జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. సోలార్ విద్యుత్ ఒప్పందంపై బాలినేని సంతకం పెట్టారని చెవిరెడ్డి చెబుతుండగా…చెవిరెడ్డికేం తెలుసని మాట్లాడుతున్నారని బాలినేని ఫైర్ అయ్యారు. ఈ ఇద్దరి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఆ వ్యవహారం రాజేసిన రాజకీయ వేడి చల్లారక ముందే తాజాగా చెవిరెడ్డిపై పోక్సో కేసు నమోదైంది.
చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రావారిపాలెం మండలంలో ఓ దళిత బాలికపై రేప్ జరిగిందని చెవిరెడ్డి అసత్య ప్రచారం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో చెవిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన కుమార్తెపై అత్యాచారం జరిగిందని చెవిరెడ్డి అసత్య ప్రచారం చేశారంటూ ఆ బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. చెవిరెడ్డి కారణంగా తమ కుటుంబం తీవ్ర మానసిక వేదన అనుభవించిందని ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో, చెవిరెడ్డితో పాటు మరికొందరిపై పోలీసులు పోక్సో చట్టంతో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
అయితే, ఎన్నికలకు ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి వర్సెస్ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్న రీతిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. సినీ ఫక్కీలో గొడవలు, కొట్లాటలు, కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే చెవిరెడ్డిపై అక్రమ కేసు బనాయించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, తమకు వచ్చిన ఫిర్యాదు ప్రకారమే కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసు నేపథ్యంలో చెవిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసే అవకాశముందని తెలుస్తోంది.
ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…
నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…