కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సారథ్యంపై సొంత పార్టీలోనే లుకలుకలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ లేరు. ఈ బాధ్యతలు కర్ణాటకకు చెందిన మల్లికార్జున ఖర్గే చూస్తు న్నారు. అయితే.. ఎంత తెరచాటున ఉన్నా.. రాహుల్ చక్రం తిప్పుతున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ చక్రాలు.. ఈ సూచనలే.. కాంగ్రెస్కు మేలు చేయకపోగా నష్టాన్ని చేకూరుస్తున్నాయని అంటున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. కాంగ్రెస్లో రాహుల్కు మార్కులు తగ్గుతున్నాయి.
తాజాగా రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కేరళలోని వయనాడ్ నుంచి విజయం దక్కించుకున్నా రు. ఇదేదో సాధారణ విజయం అనుకుంటే పొరపాటే. ఐదు మాసాల కిందట ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలు.. మరోసారి కూడా ఆ పార్టీకే పట్టం కట్టారు. అది కూడా రాహుల్ కంటే కూడా లక్ష ఓట్లు ఎక్కువగా ప్రియాంకకు వేశారు. ఈ పరిణామాలు కాంగ్రెస్లో చర్చకు వచ్చాయి. రాహుల్ కంటే కూడా ప్రియాంక బెటర్ అనే చర్చ తాజాగా వెలుగు చూస్తోంది.
ఇక, తాజాగా పార్లమెంటులో ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమయంలో దేశవ్యాప్తంగా అన్ని టీవీ చానెళ్లు లైవులు ఇచ్చాయి. వీటికి వచ్చిన వ్యూస్.. గతంలో రాహుల్ తొలిసారి ఎంపీ అయిన ప్పుడు కూడా ఇలానే టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. అయితే.. ఇన్ని వ్యూస్ రాలేదు. పైగా ఆమె రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పెట్టుకుని మరీ ప్రమాణం చేయడం కూడా అందరినీ ఆసక్తిగా గమనించేలా చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో రాహుల్ కంటే ప్రియాంకే బెటర్ అంటూ.. మహారాష్ట్ర సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేసింది. రాహుల్ సారథ్యంలో ఇప్పటికే 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. 3 సార్వత్రిక ఎన్నికలు కూడా జరిగాయి. అయితే.. మూడు సార్వత్రిక(2014, 2019, 2024) ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం అయింది. 9 రాష్ట్రాల్లో కేవలం రెండు చోట్ల మాత్రమే గెలుపు గుర్రం ఎక్కింది. అది కూడా అతి కష్టం మీద. ఈ నేపథ్యంలో రాహుల్ స్థానంలో ప్రియాంక అయితేనే బెటర్ అన్నది కాంగ్రెస్లోనే చర్చ సాగుతోంది. మున్ముందు ఈ వాదన బలపడే అవకాశం ఉంది.
This post was last modified on November 28, 2024 8:35 pm
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్యవహారంతో పాటు.. పార్టీలో మరింత మంది…
జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…