అదేంటి అనుకుంటున్నారా? ఏపీని వదిలేసి సీఎం చంద్రబాబు సాహసాలు చేసేందుకు యాత్రలు పెట్టుకున్నారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారా? అయితే.. ఇది అలాంటి విన్యాసాలతో కూడిన యాత్ర కాదు. ఇది పొలిటికల్ సాహస యాత్ర, అధికార సాహస యాత్ర! తాజాగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ముందు చంద్రబాబు కూటమి ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనలు చూస్తే.. ఇది సాహసమేనని ఒప్పుకోక తప్పదు.
రెండు కీలక విషయాల్లో.. చంద్రబాబు కూటమి ప్రభుత్వం సాహసం చేసింది. వీటిని సాధిస్తే.. ఈ యాత్ర సక్సెస్ కాదు.. సూపర్ డూపర్ సక్సెస్ అయినట్టే. చంద్రబాబు ప్రభుత్వానికి, వ్యక్తిగతంగా చంద్రబాబు కూడా చిరస్థాయి పేరు కూడా దక్కనుంది. అయితే.. కేంద్రంలోని మోడీ సర్కారు ఈ ప్రతిపాదనలకు అంగీకరిస్తుందా? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీనికి కారణం.. ఈ ప్రతిపాదనలు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు సంబంధించినవి కావడం!
ఏంటా ప్రాజెక్టులు..!
1) విజయవాడలో మెట్రో రైలు నిర్మాణం పనులు. ఇది సాకారం అయితే.. రాజధాని అమరావతి నుంచి పెనమలూరు(కృష్ణా) వరకు.. అటు వైపు గుంటూరులోని కొన్ని ప్రాంతాలను కలుపుతూ.. మెట్రో పరుగులు పెట్టనుంది. ఇది విభజన చట్టంలోనే ఉండడం గమనార్హం. కానీ, నిధుల విషయంలో 60:40 భరించాలని కూడా కేంద్రం చెబుతోంది. అయితే..ఇప్పుడు కేంద్రంలో ఉన్నది కూడా తామే కాబట్టి.. మొత్తం నిధులు రూ.42 వేల కోట్లకుపైగా సొమ్మును కేంద్రమే భరించాలని చంద్రబాబు తాజాగా నివేదిక పంపించారు.
2) విశాఖ మెట్రో రైలు నిర్మాణం: ఇది ఏకంగా 32 కిలో మీటర్ల పరిధిలో నిర్మించే అతి పెద్ద ప్రాజెక్టు. ఇది విభజన చట్టం లేదు. అయినా… కేంద్రమే పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వాలని చంద్రబాబు కోరుతున్నారు. దీనిని ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించి.. ఆ మేరకు సాయం చేయాలని కోరుతున్నారు. దీనికి కూడా.. సుమారు 46 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందనితేల్చారు. ఈ రెండు ప్రతిపాదనలను తాజాగా ఢిల్లీకి పంపించారు. ఇది తేలిక విషయం కాదు. పోలవరం వంటి ప్రాజెక్టుకే 40 వేల కోట్లు ఇచ్చేందుకు చేతులు వెనక్కి తీసుకుంటున్న కేంద్రం .. మెట్రో కోసంఇంత పెద్ద మొత్తంలో ఇస్తుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇస్తే కనుక చంద్రబాబు సాహసం సక్సెస్ అయినట్టే.. రాష్ట్ర సమస్య తీరిపోయినట్టే!!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…
మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో నిర్వహించిన…
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…
కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…
జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…