అదేంటి అనుకుంటున్నారా? ఏపీని వదిలేసి సీఎం చంద్రబాబు సాహసాలు చేసేందుకు యాత్రలు పెట్టుకున్నారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారా? అయితే.. ఇది అలాంటి విన్యాసాలతో కూడిన యాత్ర కాదు. ఇది పొలిటికల్ సాహస యాత్ర, అధికార సాహస యాత్ర! తాజాగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ముందు చంద్రబాబు కూటమి ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనలు చూస్తే.. ఇది సాహసమేనని ఒప్పుకోక తప్పదు.
రెండు కీలక విషయాల్లో.. చంద్రబాబు కూటమి ప్రభుత్వం సాహసం చేసింది. వీటిని సాధిస్తే.. ఈ యాత్ర సక్సెస్ కాదు.. సూపర్ డూపర్ సక్సెస్ అయినట్టే. చంద్రబాబు ప్రభుత్వానికి, వ్యక్తిగతంగా చంద్రబాబు కూడా చిరస్థాయి పేరు కూడా దక్కనుంది. అయితే.. కేంద్రంలోని మోడీ సర్కారు ఈ ప్రతిపాదనలకు అంగీకరిస్తుందా? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీనికి కారణం.. ఈ ప్రతిపాదనలు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు సంబంధించినవి కావడం!
ఏంటా ప్రాజెక్టులు..!
1) విజయవాడలో మెట్రో రైలు నిర్మాణం పనులు. ఇది సాకారం అయితే.. రాజధాని అమరావతి నుంచి పెనమలూరు(కృష్ణా) వరకు.. అటు వైపు గుంటూరులోని కొన్ని ప్రాంతాలను కలుపుతూ.. మెట్రో పరుగులు పెట్టనుంది. ఇది విభజన చట్టంలోనే ఉండడం గమనార్హం. కానీ, నిధుల విషయంలో 60:40 భరించాలని కూడా కేంద్రం చెబుతోంది. అయితే..ఇప్పుడు కేంద్రంలో ఉన్నది కూడా తామే కాబట్టి.. మొత్తం నిధులు రూ.42 వేల కోట్లకుపైగా సొమ్మును కేంద్రమే భరించాలని చంద్రబాబు తాజాగా నివేదిక పంపించారు.
2) విశాఖ మెట్రో రైలు నిర్మాణం: ఇది ఏకంగా 32 కిలో మీటర్ల పరిధిలో నిర్మించే అతి పెద్ద ప్రాజెక్టు. ఇది విభజన చట్టం లేదు. అయినా… కేంద్రమే పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వాలని చంద్రబాబు కోరుతున్నారు. దీనిని ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించి.. ఆ మేరకు సాయం చేయాలని కోరుతున్నారు. దీనికి కూడా.. సుమారు 46 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందనితేల్చారు. ఈ రెండు ప్రతిపాదనలను తాజాగా ఢిల్లీకి పంపించారు. ఇది తేలిక విషయం కాదు. పోలవరం వంటి ప్రాజెక్టుకే 40 వేల కోట్లు ఇచ్చేందుకు చేతులు వెనక్కి తీసుకుంటున్న కేంద్రం .. మెట్రో కోసంఇంత పెద్ద మొత్తంలో ఇస్తుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇస్తే కనుక చంద్రబాబు సాహసం సక్సెస్ అయినట్టే.. రాష్ట్ర సమస్య తీరిపోయినట్టే!!
This post was last modified on November 23, 2024 6:09 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…