జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. సోలార్ విద్యుత్ ఒప్పందంపై బాలినేని సంతకం పెట్టారని చెవిరెడ్డి చెబుతుండగా…చెవిరెడ్డికేం తెలుసని మాట్లాడుతున్నారని బాలినేని ఫైర్ అయ్యారు. ఈ ఇద్దరి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఆ వ్యవహారం రాజేసిన రాజకీయ వేడి చల్లారక ముందే తాజాగా చెవిరెడ్డిపై పోక్సో కేసు నమోదైంది.
చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రావారిపాలెం మండలంలో ఓ దళిత బాలికపై రేప్ జరిగిందని చెవిరెడ్డి అసత్య ప్రచారం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో చెవిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన కుమార్తెపై అత్యాచారం జరిగిందని చెవిరెడ్డి అసత్య ప్రచారం చేశారంటూ ఆ బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. చెవిరెడ్డి కారణంగా తమ కుటుంబం తీవ్ర మానసిక వేదన అనుభవించిందని ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో, చెవిరెడ్డితో పాటు మరికొందరిపై పోలీసులు పోక్సో చట్టంతో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
అయితే, ఎన్నికలకు ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి వర్సెస్ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్న రీతిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. సినీ ఫక్కీలో గొడవలు, కొట్లాటలు, కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే చెవిరెడ్డిపై అక్రమ కేసు బనాయించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, తమకు వచ్చిన ఫిర్యాదు ప్రకారమే కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసు నేపథ్యంలో చెవిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసే అవకాశముందని తెలుస్తోంది.
This post was last modified on November 26, 2024 12:03 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న తండేల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం గురించి చర్చ జరుగుతోంది.…
దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో రెండో వంద కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచిన సరిపోదా శనివారం అభిమానులతో…
గత నెల సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ మొదటి రోజే హెచ్డి పైరసీకి గురి కావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు…
తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…