Political News

టీడీపీ ఎమ్మెల్యేకు పవన్ క్లాస్

జగన్ హయాంలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమ బియ్యం ఎగుమతి చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ద్వారంపూడిపై గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. అయితే, ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉన్నప్పటికీ కాకినాడ పోర్టు కేంద్రంగా అక్రమ బియ్యం రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై పవన్ కల్యాణ్ స్పందించారు.

ఇలాంటి ఘటనలను పట్టించుకోవాలంటటూ స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పోర్టు అధికారులపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అక్రమ రేషన్ బియ్యంపై పోరాటం చేశామని, అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పరిస్థితి మారకుంటే ఎలా అని పవన్ అసహనం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం 640 టన్నుల బియ్యాన్ని కాకినాడ కలెక్టర్ సీజ్ చేసిన ప్రాంతానికి నౌకలో వెళ్లి పరిశీలించిన సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ పోర్టు నుంచి గత ప్రభుత్వ పాలనలో మొదలైన అక్రమ రవాణా ఇప్పటికే కొనసాగుతోందని, జవాబుదారీతనం లేదని పవన్ ఫైర్ అయ్యారు. పోర్ట్ ఆఫీసర్ ధర్మ శాస్త్రి, డీఎస్పీ రఘు వీర్, సివిల్ సప్లై డీ ఎస్ ఓ ప్రసాద్ పై పవన్ సీరియస్ అయ్యారు. అక్రమ రేషన్ వంటి వ్యవహారాలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని, కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ప్రభుత్వం చెబుతున్నట్లు లేవని అసహనం వ్యక్తం చేశారు. పోర్ట్‌ కు ఇన్ని టన్నుల అక్రమ రేషన్ బియ్యం వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

స్వయంగా మంత్రి వచ్చి చెప్పినా సీరియస్ నెస్ లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తప్పవని పవన్ వార్నింగ్ ఇచ్చారు. పోర్టులో ఎవరూ బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.

This post was last modified on November 29, 2024 5:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

KVN… అగ్ర సంస్థకు అంతులేని అడ్డంకులు

సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…

36 minutes ago

ప్రచారంలో నాయకుడు లేడు కానీ రూపం ఉంది

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…

3 hours ago

వైభవ్ సూర్యవంశీని ఆపాలంటే…

ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి…

3 hours ago

రాజమౌళి టెన్షన్ పడే టైపు కాదు

ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…

3 hours ago

రజినీకాంత్ సినిమాకు దర్శకుల కష్టాలు

అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…

4 hours ago

విజ‌య్ గ్రాఫ్‌… పోలింగ్ ముందు ఎలా ఉంది?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ఈనెల 23న జరగనుంది. అంటే పది రోజుల్లో ప్రజలు త‌మ‌ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని…

4 hours ago