జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ప్రసాదం పవిత్రమైనదని, ఎంతో ప్రత్యేకమైనదని పవన్ అన్నారు. జగన్ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠ మసకబారిందని పవన్ విమర్శించారు. ఐదేళ్ల జగన్ పాలనలో టీటీడీలో ఎన్నో అవకతవకలు జరిగాయని, తిరుమల ఆలయాన్ని జగన్ ఓ ఆదాయ వనరుగా చూశారని పవన్ సంచలన ఆరోపణలు చేశారు.
వక్ఫ్ బోర్డు మాదిరిగా ఒక కామన్ బోర్డు హిందువులకు ఉండాలని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మ బోర్డు అవసరం ఉందని, అందుకే దానిని ప్రకటించానని అన్నారు. హిందూ ఆలయాలు హిందువుల ఆధ్వర్యంలోనే ఉండాలని, అన్యమతస్థులు ఉండకూడదని, మక్కాలో, జెరూసలేంలో అన్యమతస్తులు లేరని గుర్తు చేశారు. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఇంత గొడవ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.
ఆలయాల వ్యవహారాలు మాత్రమే కోర్టుకు ఎందుకు వెళుతున్నాయని పవన్ ప్రశ్నించారు. ఆలయాలపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటే బాగుంటుందని పవన్ అభిప్రాయపడ్డారు. ఆలయాలు ఆదాయ వనరులు కావని అన్నారు. లడ్డూ తయారీలో కల్తీ పదార్థాలు వాడారన్న ఆరోపణలు రావడం బాధాకరమని అన్నారు. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం మాదిరి క్రిస్టియానిటీ, ఇస్లాంలో జరిగితే ఆ మతస్తులు తీవ్రంగా స్పందిస్తారని, కానీ, హిందువులు మాత్రం ఆ స్థాయిలో స్పందించడం లేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం లడ్డూ కల్తీ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని అన్నారు.
తాను హిందువునని, అదే సమయంలో మిగతా మతాలను గౌరవిస్తానని పవన్ చెప్పారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను చూస్తుంటే బాధ కలుగుతోందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్కాన్ మాజీ గురువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు, తదనంతర పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. బంగ్లాదేశ్ హిందూ మైనార్టీలపై జరుగుతున్న దారుణాలు ఆపేందుకు బంగ్లాదేశ్ ప్రధాని మహమ్మద్ యూనస్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాలస్తీనాలో ఏమైనా జరిగితే ప్రపంచమంతా మాట్లాడుతుందని, బంగ్లాదేశ్లో జరుగుతున్న దానిపై ఎవరూ స్పందించట్లేదని పవన్ అన్నారు.
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…
ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో…