ఏపీలో సామాజిక పెన్షన్లను 4 వేల రూపాయలకు ఎన్డీఏ ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎంతో మంది అనర్హులకు పెన్షన్లు మంజూరయ్యాయని ఆరోపణలు వచ్చాయి. నకిలీ డాక్టర్ సర్టిఫికెట్లు పెట్టి చాలామంది పెన్షన్లు పొందారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే నకిలీ పెన్షన్లను ఏరివేయాలని సీఎం చంద్రబాబు…కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు అర్హత లేకుండా పెన్షన్ తీసుకున్న వారి దగ్గర నుంచి పెన్షన్ మొత్తం సొమ్మును రికవరీ చేయాలని చంద్రబాబు సంచలన ఆదేశాలు జారీ చేశారు.
10 వేల మందిలో 500 మంది అనర్హులు పెన్షన్లు తీసుకుంటున్నట్లుగా సర్వేలో తేలిందని చంద్రబాబు అన్నారు. రాబోయే మూడు నెలల్లో ప్రతి పెన్షన్ లబ్ధిదారుడిని జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని, అనర్హులను ఏరివేయాలని ఆదేశించారు. పెన్షన్ల కోసం తప్పుడు సర్టిఫికెట్ సమర్పించిన వారితోపాటు సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లను కూడా ప్రాసిక్యూట్ చేయాలని చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్ల కోసం మెడికల్ బోర్డుల నుంచి బోగస్ సర్టిఫికెట్లు తెచ్చారని, అవి కూడా కొన్ని ఆసుపత్రులు మాత్రమే ఇటువంటి సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లుగా తమ పరిశీలనలో తేలిందని చంద్రబాబు అన్నారు.
ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలోని దంతా నియోజకవర్గంలో 484 పెన్షన్లు ఉన్నాయని, 78 వికలాంగుల పెన్షన్లలో 56 మంది అనర్హులని తేలింది. కలెక్టర్లు అనర్హులైన పెన్షన్ దారులందరిని మూడు నెలల్లోపు గుర్తించాలని, ఆ తర్వాత కూడా ఎవరైనా అనర్హలు పెన్షన్ తీసుకుంటున్నట్లు తేలితే సంబంధిత కలెక్టర్ ను బాధ్యులను చేస్తామని చంద్రబాబు అన్నారు. అంతేకాకుండా అర్హులు కాకుండానే పెన్షన్ తీసుకుంటున్న వారికి పెన్షన్ పథకాన్ని పూర్తిగా రద్దు చేసే యోచనలో కూడా ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.
This post was last modified on December 12, 2024 6:03 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…