కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షాతో ఏపీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ నేత కనుమూరి రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత.. తొలిసారి ఢిల్లీ వచ్చిన రఘురామ.. హోం మంత్రితో భేటీ కావడం సంచలనంగా మారింది. పైగా డిప్యూటీ స్పీకర్గా కూడా ఎన్నికైన తర్వాత ఆయన కలుసుకోవడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. సుమారు 20 నిమిషాల పాటు రఘురామ హోం శాఖ మంత్రితో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఏం చర్చించారన్న విషయాలు ఆసక్తిగా మారాయి. గత వైసీపీ ప్రభుత్వంలో తనను అరె స్టు చేయడం, పోలీసులు నిర్బంధించి తనను కొట్టడం దీనిని వీడియో కాల్లో `పెద్దలకు` చూపించారన్న అభియోగాలు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. ఆ కేసును తిరిగి తోడుతున్నారు. ప్రధాన అభియోగాలు ఎదుర్కొంటున్న ఏ ఎస్పీ.. పాల్ కూడా ప్రస్తుతం లైన్లోకి వచ్చా రు. ఇక, కీలకమైన అధికారులు సహా రాజకీయ పెద్దలు మాత్రమే ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఢిల్లీకి రావడం, కేంద్ర హోం మంత్రి షాతో రఘురామ భేటీ కావడం వంటివి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎందుకంటే.. పెద్దలపై కేసు బిగుస్తోందని, తనను ఎవరు కొట్టారో కాదు .. ఎవరు కొట్టించారో త్వరలోనే తేలుతుందని తాజాగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆ `పెద్దలకు` ఎలాంటి మద్దతు లభించకుండా చేసే వ్యూహంలో భాగంగానే రఘురామ ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రధానంగా ఇప్పటి వరకు ఢిల్లీ అండ చూసుకుని గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలు చెలరేగిపోయార న్న విమర్శలు వున్నాయి. అయితే.. ఇప్పుడు ఏపీలో సర్కారు మారడంతో ఢిల్లీ పెద్దల ఆలోచన కూడా మారుతుందని, ఆ నేపథ్యంలోనే తనకు న్యాయం జరుగుతుందని ఆర్ ఆర్ ఆర్ లెక్కలు వేసుకుంటు న్నారు. అందుకే ఏపీలో ఏఎస్పీ పాల్ విషయం తెరమీదికి రావడం, కోర్టు ఆయనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన దరిమిలా.. రఘురామ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
This post was last modified on November 26, 2024 2:52 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…