కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సారథ్యంపై సొంత పార్టీలోనే లుకలుకలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ లేరు. ఈ బాధ్యతలు కర్ణాటకకు చెందిన మల్లికార్జున ఖర్గే చూస్తు న్నారు. అయితే.. ఎంత తెరచాటున ఉన్నా.. రాహుల్ చక్రం తిప్పుతున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ చక్రాలు.. ఈ సూచనలే.. కాంగ్రెస్కు మేలు చేయకపోగా నష్టాన్ని చేకూరుస్తున్నాయని అంటున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. కాంగ్రెస్లో రాహుల్కు మార్కులు తగ్గుతున్నాయి.
తాజాగా రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కేరళలోని వయనాడ్ నుంచి విజయం దక్కించుకున్నా రు. ఇదేదో సాధారణ విజయం అనుకుంటే పొరపాటే. ఐదు మాసాల కిందట ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలు.. మరోసారి కూడా ఆ పార్టీకే పట్టం కట్టారు. అది కూడా రాహుల్ కంటే కూడా లక్ష ఓట్లు ఎక్కువగా ప్రియాంకకు వేశారు. ఈ పరిణామాలు కాంగ్రెస్లో చర్చకు వచ్చాయి. రాహుల్ కంటే కూడా ప్రియాంక బెటర్ అనే చర్చ తాజాగా వెలుగు చూస్తోంది.
ఇక, తాజాగా పార్లమెంటులో ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమయంలో దేశవ్యాప్తంగా అన్ని టీవీ చానెళ్లు లైవులు ఇచ్చాయి. వీటికి వచ్చిన వ్యూస్.. గతంలో రాహుల్ తొలిసారి ఎంపీ అయిన ప్పుడు కూడా ఇలానే టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. అయితే.. ఇన్ని వ్యూస్ రాలేదు. పైగా ఆమె రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పెట్టుకుని మరీ ప్రమాణం చేయడం కూడా అందరినీ ఆసక్తిగా గమనించేలా చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో రాహుల్ కంటే ప్రియాంకే బెటర్ అంటూ.. మహారాష్ట్ర సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేసింది. రాహుల్ సారథ్యంలో ఇప్పటికే 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. 3 సార్వత్రిక ఎన్నికలు కూడా జరిగాయి. అయితే.. మూడు సార్వత్రిక(2014, 2019, 2024) ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం అయింది. 9 రాష్ట్రాల్లో కేవలం రెండు చోట్ల మాత్రమే గెలుపు గుర్రం ఎక్కింది. అది కూడా అతి కష్టం మీద. ఈ నేపథ్యంలో రాహుల్ స్థానంలో ప్రియాంక అయితేనే బెటర్ అన్నది కాంగ్రెస్లోనే చర్చ సాగుతోంది. మున్ముందు ఈ వాదన బలపడే అవకాశం ఉంది.
This post was last modified on November 28, 2024 8:35 pm
మన దేశంలో రాజకీయ వారసత్వం సర్వ సాధారణం. సినిమాల్లో నెపోటిజం మాదిరిగానే పొలిటికల్ నెపోటిజం వల్ల వచ్చిన పొలిటిషియన్లు చాలామంది…
స్థానిక ఎన్నికల్లో గెలుపోటములను ప్రత్యర్థులు ఎలా మేనేజ్ చేసినా.. యుద్ధం మాత్రం జరగాలట..! తన పార్టీ కార్యకర్తలకు జగన్ ఇస్తున్న…
సినిమాల్లో సక్సెస్ కోసం కిందా మీద పడుతున్నాడు కానీ సిద్దార్థ్ కు డిజిటల్ స్పేస్ లో మంచి కంటెంట్ దొరుకుతోంది.…
నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించనప్పటికీ టాక్సిక్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి టికెట్ రేట్ల పెంపు తీసుకుంటారనే టాక్ బయటికి…
అయ్యప్ప స్వామి భక్తులు పాడుకునే పాటల్ల ో ‘మల్లెపూల పల్లకి’కి ఉన్న ఆదరణే వేరు. అయ్యప్ప మాల సీజన్ మొదలైందంటే ఈ పాట ఊర్లలో మార్మోగిపోతుంటుంది.…
నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసులో చిక్కుముడి వీడింది. ఇద్దరు పదో…