Political News

టీడీపీ ఎమ్మెల్యేకు పవన్ క్లాస్

జగన్ హయాంలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమ బియ్యం ఎగుమతి చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ద్వారంపూడిపై గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. అయితే, ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉన్నప్పటికీ కాకినాడ పోర్టు కేంద్రంగా అక్రమ బియ్యం రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై పవన్ కల్యాణ్ స్పందించారు.

ఇలాంటి ఘటనలను పట్టించుకోవాలంటటూ స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పోర్టు అధికారులపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అక్రమ రేషన్ బియ్యంపై పోరాటం చేశామని, అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పరిస్థితి మారకుంటే ఎలా అని పవన్ అసహనం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం 640 టన్నుల బియ్యాన్ని కాకినాడ కలెక్టర్ సీజ్ చేసిన ప్రాంతానికి నౌకలో వెళ్లి పరిశీలించిన సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ పోర్టు నుంచి గత ప్రభుత్వ పాలనలో మొదలైన అక్రమ రవాణా ఇప్పటికే కొనసాగుతోందని, జవాబుదారీతనం లేదని పవన్ ఫైర్ అయ్యారు. పోర్ట్ ఆఫీసర్ ధర్మ శాస్త్రి, డీఎస్పీ రఘు వీర్, సివిల్ సప్లై డీ ఎస్ ఓ ప్రసాద్ పై పవన్ సీరియస్ అయ్యారు. అక్రమ రేషన్ వంటి వ్యవహారాలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని, కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ప్రభుత్వం చెబుతున్నట్లు లేవని అసహనం వ్యక్తం చేశారు. పోర్ట్‌ కు ఇన్ని టన్నుల అక్రమ రేషన్ బియ్యం వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

స్వయంగా మంత్రి వచ్చి చెప్పినా సీరియస్ నెస్ లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తప్పవని పవన్ వార్నింగ్ ఇచ్చారు. పోర్టులో ఎవరూ బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.

This post was last modified on November 29, 2024 5:24 pm

Share

Recent Posts

సౌండ్ సరిపోతుందా శ్రీనివాసా

వచ్చే వారం జూలై 30 శ్రీనివాస మంగాపురం విడుదలవుతోంది. హీరో జయకృష్ణ, హీరోయిన్ రషా తదాని రెగ్యులర్ గా ప్రమోషన్లలో…

27 minutes ago

బెజవాడ నడిబొడ్డున ముద్రగడ విగ్రహం

కాపు ఉద్యమ నేత, సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త ముద్రగడ పద్మనాభం విగ్రహం బెజవాడలో త్వరలోనే ఏర్పాటు కానుంది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం…

2 hours ago

కాబోయే విద్యాశాఖ మంత్రి ఎవరు?

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర…

2 hours ago

యువత తిరగబడింది… రాజ్యం ఉలికిపడింది!

నిజమే... యువత తిరగబడింది. రాజ్యం ఉలిక్కిపడింది. యువతలో ఆగ్రహావేశాలకు కారణంగా నిలిచిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి…

4 hours ago

శ్రీగౌరి నేర్చుకోవాల్సిన బేబీ పాఠాలు

మూడేళ్ళ క్రితం బేబీ విడుదలై బ్లాక్ బస్టర్ సాధించాక అందరి  అటెన్షన్ తీసుకున్న అమ్మాయి వైష్ణవి చైతన్య. అప్పటిదాకా చిన్న…

4 hours ago

ధర్మేంద్ర రాజీనామా… బొద్దింకలకు సరిపోదు!

కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.…

5 hours ago