Political News

ఏపీలో కూట‌మి స‌ర్కార్‌కు పింఛ‌న్ల ఎఫెక్ట్ ప‌డుతోందా..?

ఏపీలో సామాజిక భ‌ద్ర‌త కింద ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న పింఛ‌న్ల ప‌థ‌కం.. ఇప్పుడు తీవ్ర స్థాయిలో చ‌ర్చ‌కు దారితీస్తోంది. గ‌త వారం ప‌ది రోజులుగా ఎక్క‌డ చూసినా పింఛ‌న్ల ప‌థ‌కంపైనే ఎక్కువ‌గా చ‌ర్చ నడుస్తోంది. త‌మ పింఛ‌న్ తీసేస్తారేమో.. అనే బెంగ‌తో చాలా మంది ల‌బ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. తెలిసిన వారిని అడుగుతున్నారు. దీనికి కార‌ణం.. ప్ర‌భుత్వం నుంచి పింఛ‌న్ల ను త‌గ్గించాల‌న్న స్ప‌ష్ట‌మైన ఆదేశాలు రావ‌డమే. ఇప్ప‌టికే రెండు రోజులు 9, 10 తేదీల్లో స‌ర్వే చేయాల‌ని స‌ర్కారు ఆదేశించింది.

అయితే.. దీనిని క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు నేప‌థ్యంలో వాయిదా వేశారు. కానీ, ఇప్పుడు పూర్తిస్థాయి ప‌గ్గాల‌ను క‌లెక్ట ర్ల‌కే అప్ప‌గించారు. అర్హులు కాని వారికి పింఛ‌న్లు ఆపేయాల‌ని.. ముఖ్యంగా దివ్యాంగుల పింఛ‌న్ల‌ను త‌గ్గిం చాల‌ని సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా చెప్పారు. ఇదే ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ఎవ‌రైనా పెంచి న‌ప్పుడు ఆనందిస్తారు. కానీ, వ‌స్తున్న సొమ్మును తీసేస్తే.. మాత్రం వ్య‌తిరేకిస్తారు. పైగా ఇప్ప‌టి వ‌ర‌కు దివ్యాంగుల పింఛ‌న్ విష‌యంలో ఎన్న‌డూలేని విధంగా స‌ర్కారు వ్య‌వ‌హ‌రించ‌డం కూడా.. చ‌ర్చ‌కు దారితీసింది.

అయితే.. ప్ర‌భుత్వానికి అనుమానాలు.. అన‌ర్హులు కూడా ల‌బ్ధి పొందుతున్నార‌న్న సందేహాలు ఉంటే.. అలాంటి వారిని గుర్తించ‌డం వ‌ర‌కు త‌ప్పులేదు. పైగా.. వీరంతా ఈ ఆరు మాసాల్లో ల‌బ్ధి పొందిన వారు కాదు. వైసీపీ హ‌యాం నుంచి రూ.3000 చొప్పున తీసుకుంటున్న‌వారే. పోనీ.. వీరిలోనూ అన‌ర్హులు ఉన్నార‌ని అనుకుంటే.. వారిని గుర్తించి.. పింఛ‌న్ మొత్తాన్ని త‌గ్గిస్తే స‌రిపోతుంది.. త‌ప్ప‌.. అస‌లు తీసేస్తే.. అది స‌ర్కారుపై వ్య‌తిరేక‌త‌ను.. సీఎం చంద్ర‌బాబపై అప‌న‌మ్మ‌కాన్ని పెంచుతుంది. సునిశిత‌మైన ఈ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

ఇక‌, అనాథ‌ల‌కు పింఛ‌ను ఇస్తామ‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. ఇవి వినూత్న ఆలోచ‌న‌గా చెప్పుకొచ్చా రు. కొత్త‌గా వీరిని పింఛ‌న్ల జాబితాలో చేర్చాల‌ని కూడా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా లెక్కల ప్ర‌కారం.. ల‌క్ష మందికిపైనే అనాథ‌లు ఉన్నారు. వీరిని ల‌బ్ధిదారులుగా చేర్చ‌డం త‌ప్పులేక పోవ‌చ్చు.. కానీ, ఉన్న వారిని తొల‌గించ‌డ‌మే ప్ర‌భుత్వానికి ఇబ్బందులు కోరి తెచ్చుకున్న‌ట్టు అవుతుంది. ఇప్ప‌టికీ ఆరు మాసాల పాల‌న‌లో నిత్యావ‌స‌ర ధ‌ర‌లుఏమీ త‌గ్గ‌లేదు. పైగా విద్యుత్ చార్జీల మోత మోగుతూనే ఉంది. ఈ పాపాల‌ను జ‌గ‌న్‌పైకితోసేసినా.. ఇప్పుడు పింఛ‌న్ల‌ను తొల‌గిస్తే.. ఆ పాపం కూడా జ‌గ‌న్‌దే అంటే.. ప్ర‌జ‌లు న‌మ్ముతారా? అనేది ప్ర‌శ్న‌.!!

This post was last modified on December 13, 2024 1:27 pm

Share

Recent Posts

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

10 minutes ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

27 minutes ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

4 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

12 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

13 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

14 hours ago