ఇంకో ఇరవై ఎనిమిది రోజుల్లో గేమ్ ఛేంజర్ ఆగమనం జరగనుంది. పుష్ప 2 ది రూల్ తర్వాత టాలీవుడ్ నుంచి వస్తున్న పెద్ద ప్యాన్ ఇండియా మూవీ ఇదే. డిసెంబర్ 21 యుఎస్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్ల వేగం పెంచబోతున్నారు. నిన్న వదిలిన కొత్త ప్రోమోలో గతంలో చూడని విజువల్స్ ఉండటం ఫ్యాన్స్ ని సంతోషపరిచింది. తాజాగా వచ్చిన సమాచారం మేరకు ఈ చిత్ర నిడివి 2 గంటల 42 నిమిషాలకు లాక్ చేశారని తెలిసింది. మాములుగా శంకర్ సినిమాలు మూడు గంటలకు దగ్గరగా లేదా అంతకు మించి ఉంటాయి. ఇంత తక్కువ లెన్త్ రామ్ చరణ్ కు ప్లాన్ చేయడమంటే సంథింగ్ స్పెషలనే చెప్పాలి.
సెన్సార్ కాపీ ఇంకా సిద్ధం కాలేదు కాబట్టి నిర్ధారణగా చెప్పలేం కానీ ప్రాధమికంగా శంకర్ లాక్ చేసుకున్న ఫైనల్ ఎడిట్ ఇంతే ఉంటుందట. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ మీద అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే అప్పన్న ఫ్లాష్ బ్యాక్ లీకులు తెగ ఊరించేలా ఉన్నాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం గతంలో ఎన్నడూ చూడని రేంజ్ లో ఉంటుందని వినిపిస్తోంది. కాలేజీ స్టూడెంట్, ఐఎఎస్ ఆఫీసర్, రైతు సమస్యల మీద పోరాటం చేసే నాయకుడిగా మూడు షేడ్స్ చూపించబోతున్నారు. తమన్ సంగీతంలో ఇప్పటికే మూడు పాటలు రాగా నాలుగోది అమెరికాలో లాంచవుతుంది.
ఎల్లుండి నుంచి ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకాబోతున్నట్టు సమాచారం. అందులో భాగంగా బుకింగ్ యాప్స్, వెబ్ సైట్స్ లో పేర్కొన్న నిడివి పైన చెప్పిన దాన్నే నిర్ధారిస్తోంది. శంకర్ ప్రస్తుతం చివరి దశ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ నెలాఖరు కన్నా ముందే ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలి. రీ రికార్డింగ్ ఇంకా మొదలుపెట్టలేదు. కొంత భాగానికి అయ్యింది కానీ ఇంకా బ్యాలన్స్ ఉంది. తమన్ దాని కోసమే వెయిట్ చేస్తున్నాడు. తనకు డాకు మహారాజ్ బాధ్యత కూడా ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన గేమ్ ఛేంజర్ జనవరి 12న 12 వేలకు పైగా స్క్రీన్లలో రిలీజ్ కానుంది.
ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…
నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…