Political News

ఏపీ వ‌క్ఫ్ బోర్డ్ క్యాన్సిల్‌… కూట‌మి స‌ర్కార్ షాకింగ్ ట్విస్ట్‌…!


రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ వ‌ర్గాలకు కీల‌క‌మైన వ‌క్ఫ్ బోర్డును తాజాగా కూట‌మి ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. వాస్త‌వానికి రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. ఏర్ప‌డిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వ‌క్ఫ్ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, అప్ప‌ట్లో ఏర్పాటు చేయ‌లేదు. దీంతో జ‌గ‌న్ అదికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. దానిని ఏర్పాటు చేసి.. బోర్డును కూడా నియ‌మించారు. ఇటీవ‌ల కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. నెల్లూరు జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు అజీజ్‌ను వ‌క్ఫ్‌బోర్డుకు చైర్మ‌న్‌గా నియ‌మించారు.

అంటే.. కూట‌మి ప్ర‌భుత్వం వైసీపీ లో ఉన్న బోర్డును ర‌ద్దు చేసి.. కూట‌మి పార్టీల‌కు చెందిన మైనారిటీ నాయ‌కుల‌తో బోర్డును ఏర్పాటు చేసింది. కానీ.. తాజాగా శ‌నివారం అర్ధ‌రాత్రి వ‌క్ఫ్ బోర్డును ర‌ద్దు చేస్తున్నట్టు ప్ర‌క‌టించింది. ఈ ప‌రిణామం.. మైనారిటీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీసింది. అయితే.. ఈ ర‌ద్దు వెనుక కూట‌మి పార్టీలోని బీజేపీ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం వ‌క్ఫ్ బోర్డును ప్ర‌క్షాళ‌న చేయాల‌న్న ఉద్దేశంతో ఉంది.

ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల్లో వ‌క్ఫ్ బోర్డు స‌వ‌ర‌ణ బిల్లును పార్ల‌మెంటులో పెట్టి ఆమోదించుకునే ప్ర‌య‌త్నంలో ఉంది. దీనికి టీడీపీ మ‌ద్ద‌తు ఇస్తోంది. ఇక‌, జ‌న‌సేన ఆది నుంచి కూడా బీజేపీ నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకిస్తున్న ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో వ‌క్ఫ్ బోర్డు స‌వ‌ర‌ణ బిల్లు ఆ పార్టీకి చెందిన ఇద్ద‌రు ఎంపీలు కూడా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా కూట‌మి ప్ర‌భుత్వం ఏపీలో బోర్డును ర‌ద్దు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

అయితే.. కేంద్రం తీసుకువ‌చ్చే స‌వ‌ర‌ణ బిల్లు ఆమోదం పొందిన త‌ర్వాత‌.. దానిప్ర‌కారం బోర్డు ఏర్పాటు చేసే అవ‌కాశం ఉందని టీడీపీ మైనారిటీ నాయ‌కులు చెబుతున్నారు. కానీ, దీనికి చాలా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. రాజ్య‌స‌భ‌లో బీజేపీకి బ‌ల‌మైన సంఖ్య‌లో స‌భ్యులు లేరు. కాంగ్రెస్ వ‌క్ఫ్ చ‌ట్టాల‌ను స‌మ‌ర్థిస్తోంది. ఈ నేప‌థ్యంలో బిల్లు రాజ్య‌స‌భ‌లో నెగ్గ‌డం క‌ష్ట‌మేన‌న్న‌ది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికిప్పుడు ర‌ద్దు చేసినా.. ఏర్పాటు చేయ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. దీంతో కూట‌మిపై మైనారిటీల ప్ర‌భావం ఏమేర‌కు ప‌డుతుంద‌నేది చూడాలి.

Satya

Recent Posts

టాలీవుడ్‌పై బాలీవుడ్ ఏడుపుకిది నిదర్శనం

ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…

37 minutes ago

జగన్ అటాక్ మోడ్ లోకి వచ్చినట్టేనా…?

ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…

1 hour ago

సీబీఎన్ @ 361 డిగ్రీస్..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. పాల‌న‌, ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు.. వేస్తున్న అడుగులు, భ‌విష్య‌త్తు ఆంధ్ర ప్ర‌దేశ్ నిర్మాణం.. వంటి ప‌లు…

2 hours ago

పవన్ కొత్త టార్గెట్ ఇదే!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…

4 hours ago

`అన్న‌లు` నా పార్టీలోనే ఉన్నారు: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ర‌క్ష‌ణ‌ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడ‌తార‌న్న పేరుంది. పైగా మాట‌ల విష‌యంలో ఆమె…

4 hours ago

అమర్ నాథ్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…

4 hours ago