అదేంటి అనుకుంటున్నారా? ఏపీని వదిలేసి సీఎం చంద్రబాబు సాహసాలు చేసేందుకు యాత్రలు పెట్టుకున్నారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారా? అయితే.. ఇది అలాంటి విన్యాసాలతో కూడిన యాత్ర కాదు. ఇది పొలిటికల్ సాహస యాత్ర, అధికార సాహస యాత్ర! తాజాగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ముందు చంద్రబాబు కూటమి ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనలు చూస్తే.. ఇది సాహసమేనని ఒప్పుకోక తప్పదు.
రెండు కీలక విషయాల్లో.. చంద్రబాబు కూటమి ప్రభుత్వం సాహసం చేసింది. వీటిని సాధిస్తే.. ఈ యాత్ర సక్సెస్ కాదు.. సూపర్ డూపర్ సక్సెస్ అయినట్టే. చంద్రబాబు ప్రభుత్వానికి, వ్యక్తిగతంగా చంద్రబాబు కూడా చిరస్థాయి పేరు కూడా దక్కనుంది. అయితే.. కేంద్రంలోని మోడీ సర్కారు ఈ ప్రతిపాదనలకు అంగీకరిస్తుందా? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీనికి కారణం.. ఈ ప్రతిపాదనలు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు సంబంధించినవి కావడం!
ఏంటా ప్రాజెక్టులు..!
1) విజయవాడలో మెట్రో రైలు నిర్మాణం పనులు. ఇది సాకారం అయితే.. రాజధాని అమరావతి నుంచి పెనమలూరు(కృష్ణా) వరకు.. అటు వైపు గుంటూరులోని కొన్ని ప్రాంతాలను కలుపుతూ.. మెట్రో పరుగులు పెట్టనుంది. ఇది విభజన చట్టంలోనే ఉండడం గమనార్హం. కానీ, నిధుల విషయంలో 60:40 భరించాలని కూడా కేంద్రం చెబుతోంది. అయితే..ఇప్పుడు కేంద్రంలో ఉన్నది కూడా తామే కాబట్టి.. మొత్తం నిధులు రూ.42 వేల కోట్లకుపైగా సొమ్మును కేంద్రమే భరించాలని చంద్రబాబు తాజాగా నివేదిక పంపించారు.
2) విశాఖ మెట్రో రైలు నిర్మాణం: ఇది ఏకంగా 32 కిలో మీటర్ల పరిధిలో నిర్మించే అతి పెద్ద ప్రాజెక్టు. ఇది విభజన చట్టం లేదు. అయినా… కేంద్రమే పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వాలని చంద్రబాబు కోరుతున్నారు. దీనిని ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించి.. ఆ మేరకు సాయం చేయాలని కోరుతున్నారు. దీనికి కూడా.. సుమారు 46 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందనితేల్చారు. ఈ రెండు ప్రతిపాదనలను తాజాగా ఢిల్లీకి పంపించారు. ఇది తేలిక విషయం కాదు. పోలవరం వంటి ప్రాజెక్టుకే 40 వేల కోట్లు ఇచ్చేందుకు చేతులు వెనక్కి తీసుకుంటున్న కేంద్రం .. మెట్రో కోసంఇంత పెద్ద మొత్తంలో ఇస్తుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇస్తే కనుక చంద్రబాబు సాహసం సక్సెస్ అయినట్టే.. రాష్ట్ర సమస్య తీరిపోయినట్టే!!
This post was last modified on November 23, 2024 6:09 pm
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…