Political News

జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక నిర్ణయం

వన నేషన్ – వన్ ఎలక్షన్ అనే విషయంలో చాలా కాలంగా అనేక రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఎట్టకేలకు దేశవ్యాప్తంగా ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించాలనే జమిలి ఎన్నికల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ చర్యపై వివిధ రాజకీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం విస్తృత సంప్రదింపులకు సిద్ధమవుతోంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో జమిలి ఎన్నికలపై ఏర్పాటైన కమిటీ గతంలో 18,000 పేజీల నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. ఈ నివేదికలో ఎన్నికల నిర్వహణకు రెండు దశల ప్రణాళికను సూచించారు. మొదటిగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని, ఆ తర్వాత 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ఈ కమిటీ సిఫారసు చేసింది.

జమిలి ఎన్నికల ప్రతిపాదనకు 30కిపైగా రాజకీయ పార్టీలు మద్దతు తెలపగా, కాంగ్రెస్‌ సహా కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఒకే సమయంలో ఎన్నికలు ఆచరణీయమేమీ కాదని కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది. విభిన్న అవసరాలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించడం అవసరమని, ప్రజాస్వామ్యానికి ఇదే సరైన మార్గమని కాంగ్రెస్ వాదిస్తోంది.

ఇప్పటి వరకు జమిలి ఎన్నికలపై వ్యతిరేకత, మద్దతు రెండూ కూడిన చర్చలు కొనసాగుతున్నాయి. బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ రాష్ట్రాల శాసనసభ స్పీకర్లతో పాటు, అన్ని పార్టీల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపేందుకు సిద్ధమవుతోంది. జమిలి ఎన్నికల బిల్లుపై శీతాకాల సమావేశాల్లో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

This post was last modified on December 12, 2024 4:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

2 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

3 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

4 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

4 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

4 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

5 hours ago