జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. సోలార్ విద్యుత్ ఒప్పందంపై బాలినేని సంతకం పెట్టారని చెవిరెడ్డి చెబుతుండగా…చెవిరెడ్డికేం తెలుసని మాట్లాడుతున్నారని బాలినేని ఫైర్ అయ్యారు. ఈ ఇద్దరి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఆ వ్యవహారం రాజేసిన రాజకీయ వేడి చల్లారక ముందే తాజాగా చెవిరెడ్డిపై పోక్సో కేసు నమోదైంది.
చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రావారిపాలెం మండలంలో ఓ దళిత బాలికపై రేప్ జరిగిందని చెవిరెడ్డి అసత్య ప్రచారం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో చెవిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన కుమార్తెపై అత్యాచారం జరిగిందని చెవిరెడ్డి అసత్య ప్రచారం చేశారంటూ ఆ బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. చెవిరెడ్డి కారణంగా తమ కుటుంబం తీవ్ర మానసిక వేదన అనుభవించిందని ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో, చెవిరెడ్డితో పాటు మరికొందరిపై పోలీసులు పోక్సో చట్టంతో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
అయితే, ఎన్నికలకు ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి వర్సెస్ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్న రీతిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. సినీ ఫక్కీలో గొడవలు, కొట్లాటలు, కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే చెవిరెడ్డిపై అక్రమ కేసు బనాయించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, తమకు వచ్చిన ఫిర్యాదు ప్రకారమే కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసు నేపథ్యంలో చెవిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసే అవకాశముందని తెలుస్తోంది.
This post was last modified on November 26, 2024 12:03 pm
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…