అదానీతో విద్యుత్ ఒప్పందం, లంచం వ్యవహారాలపై ఏపీ మాజీ సీఎం జగన్ స్పందించిన సంగతి తెలిసిందే. ఆ ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న సెకీకి మధ్య జరిగిందని జగన్ అన్నారు. తక్కువ ధరకే విద్యుత్ కొన్న తనను పొగిడి శాలువా కప్పి అవార్డు ఇవ్వాల్సింది పోయి అభాండాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జగన్ కు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేసే దమ్ముందా అని జగన్ కు షర్మిల సవాల్ విసిరారు.
అబద్ధాలను అందంగా అల్లడంలో జగన్ గారికి ఆస్కార్ అవార్డు ఇచ్చి శాలువా కప్పాలని సెటైర్లు వేశారు. శాలువలు, సన్మానాలు, అవార్డులు కోరుకొనే ముందు జగన్ గారు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రూ 2.49 పైసలకు యూనిట్ కొనే సమయంలో సెకీ అమ్ముతోన్న విద్యుత్ గరిష్ట ధర రూ.2.16 అని, ఎక్కువ పెట్టి కొన్నందుకు శాలువలు కప్పాలా? అని ప్రశ్నించారు. గుజరాత్ యూనిట్ రూ 1.99 పైసలకే యూనిట్ కొన్న సమయంలో 50పైసలు ఎక్కువ పెట్టి ఏపీ కొన్నందుకు సన్మానం చేయాలా అని నిలదీశారు.
ఏ రాష్ట్రం అదానీతో ఒప్పందానికి ముందుకు రాని సమయంలో ఆఘమేఘాల మీద ఏపీ ఒప్పందం చేసుకుందని, అందుకు జగన్ కు అవార్డులు ఇవ్వాలా ? అని ఎద్దేవా చేశారు. ట్రాన్స్మిషన్ ఛార్జీలు గరిష్ఠంగా యూనిట్ కు రూ.1.70 పైసలు పడతాయని ఇంధన శాఖ చెబుతోందని, ఎటువంటి ఛార్జీలు లేవని జగన్ చెబుతున్న మాటలు శుద్ధ అబద్ధం కాదా? అని నిలదీశారు. ఒక ముఖ్యమంత్రిని ఒక వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోప్యత ఎందుకు పాటించారో చెప్పాలని ప్రశ్నించారు.
అదానీతో జగన్ ఒప్పందం అంతర్జాతీయ స్కామ్ అని,1750 కోట్లు సీఎంకు ముడుపులు ఇవ్వడం చరిత్ర అని అన్నారు. అదానీ కోసం అన్ని టెండర్లు రద్దు చేయడం, అర్ధరాత్రి ఫైళ్లు పంపడం, హడావిడిగా కేబినెట్ లో ఆమోదింపజేయడం చరిత్ర అని చురకలంటించారు. ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం రూ.1.67 లక్షల కోట్ల భారాన్ని జనంపై మోపడం చరిత్ర అని అన్నారు. 2021లో ఏపీ చీఫ్ మినిస్టర్ కు లంచం ఇచ్చారని అమెరికా దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయని, ఆనాడు సీఎం మీరు కారా, ఇదేం ఆఫ్ బేస్ట్ నాలెడ్జ్ ? ఇదేం అహంకారపు తిరస్కరణ సమాధానం..? అని ఎద్దేవా చేశారు. అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేసే దమ్ముందా అని షర్మిల సవాల్ విసిరారు. మరి, షర్మిల సవాల్ ను జగన్ స్వీకరిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.
This post was last modified on November 29, 2024 3:38 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…