ఒక గెలుపు పార్టీకి ఎంతో బలాన్నిస్తుంది. ఈ విషయంలో సందేహం లేదు. అయితే.. మహారాష్ట్రలో బీజేపీ దక్కించుకున్న సీట్లు, ఈ పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి దక్కించుకున్న విజయం అప్రతిహతం. గతానికి భిన్నంగా మరాఠా ఓటర్లను తమవైపు తిప్పుకొన్న తీరును విమర్శకులు సైతం అగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కీలకమైన మరాఠా నినాదం, విదర్భ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్.. దీనికి మించి ఉల్లిపాయల రైతుల ఆందోళనలు.. వంటివి రాష్ట్రాన్ని ఇరుకున పడేశాయి.
ఇంత సెగలోనూ మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం దక్కించుకుంది. ఈ గెలుపు వెనుక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యూహాలు, ఆయన మాటల చతురత, రాజకీయ వ్యాఖ్యలు వంటివి పక్కాగా కలిసి వచ్చాయనే చెప్పాలి. ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీకి భారీ ఎదురు దెబ్బతగిలింది. గెలుస్తామని ముందుగానే లెక్కలు వేసుకున్న నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ ఓడిపోయింది. దీంతో అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
అయితే.. శివసేనను చీల్చి, ఎన్సీపీని ముక్కలు చేసి ఏర్పాటు చేసిన ప్రభుత్వం అంటూ ఆదిలోనే ఆరోపణలు వచ్చాయి. ఇదేసమయంలో కులగణన, యూనిఫాం సివిల్ కోడ్, జీఎస్టీ, ధరల పెరుగుదల, పెట్రోల్ చార్జీల వాతలు ఇలా అనేక ప్రతికూల పవనాలు కూడా కమలాన్ని తీవ్ర సంకటంలోకి నెట్టాయి. దీనికి తోడు ముందుగానే ముఖ్యమంత్రి పీఠంపై నేతలు పట్టుబట్టడంతోపాటు.. తమ తమ నియోజకవర్గాలకే కొందరు పరిమితమయ్యారు. దీంతో ప్రచారం ఒకానొక దశలో కుంటుపడింది.
ఖచ్చితంగా ఇలాంటి సమయంలో రంగ ప్రవేశం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. రాజ్యాంగం నుంచి రిజర్వేషన్ల వరకు.. కుల గణన నుంచి కుటుంబ రాజకీయాల వరకు అనేక అస్త్రాలను ప్రయోగించారు. కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే.. తండ్రి కొడుకులు పదవుల్లోకి వస్తారని, బావ బావమరుదులు పద వులు పంచుకుంటారని ఆయన కుటుంబ రాజకీయాలను ప్రస్తావించారు. అదేసమయంలో రాజ్యాంగం పేరుతో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందన్నారు. అభివృద్ధికి ఆ పార్టీ వ్యతిరేకమని దుయ్యబట్టారు. మొత్తంగా మోడీ చేసిన ప్రచారం కూటమికి దన్నుగా మారింది. దీంతో ఊహించని విధంగా మహారాష్ట్రలో బీజేపీ కూటమి అధికారం దక్కించుకుంది.
This post was last modified on November 23, 2024 6:16 pm
సినీ రంగంలో ఒకరు చేయాల్సిన పాత్ర ఇంకొకరికి వెళ్లడం చాలా కామన్ విషయం. కొన్నిసార్లు కొందరు ఆర్టిస్టులను ఎంచుకుని, వారు…
కొన్ని కార్యక్రమాల వేళ.. కొన్ని అంశాలకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారీ…
తెలుగుదేశం పార్టీ నేతలకు సీఎం, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు మీ…
గత వారం రోజులకు పైగా తిరుగుతున్న లీకులకు అధికారిక ముద్ర పడిపోయింది. టాక్సిక్ జూన్ 4 నుంచి వాయిదా వేస్తున్నట్టు…
నవ్యాంద్రప్రదేశ్ లో అధికార కూటమి రథ సారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో బుదవారం నుంచి నవ శకం మొదలు…
లెనిన్ గురించి అప్డేట్స్ లేక అసహనానికి గురవుతున్న అభిమానులకు ఊరట కలిగిస్తూ నాగార్జున ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్…