Political News

ఏపీలో కూట‌మి స‌ర్కార్‌కు పింఛ‌న్ల ఎఫెక్ట్ ప‌డుతోందా..?

ఏపీలో సామాజిక భ‌ద్ర‌త కింద ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న పింఛ‌న్ల ప‌థ‌కం.. ఇప్పుడు తీవ్ర స్థాయిలో చ‌ర్చ‌కు దారితీస్తోంది. గ‌త వారం ప‌ది రోజులుగా ఎక్క‌డ చూసినా పింఛ‌న్ల ప‌థ‌కంపైనే ఎక్కువ‌గా చ‌ర్చ నడుస్తోంది. త‌మ పింఛ‌న్ తీసేస్తారేమో.. అనే బెంగ‌తో చాలా మంది ల‌బ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. తెలిసిన వారిని అడుగుతున్నారు. దీనికి కార‌ణం.. ప్ర‌భుత్వం నుంచి పింఛ‌న్ల ను త‌గ్గించాల‌న్న స్ప‌ష్ట‌మైన ఆదేశాలు రావ‌డమే. ఇప్ప‌టికే రెండు రోజులు 9, 10 తేదీల్లో స‌ర్వే చేయాల‌ని స‌ర్కారు ఆదేశించింది.

అయితే.. దీనిని క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు నేప‌థ్యంలో వాయిదా వేశారు. కానీ, ఇప్పుడు పూర్తిస్థాయి ప‌గ్గాల‌ను క‌లెక్ట ర్ల‌కే అప్ప‌గించారు. అర్హులు కాని వారికి పింఛ‌న్లు ఆపేయాల‌ని.. ముఖ్యంగా దివ్యాంగుల పింఛ‌న్ల‌ను త‌గ్గిం చాల‌ని సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా చెప్పారు. ఇదే ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ఎవ‌రైనా పెంచి న‌ప్పుడు ఆనందిస్తారు. కానీ, వ‌స్తున్న సొమ్మును తీసేస్తే.. మాత్రం వ్య‌తిరేకిస్తారు. పైగా ఇప్ప‌టి వ‌ర‌కు దివ్యాంగుల పింఛ‌న్ విష‌యంలో ఎన్న‌డూలేని విధంగా స‌ర్కారు వ్య‌వ‌హ‌రించ‌డం కూడా.. చ‌ర్చ‌కు దారితీసింది.

అయితే.. ప్ర‌భుత్వానికి అనుమానాలు.. అన‌ర్హులు కూడా ల‌బ్ధి పొందుతున్నార‌న్న సందేహాలు ఉంటే.. అలాంటి వారిని గుర్తించ‌డం వ‌ర‌కు త‌ప్పులేదు. పైగా.. వీరంతా ఈ ఆరు మాసాల్లో ల‌బ్ధి పొందిన వారు కాదు. వైసీపీ హ‌యాం నుంచి రూ.3000 చొప్పున తీసుకుంటున్న‌వారే. పోనీ.. వీరిలోనూ అన‌ర్హులు ఉన్నార‌ని అనుకుంటే.. వారిని గుర్తించి.. పింఛ‌న్ మొత్తాన్ని త‌గ్గిస్తే స‌రిపోతుంది.. త‌ప్ప‌.. అస‌లు తీసేస్తే.. అది స‌ర్కారుపై వ్య‌తిరేక‌త‌ను.. సీఎం చంద్ర‌బాబపై అప‌న‌మ్మ‌కాన్ని పెంచుతుంది. సునిశిత‌మైన ఈ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

ఇక‌, అనాథ‌ల‌కు పింఛ‌ను ఇస్తామ‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. ఇవి వినూత్న ఆలోచ‌న‌గా చెప్పుకొచ్చా రు. కొత్త‌గా వీరిని పింఛ‌న్ల జాబితాలో చేర్చాల‌ని కూడా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా లెక్కల ప్ర‌కారం.. ల‌క్ష మందికిపైనే అనాథ‌లు ఉన్నారు. వీరిని ల‌బ్ధిదారులుగా చేర్చ‌డం త‌ప్పులేక పోవ‌చ్చు.. కానీ, ఉన్న వారిని తొల‌గించ‌డ‌మే ప్ర‌భుత్వానికి ఇబ్బందులు కోరి తెచ్చుకున్న‌ట్టు అవుతుంది. ఇప్ప‌టికీ ఆరు మాసాల పాల‌న‌లో నిత్యావ‌స‌ర ధ‌ర‌లుఏమీ త‌గ్గ‌లేదు. పైగా విద్యుత్ చార్జీల మోత మోగుతూనే ఉంది. ఈ పాపాల‌ను జ‌గ‌న్‌పైకితోసేసినా.. ఇప్పుడు పింఛ‌న్ల‌ను తొల‌గిస్తే.. ఆ పాపం కూడా జ‌గ‌న్‌దే అంటే.. ప్ర‌జ‌లు న‌మ్ముతారా? అనేది ప్ర‌శ్న‌.!!

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

6 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

8 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

10 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

11 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

11 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

11 hours ago