Political News

ఏపీలో కూట‌మి స‌ర్కార్‌కు పింఛ‌న్ల ఎఫెక్ట్ ప‌డుతోందా..?

ఏపీలో సామాజిక భ‌ద్ర‌త కింద ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న పింఛ‌న్ల ప‌థ‌కం.. ఇప్పుడు తీవ్ర స్థాయిలో చ‌ర్చ‌కు దారితీస్తోంది. గ‌త వారం ప‌ది రోజులుగా ఎక్క‌డ చూసినా పింఛ‌న్ల ప‌థ‌కంపైనే ఎక్కువ‌గా చ‌ర్చ నడుస్తోంది. త‌మ పింఛ‌న్ తీసేస్తారేమో.. అనే బెంగ‌తో చాలా మంది ల‌బ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. తెలిసిన వారిని అడుగుతున్నారు. దీనికి కార‌ణం.. ప్ర‌భుత్వం నుంచి పింఛ‌న్ల ను త‌గ్గించాల‌న్న స్ప‌ష్ట‌మైన ఆదేశాలు రావ‌డమే. ఇప్ప‌టికే రెండు రోజులు 9, 10 తేదీల్లో స‌ర్వే చేయాల‌ని స‌ర్కారు ఆదేశించింది.

అయితే.. దీనిని క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు నేప‌థ్యంలో వాయిదా వేశారు. కానీ, ఇప్పుడు పూర్తిస్థాయి ప‌గ్గాల‌ను క‌లెక్ట ర్ల‌కే అప్ప‌గించారు. అర్హులు కాని వారికి పింఛ‌న్లు ఆపేయాల‌ని.. ముఖ్యంగా దివ్యాంగుల పింఛ‌న్ల‌ను త‌గ్గిం చాల‌ని సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా చెప్పారు. ఇదే ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ఎవ‌రైనా పెంచి న‌ప్పుడు ఆనందిస్తారు. కానీ, వ‌స్తున్న సొమ్మును తీసేస్తే.. మాత్రం వ్య‌తిరేకిస్తారు. పైగా ఇప్ప‌టి వ‌ర‌కు దివ్యాంగుల పింఛ‌న్ విష‌యంలో ఎన్న‌డూలేని విధంగా స‌ర్కారు వ్య‌వ‌హ‌రించ‌డం కూడా.. చ‌ర్చ‌కు దారితీసింది.

అయితే.. ప్ర‌భుత్వానికి అనుమానాలు.. అన‌ర్హులు కూడా ల‌బ్ధి పొందుతున్నార‌న్న సందేహాలు ఉంటే.. అలాంటి వారిని గుర్తించ‌డం వ‌ర‌కు త‌ప్పులేదు. పైగా.. వీరంతా ఈ ఆరు మాసాల్లో ల‌బ్ధి పొందిన వారు కాదు. వైసీపీ హ‌యాం నుంచి రూ.3000 చొప్పున తీసుకుంటున్న‌వారే. పోనీ.. వీరిలోనూ అన‌ర్హులు ఉన్నార‌ని అనుకుంటే.. వారిని గుర్తించి.. పింఛ‌న్ మొత్తాన్ని త‌గ్గిస్తే స‌రిపోతుంది.. త‌ప్ప‌.. అస‌లు తీసేస్తే.. అది స‌ర్కారుపై వ్య‌తిరేక‌త‌ను.. సీఎం చంద్ర‌బాబపై అప‌న‌మ్మ‌కాన్ని పెంచుతుంది. సునిశిత‌మైన ఈ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

ఇక‌, అనాథ‌ల‌కు పింఛ‌ను ఇస్తామ‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. ఇవి వినూత్న ఆలోచ‌న‌గా చెప్పుకొచ్చా రు. కొత్త‌గా వీరిని పింఛ‌న్ల జాబితాలో చేర్చాల‌ని కూడా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా లెక్కల ప్ర‌కారం.. ల‌క్ష మందికిపైనే అనాథ‌లు ఉన్నారు. వీరిని ల‌బ్ధిదారులుగా చేర్చ‌డం త‌ప్పులేక పోవ‌చ్చు.. కానీ, ఉన్న వారిని తొల‌గించ‌డ‌మే ప్ర‌భుత్వానికి ఇబ్బందులు కోరి తెచ్చుకున్న‌ట్టు అవుతుంది. ఇప్ప‌టికీ ఆరు మాసాల పాల‌న‌లో నిత్యావ‌స‌ర ధ‌ర‌లుఏమీ త‌గ్గ‌లేదు. పైగా విద్యుత్ చార్జీల మోత మోగుతూనే ఉంది. ఈ పాపాల‌ను జ‌గ‌న్‌పైకితోసేసినా.. ఇప్పుడు పింఛ‌న్ల‌ను తొల‌గిస్తే.. ఆ పాపం కూడా జ‌గ‌న్‌దే అంటే.. ప్ర‌జ‌లు న‌మ్ముతారా? అనేది ప్ర‌శ్న‌.!!

This post was last modified on December 13, 2024 1:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

8 minutes ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

29 minutes ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

1 hour ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

2 hours ago

ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు... `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే…

5 hours ago

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…

5 hours ago