Political News

బాగా ఆలస్యమైపోయింది రాహుల్!

హాథ్‌రస్‌లో దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగిందన్న ఆరోపణలు, ఆమె మృతదేహాన్ని రాత్రికిరాత్రికి పోలీసులు దహనం చేసిన తరువాత యోగి ప్రభుత్వంపై ముందెన్నడూ లేనంత విమర్శలు వచ్చాయి. ఈ దేశంలో మోదీకి, యోగి ఆదిత్యనాథ్‌కు విమర్శలు కొత్తేమీ కానప్పటికీ ఈసారి రాహుల్ గాంధీకి కాస్త మైలేజ్ రావడం.. నిన్న రాహుల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కొద్ది నిమిషాలకే యోగి ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించడంతో రాహుల్ ప్రభావం కనిపించింది.

విమర్శకులను, తన వ్యతిరేకులను పూచికపుల్లలా తీసి పడేసే యోగి కూడా ఈసారి రాహుల్ హడావుడికి కాస్త బెండ్ అయినట్లు కనిపిస్తోంది. అయితే.. రాహుల్ ఎంత హడావుడి చేసినా ఆయన దిల్లీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన నేతగానే ఇంకా కనిపిస్తున్నారు. అంతేకాదు… ఈ స్పీడు ఆయన కొనసాగిస్తారా అన్నది కూడా అనుమానమే. బిహార్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే రాహుల్ యాక్టివ్ అవుతున్నారని.. అవి పూర్తయ్యాక మళ్లీ సుప్తావస్థలోకి వెళ్లిపోతారని ఆ పార్టీ నాయకులే గుసగుసలాడుతున్న పరిస్థితి.

అంతేకాదు.. రాహుల్ మిగతా అంశాలు, దేశంలోని మిగతా ప్రాంతాల విషయంలోనూ ఇంతే దూకుడుగా కదలాలన్న మాట వినిపిస్తోంది. ముఖ్యంగా ఏపీలో ఇటీవల కాలంలో దళితులపై దాడులు చాలా తీవ్రంగా ఉన్నాయి. కలచివేసే ఘటనలు జరిగాయి. యూపీలో అత్యాచారం చిన్నవిషయం కాదు.. నిజమే.. కానీ, ఏపీలోనూ దళితులకు ఘోర అవమానాలు జరిగాయి. శిరో ముండనాలు జరిగాయి.. అత్యాచారాలు జరిగాయి.. దాడులు జరిగాయి.. డాక్టరైనా, జడ్జి అయినా కూడా దళితులు దాడులకు గురయ్యారు.

డాక్టర్ సుధాకర్, జడ్జి రామకృష్ణలకు ఏమైందో.. ఏమవుతుందో తెలిసిందే. విశాఖ, రాజమండ్రిలో దళితులకు శిరోముండనాలు చేశారు. మరి.. ఇవేమీ రాహుల్ గాంధీకి ఎందుకు కనిపించలేదు. ప్రియాంకా గాంధీకి ఇవేమీ ఎందుకు పట్టలేదు. ఏపీలో పార్టీకి ఇప్పుడిప్పుడే అవకాశాలు లేవనా… లేదంటే ఎన్నికలేవీ ఇప్పట్లో లేవనా? లేదంటే అందరు ఉత్తరాది నాయకుల్లాగే దక్షిణాది అంటే చిన్నచూపా? రాహుల్, ప్రియాంకలు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

హాథ్‌రస్ కేసుతో రాహుల్ గాంధీకి ఎంత మైలేజీ వచ్చినా కూడా ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది. రాహుల్ అనే నాయకుడిని సొంత పార్టీవారే లెక్క చేయని పరిస్థితి ఇప్పటికే వచ్చేసింది. ఇటీవల ఆ పార్టీ సీనియర్లు రాసిన లేఖే దానికి ఉదాహరణ. కరోనా వైరస్ లాక్‌డౌన్‌లో మోదీ వ్యతిరేక ఆర్థికవేత్తలను పెట్టుకుని జూమ్ ఇంటర్వ్యూలు చేసినా జనంలోకి వెళ్లలేదు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేస్తున్నా రాహుల్ ప్రకటనలకే పరిమితమవుతున్నారు కానీ కార్యక్షేత్రంలోకి రాలేకపోతున్నారు. హాథ్‌రస్ హడావుడితో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చినా ఇప్పటికే చాలా ఆలస్యమైపోయిందని కాంగ్రెస్ నేతలే అంటున్నారు.

This post was last modified on October 6, 2020 9:03 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

యార్ల‌గ‌డ్డ స‌త్తా చాటుకున్నారే

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు.. స‌త్తా చాటుకున్నారు. సాధార‌ణ అభివృద్ధి ప‌నుల‌తో పాటు.. ఎవ‌రూ ఊహించ‌ని…

6 minutes ago

శర్వానంద్ కష్టాన్ని ప్రేక్షకులు గుర్తించారా

నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…

24 minutes ago

ఓపెనింగ్ టాక్…. డామినేషన్ ఎవరిది?

నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…

43 minutes ago

మహిళా కమిషన్ నుండి ఎమ్మెల్యే టికెట్ వైపు?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ ప‌ర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…

2 hours ago

సునీల్ వ‌ర్సెస్ RRR.. మ‌రింత ముదిరిందిగా!

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్ర‌స్తుతం స‌స్పెన్ష‌న్‌లో ఉన్న సునీల్‌కు రఘురామకు…

6 hours ago

`న‌వ` నాయ‌కులు… టీడీపీకి ప్ల‌స్సా-మైన‌స్సా.. !

టీడీపీలో నాయ‌కులు.. చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే మెలుగుతున్నారా?  ఆయ‌న చెప్పిన‌ట్టే చేస్తున్నారా? అంటే.. మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…

9 hours ago