Political News

‘మ‌హా’ విజ‌యంలో మోడీ రాజ‌కీయ ప్ర‌భ‌.. !

ఒక గెలుపు పార్టీకి ఎంతో బ‌లాన్నిస్తుంది. ఈ విష‌యంలో సందేహం లేదు. అయితే.. మ‌హారాష్ట్రలో బీజేపీ ద‌క్కించుకున్న సీట్లు, ఈ పార్టీ నేతృత్వంలోని మ‌హాయుతి కూట‌మి ద‌క్కించుకున్న విజ‌యం అప్ర‌తిహ‌తం. గ‌తానికి భిన్నంగా మ‌రాఠా ఓట‌ర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకొన్న తీరును విమ‌ర్శ‌కులు సైతం అగీక‌రించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. కీల‌క‌మైన మ‌రాఠా నినాదం, విద‌ర్భ ప్ర‌త్యేక రాష్ట్ర డిమాండ్‌.. దీనికి మించి ఉల్లిపాయ‌ల రైతుల ఆందోళ‌న‌లు.. వంటివి రాష్ట్రాన్ని ఇరుకున ప‌డేశాయి.

ఇంత సెగ‌లోనూ మ‌హారాష్ట్ర‌లో బీజేపీ నేతృత్వంలోని మ‌హాయుతి కూట‌మి విజ‌యం ద‌క్కించుకుంది. ఈ గెలుపు వెనుక ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ వ్యూహాలు, ఆయ‌న మాటల చ‌తుర‌త‌, రాజ‌కీయ వ్యాఖ్య‌లు వంటివి ప‌క్కాగా క‌లిసి వ‌చ్చాయ‌నే చెప్పాలి. ఈ ఏడాది జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో మ‌హారాష్ట్ర‌లో బీజేపీకి భారీ ఎదురు దెబ్బ‌తగిలింది. గెలుస్తామ‌ని ముందుగానే లెక్క‌లు వేసుకున్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఆ పార్టీ ఓడిపోయింది. దీంతో అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు.

అయితే.. శివ‌సేన‌ను చీల్చి, ఎన్సీపీని ముక్క‌లు చేసి ఏర్పాటు చేసిన ప్ర‌భుత్వం అంటూ ఆదిలోనే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇదేస‌మ‌యంలో కులగ‌ణ‌న‌, యూనిఫాం సివిల్ కోడ్, జీఎస్టీ, ధ‌ర‌ల పెరుగుద‌ల, పెట్రోల్ చార్జీల వాత‌లు ఇలా అనేక ప్ర‌తికూల ప‌వ‌నాలు కూడా క‌మ‌లాన్ని తీవ్ర సంక‌టంలోకి నెట్టాయి. దీనికి తోడు ముందుగానే ముఖ్య‌మంత్రి పీఠంపై నేత‌లు ప‌ట్టుబ‌ట్ట‌డంతోపాటు.. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కే కొంద‌రు ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో ప్ర‌చారం ఒకానొక ద‌శ‌లో కుంటుప‌డింది.

ఖ‌చ్చితంగా ఇలాంటి స‌మ‌యంలో రంగ ప్ర‌వేశం చేసిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ.. రాజ్యాంగం నుంచి రిజ‌ర్వేష‌న్ల వ‌ర‌కు.. కుల గ‌ణ‌న నుంచి కుటుంబ రాజ‌కీయాల వ‌ర‌కు అనేక అస్త్రాల‌ను ప్ర‌యోగించారు. కాంగ్రెస్ కూట‌మి అధికారంలోకి వ‌స్తే.. తండ్రి కొడుకులు ప‌ద‌వుల్లోకి వ‌స్తార‌ని, బావ బావ‌మ‌రుదులు ప‌ద వులు పంచుకుంటార‌ని ఆయ‌న కుటుంబ రాజ‌కీయాల‌ను ప్ర‌స్తావించారు. అదేస‌మ‌యంలో రాజ్యాంగం పేరుతో కాంగ్రెస్ రాజ‌కీయాలు చేస్తోంద‌న్నారు. అభివృద్ధికి ఆ పార్టీ వ్య‌తిరేక‌మ‌ని దుయ్య‌బ‌ట్టారు. మొత్తంగా మోడీ చేసిన ప్ర‌చారం కూట‌మికి ద‌న్నుగా మారింది. దీంతో ఊహించ‌ని విధంగా మ‌హారాష్ట్ర‌లో బీజేపీ కూట‌మి అధికారం ద‌క్కించుకుంది.

This post was last modified on November 23, 2024 6:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

25 minutes ago

‘పాదయాత్ర చేసినా వైఎస్ వారసులు కాలేరు’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాద‌యాత్ర…

40 minutes ago

ఈ బీజేపీ ఎంపీకి ఏమైంది?

ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…

1 hour ago

కొణిదెల నిహారిక: ఫ్రేమ్ మారినా, గ్లామర్ మాత్రం అలాగే..

యాంకర్‌గా మొదలై, హీరోయిన్‌గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…

1 hour ago

తారక్ అభిమానులు లైట్ తీసుకున్నారు

స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…

4 hours ago

బీజేపీ కేంద్ర మంత్రికి కాంగ్రెస్ ఎంపీ మద్దతు

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ…

4 hours ago