Political News

ఏపీ వ‌క్ఫ్ బోర్డ్ క్యాన్సిల్‌… కూట‌మి స‌ర్కార్ షాకింగ్ ట్విస్ట్‌…!


రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ వ‌ర్గాలకు కీల‌క‌మైన వ‌క్ఫ్ బోర్డును తాజాగా కూట‌మి ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. వాస్త‌వానికి రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. ఏర్ప‌డిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వ‌క్ఫ్ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, అప్ప‌ట్లో ఏర్పాటు చేయ‌లేదు. దీంతో జ‌గ‌న్ అదికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. దానిని ఏర్పాటు చేసి.. బోర్డును కూడా నియ‌మించారు. ఇటీవ‌ల కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. నెల్లూరు జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు అజీజ్‌ను వ‌క్ఫ్‌బోర్డుకు చైర్మ‌న్‌గా నియ‌మించారు.

అంటే.. కూట‌మి ప్ర‌భుత్వం వైసీపీ లో ఉన్న బోర్డును ర‌ద్దు చేసి.. కూట‌మి పార్టీల‌కు చెందిన మైనారిటీ నాయ‌కుల‌తో బోర్డును ఏర్పాటు చేసింది. కానీ.. తాజాగా శ‌నివారం అర్ధ‌రాత్రి వ‌క్ఫ్ బోర్డును ర‌ద్దు చేస్తున్నట్టు ప్ర‌క‌టించింది. ఈ ప‌రిణామం.. మైనారిటీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీసింది. అయితే.. ఈ ర‌ద్దు వెనుక కూట‌మి పార్టీలోని బీజేపీ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం వ‌క్ఫ్ బోర్డును ప్ర‌క్షాళ‌న చేయాల‌న్న ఉద్దేశంతో ఉంది.

ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల్లో వ‌క్ఫ్ బోర్డు స‌వ‌ర‌ణ బిల్లును పార్ల‌మెంటులో పెట్టి ఆమోదించుకునే ప్ర‌య‌త్నంలో ఉంది. దీనికి టీడీపీ మ‌ద్ద‌తు ఇస్తోంది. ఇక‌, జ‌న‌సేన ఆది నుంచి కూడా బీజేపీ నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకిస్తున్న ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో వ‌క్ఫ్ బోర్డు స‌వ‌ర‌ణ బిల్లు ఆ పార్టీకి చెందిన ఇద్ద‌రు ఎంపీలు కూడా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా కూట‌మి ప్ర‌భుత్వం ఏపీలో బోర్డును ర‌ద్దు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

అయితే.. కేంద్రం తీసుకువ‌చ్చే స‌వ‌ర‌ణ బిల్లు ఆమోదం పొందిన త‌ర్వాత‌.. దానిప్ర‌కారం బోర్డు ఏర్పాటు చేసే అవ‌కాశం ఉందని టీడీపీ మైనారిటీ నాయ‌కులు చెబుతున్నారు. కానీ, దీనికి చాలా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. రాజ్య‌స‌భ‌లో బీజేపీకి బ‌ల‌మైన సంఖ్య‌లో స‌భ్యులు లేరు. కాంగ్రెస్ వ‌క్ఫ్ చ‌ట్టాల‌ను స‌మ‌ర్థిస్తోంది. ఈ నేప‌థ్యంలో బిల్లు రాజ్య‌స‌భ‌లో నెగ్గ‌డం క‌ష్ట‌మేన‌న్న‌ది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికిప్పుడు ర‌ద్దు చేసినా.. ఏర్పాటు చేయ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. దీంతో కూట‌మిపై మైనారిటీల ప్ర‌భావం ఏమేర‌కు ప‌డుతుంద‌నేది చూడాలి.

This post was last modified on December 1, 2024 6:42 pm

Share

Recent Posts

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

22 minutes ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

30 minutes ago

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

42 minutes ago

ఆ ఒక్కటి అడగొద్దంటే ఎలా విశ్వంభరా

ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…

46 minutes ago

వైసీపీ ఎంపీ అవినాష్ ఇంట్లో భారీగా డ‌బ్బు స్వాధీనం

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు సోద‌రుడి వ‌రుస‌య్యే క‌డ‌ప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…

2 hours ago

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

3 hours ago