి వినూత్న ఆలోచ‌న‌గా చెప్పుకొచ్చా రు. కొత్త‌గా వీరిని పింఛ‌న్ల జాబితాలో చేర్చాల‌ని కూడా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా లెక్కల ప్ర‌కారం.. ల‌క్ష మందికిపైనే అనాథ‌లు ఉన్నారు. వీరిని ల‌బ్ధిదారులుగా చేర్చ‌డం త‌ప్పులేక పోవ‌చ్చు.. కానీ, ఉన్న వారిని తొల‌గించ‌డ‌మే ప్ర‌భుత్వానికి ఇబ్బందులు కోరి తెచ్చుకున్న‌ట్టు అవుతుంది. ఇప్ప‌టికీ ఆరు మాసాల పాల‌న‌లో నిత్యావ‌స‌ర ధ‌ర‌లుఏమీ త‌గ్గ‌లేదు. పైగా విద్యుత్ చార్జీల మోత మోగుతూనే ఉంది. ఈ పాపాల‌ను జ‌గ‌న్‌పైకితోసేసినా.. ఇప్పుడు పింఛ‌న్ల‌ను తొల‌గిస్తే.. ఆ పాపం కూడా జ‌గ‌న్‌దే అంటే.. ప్ర‌జ‌లు న‌మ్ముతారా? అనేది ప్ర‌శ్న‌.!!

This post was last modified on December 13, 2024 1:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రచారంలో నాయకుడు లేడు కానీ రూపం ఉంది

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…

2 hours ago

వైభవ్ సూర్యవంశీని ఆపాలంటే…

ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి…

2 hours ago

రాజమౌళి టెన్షన్ పడే టైపు కాదు

ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…

2 hours ago

రజినీకాంత్ సినిమాకు దర్శకుల కష్టాలు

అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…

3 hours ago

విజ‌య్ గ్రాఫ్‌… పోలింగ్ ముందు ఎలా ఉంది?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ఈనెల 23న జరగనుంది. అంటే పది రోజుల్లో ప్రజలు త‌మ‌ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని…

3 hours ago

నంద‌మూరి నాలుగో తరం సినిమా ఏమైంది?

టాలీవుడ్లో ఘ‌న చ‌రిత్ర ఉన్న నందమూరి కుటుంబం నుంచి ఇప్ప‌టికే మూడు త‌రాల హీరోలు వ‌చ్చారు. ఆ ఫ్యామిలీ నుంచి…

5 hours ago