మీడియాపై యుద్ధానికి వైసీపీ అధినేత జగన్ సిద్ధమయ్యారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల పేర్లను ప్రస్తా విస్తూ.. ఆయన న్యాయ పోరాటం చేస్తానని చెప్పుకొచ్చారు. ఈ రెండు మీడియా సంస్థలు.. తన పరువును తీస్తున్నాయని, అదానీతో ఒప్పందం కుదుర్చుకోలేదని పదే పదే చెబుతున్నా.. వినిపించుకోవడం లేదన్న ది ఆయన ఆవేదన ఈ క్రమంలోనే న్యాయ పోరాటానికి రెడీ అవుతున్నానని కూడా చెప్పుకొచ్చారు.
ముందుగా ఆయా మీడియా సంస్థలకు నెల రోజుల సమయంఇచ్చారు. క్షమాపణలు చెప్పాలని కూడా కోరారు. లేక పోతే ఒక్కొక్క పత్రికపై 100 కోట్ల మేరకు పరువునష్టం దావా వేస్తానన్నారు. అయితే.. జగన్ చేసిన ప్రకటన చిత్రమేమీకాదు. ఇప్పటికే దేశంలో చాలా మంది మీడియాపై పరువు నష్టం దావా వేసిన వారు ఉన్నారు. వీరిలో కేంద్ర హోం మంత్రి అమిత్షా, మరో మంత్రి నితిన్ గడ్కరీలు కూడా ఉండడం గమనార్హం.
మీడియాపై పరువు నష్టం వేసి.. గెలిచిన వారు ఇప్పటి వరకు అయితే కనిపించలేదు. దీనికి కారణం.. మీడియాకు ఉన్న రాజ్యాంగపరమైన రక్షణ. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 భావ ప్రకటా స్వేచ్ఛకు ఎలా అయితే పూచీ వహిస్తోందో.. అలానే మీడియా చేసేవ్యాఖ్యలకు, వేసే వార్తలకు కూడా.. పత్రికా స్వేచ్ఛ వర్తిస్తుంది. అలాగని వ్యక్తిగతంగా దూషిస్తే.. తప్పే. కానీ, ఇక్కడ అదానీ నుంచి లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చిన దరిమిలా.. ఆ రెండు మీడియా సంస్థలు వరుస కథనాలు రాస్తున్నాయి.
వీటిని డిఫెండ్ చేసుకునే పరిస్థితి జగన్కు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన న్యాయ పోరా టానికి దిగినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ పోరాటం ఏమేరకు ఆయనకు మైలేజీ తీసుకువస్తుందన్నది ప్రశ్న. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డికూడా ఇలానే ఆ రెండు మీడియా సంస్థలు అంటూ.. ఈ పత్రికలు, మీడియాపైనే నిప్పులు చెరిగే వారు. కానీ, న్యాయ పోరాటానికి ఎప్పుడూ దిగలేదు.
దీనికి కారణం.. న్యాయ పోరాటం చేసినా.. ఫలితం ఉండే అవకాశం లేదు. కానీ, ఇప్పుడు ఆయన కుమారుడు మీడియాపై న్యాయ పోరాటానికి దిగుతానని తేల్చిచెబుతున్నా.. ఇది కేవలం పేపర్ పులి మాదిరిగానే మారనుందని అంటున్నారు పరిశీలకులు. జగన్ ప్రకటనతో మరిన్ని వివాదాలు కొని తెచ్చుకున్నట్టేనని చెబుతున్నారు.
This post was last modified on November 29, 2024 3:50 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…