ఒక గెలుపు పార్టీకి ఎంతో బలాన్నిస్తుంది. ఈ విషయంలో సందేహం లేదు. అయితే.. మహారాష్ట్రలో బీజేపీ దక్కించుకున్న సీట్లు, ఈ పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి దక్కించుకున్న విజయం అప్రతిహతం. గతానికి భిన్నంగా మరాఠా ఓటర్లను తమవైపు తిప్పుకొన్న తీరును విమర్శకులు సైతం అగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కీలకమైన మరాఠా నినాదం, విదర్భ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్.. దీనికి మించి ఉల్లిపాయల రైతుల ఆందోళనలు.. వంటివి రాష్ట్రాన్ని ఇరుకున పడేశాయి.
ఇంత సెగలోనూ మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం దక్కించుకుంది. ఈ గెలుపు వెనుక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యూహాలు, ఆయన మాటల చతురత, రాజకీయ వ్యాఖ్యలు వంటివి పక్కాగా కలిసి వచ్చాయనే చెప్పాలి. ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీకి భారీ ఎదురు దెబ్బతగిలింది. గెలుస్తామని ముందుగానే లెక్కలు వేసుకున్న నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ ఓడిపోయింది. దీంతో అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
అయితే.. శివసేనను చీల్చి, ఎన్సీపీని ముక్కలు చేసి ఏర్పాటు చేసిన ప్రభుత్వం అంటూ ఆదిలోనే ఆరోపణలు వచ్చాయి. ఇదేసమయంలో కులగణన, యూనిఫాం సివిల్ కోడ్, జీఎస్టీ, ధరల పెరుగుదల, పెట్రోల్ చార్జీల వాతలు ఇలా అనేక ప్రతికూల పవనాలు కూడా కమలాన్ని తీవ్ర సంకటంలోకి నెట్టాయి. దీనికి తోడు ముందుగానే ముఖ్యమంత్రి పీఠంపై నేతలు పట్టుబట్టడంతోపాటు.. తమ తమ నియోజకవర్గాలకే కొందరు పరిమితమయ్యారు. దీంతో ప్రచారం ఒకానొక దశలో కుంటుపడింది.
ఖచ్చితంగా ఇలాంటి సమయంలో రంగ ప్రవేశం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. రాజ్యాంగం నుంచి రిజర్వేషన్ల వరకు.. కుల గణన నుంచి కుటుంబ రాజకీయాల వరకు అనేక అస్త్రాలను ప్రయోగించారు. కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే.. తండ్రి కొడుకులు పదవుల్లోకి వస్తారని, బావ బావమరుదులు పద వులు పంచుకుంటారని ఆయన కుటుంబ రాజకీయాలను ప్రస్తావించారు. అదేసమయంలో రాజ్యాంగం పేరుతో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందన్నారు. అభివృద్ధికి ఆ పార్టీ వ్యతిరేకమని దుయ్యబట్టారు. మొత్తంగా మోడీ చేసిన ప్రచారం కూటమికి దన్నుగా మారింది. దీంతో ఊహించని విధంగా మహారాష్ట్రలో బీజేపీ కూటమి అధికారం దక్కించుకుంది.
This post was last modified on November 23, 2024 6:16 pm
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…