Political News

చైనాకు భారత్ స్మార్ట్షాక్…డ్రాగన్ కు చుక్కలే

కొంతకాలంగా భారత్ , చైనా ల సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. పాంగాంగ్‌, లడఖ్ సరిహద్దు ప్రాంతంలో చైనా సేనల కవ్వింపు చర్యలకు దీటుగా బదులిచ్చేందుకు భారత సైన్యం కూడా అదనపు దళాలను మోహరించింన సంగతి తెలిసిందే. డ్రాగన్ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు భారత సైన్యం కూడా భూతల, గగన తల, సముద్ర మార్గాల్లో అస్త్రశస్త్రాలను సిద్ధం చేసింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా సముద్ర తలంలో డ్రాగన్ కు చెమటలు పట్టించేందుకు భారత అమ్ముల పొదిలో స్మార్ట్గా సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో (స్మార్ట్) చేరింది. సముద్ర అంతర్భాగంలో నక్కి ఉన్న చైనా, శత్రుదేశాల సబ్ మెరైన్లను కనిపెట్టి ధ్వంసం చేసే స్మార్ట్ను ఒడిశాలోని స్పేస్ సెంటర్ నుంచి డీఆర్డీవో విజయవంతంగా ప్రయోగించింది. హిందూ మహాసముద్రంలో నక్కి ఉన్న చైనా దళాలకు చెక్ పెట్టే దిశగా భారత్ తాజాగా జరిపిన ప్రయోగం విజయవంతమైందని రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. శత్రువుల సబ్‌మెరైన్లను ఎదుర్కొనే యాంటీ సబ్‌మెరైన్ వ్యవస్థను రూపొందించే దిశగా ఇది కీలకమైన మలుపు అని అన్నారు.

సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో (స్మార్ట్) పేరిట ఈ ఆయుధ వ్యవస్థను డీఆర్డీఓ రూపొందించింది. సబ్ మెరైన్ ల ద్వారా జరిగే దాడులను నియంత్రించి, శత్రువుల సబ్ మెరైన్లపై ఆధిపత్యం పొందేందుకు కీలకమైన టార్పిడోను డీఆర్డీఓ రూపొందించింది. బాలిస్టిక్ మిసైల్, టార్పిడోలు కలిపి స్మార్ట్‌గా రూపాంతరం చెందాయి. సముద్ర జలాల్లో 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే స్మార్ట్… 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల లక్ష్యాలను ఛేదిస్తుంది.

స్మార్ట్ క్షిపణిని యుద్ద నౌకల నుంచి గానీ, సముద్రం ఒడ్డున ఉంచిన ట్రక్ పై నుంచి గానీ ప్రయోగించవచచు. సముద్రంలో దాగి ఉన్న సబ్ మెరైన్ల గుట్టు కనుగొనేంత వరకు గాలిలో ప్రయాణించే స్మార్ట్….సబ్ మెరైన్ జాడ కనిపెట్టగానే సముద్రగర్భంలోకి చొచ్చుకుపోయి టార్పిడో ద్వారా శత్రువుల సబ్ మెరైన్ పై క్షణాల్లో దాడి చేసి ధ్వంసం చేస్తుంది. అతి సమీపంగా వెళ్ళే వరకు శత్రు సబ్ మెరైన్లు ఈ టార్పిడోను గుర్తించకుండా స్మార్ట్ ను రూపొందించారు. అమెరికా, రష్యా, చైనాల తర్వాత ఈరకమైన ఆయుధ వ్యవస్థ కలిగిన దేశం భారత్ కావడం విశేషం. చైనా దగ్గరున్న టార్పిడోల సామర్థ్యం కన్నా భారత్ రూపొందించిన స్మార్ట్ టార్పిడో సామర్థ్యం చాలా ఎక్కువ. ప్రధాని మోడీ సూచన ప్రకారం యాంటి సబ్ మెరైన్ వ్యవస్థకు డీఆర్డీఓ రూపకల్పన చేస్తోంది. ఈ దిశగా చేపట్టిన ప్రయోగాల్లో స్మార్ట్ విజయవంతం అయింది.

This post was last modified on October 6, 2020 11:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆఫ్గనిస్తాన్ మాఫియాలో ‘డ్రాగన్’ మారణహోమం

దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…

1 hour ago

చిక్కుల్లో విజ‌య్‌… ఎల్‌టీటీఈ ప్ర‌భాక‌ర‌న్‌కు నివాళి!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి, టీవీకే అధిప‌తి విజ‌య్ రాజకీయ విమ‌ర్శ‌ల‌కు కేంద్రంగా మారారు. ఆయ‌న‌ను కార్న‌ర్ చేస్తూ.. బీజేపీస‌హా ఇత‌ర పార్టీలు…

2 hours ago

రాంబాబు స్థానంలో జార్జ్ కుట్టిని చూడగలరా

ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…

2 hours ago

తగ్గని జోగి దూకుడు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…

2 hours ago

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

2 hours ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

3 hours ago