Political News

జ‌గ‌న్ కు క్యూసెక్కుల‌కు, టీఎంసీల‌కు తేడా తెలీదు

జ‌గ‌న్ కు ఆ ఛాన్స్ ఇవ్వం. మేమే పూర్తి చేస్తాం అంటూ.. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అసెంబ్లీలో ప్ర‌క‌టించారు. త‌మ్ముడి మ‌ర‌ణం త‌ర్వాత‌.. తొలిసారి అసెంబ్లీకి వ‌చ్చిన ఆయ‌న మంగ‌ళ‌వారం స‌భ‌లో చేప‌ట్టిన సాగునీట ప్రాజెక్టుల‌పై చ‌ర్చ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. పోల‌వ‌రం ప్రాజెక్టునుతామే పూర్తి చేస్తామ‌ని ఈ స‌మయంలో చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. జ‌గ‌న్‌కు ఆ అవ‌కాశం ఇచ్చేది లేద‌న్నారు. అదే స‌మ‌యంలో పోల‌వ‌రం ఎత్తును కూడా త‌గ్గించ‌కుండా నిర్ణీత 45.72 మీట‌ర్ల చొప్పునే నిర్మిస్తామ‌న్నారు.

జ‌గ‌న్ కు క్యూసెక్కుల‌కు, టీఎంసీల‌కు తేడా తెలియ‌ద‌ని చంద్ర‌బాబు ఎద్దేవా చేశారు. ఒక్క జ‌గ‌న్‌కే కాదు.. అధ్య‌క్షా.. గ‌తంలో మంత్రులుగా చేసిన వారికి కూడా టీఎంసీకి, క్యూసెక్కుల‌కు తేడా తెలీదు అని ఎద్దేవా చేశారు. గ‌తంలో పోల‌వ‌రం గ‌రించి స‌భ‌లో అడిగితే.. హేళ‌న‌గా మాట్లాడార‌ని గ‌తాన్ని గుర్తు చేశారు. వైసీపీ హ‌యాంలో పోల‌వ‌రం ప‌నులు జ‌రిగాయ‌ని.. అయితే.. అది 3.08 శాతం ప‌నులే జ‌రిగాయ‌ని చెప్పారు. తమ గ‌త హ‌యాంలో రూ.16,493 కోట్లు ఖర్చు చేశామని సీఎం తెలిపారు. కానీ, త‌మ తండ్రి ప్రాజెక్టుగా చెప్పుకొనే జ‌గ‌న్‌.. త‌న‌పాల‌నా కాలంలో కేవ‌లం 4099 కోట్లు మాత్ర‌మే విదిలించార‌ని వివ‌రించారు.

కేంద్రం నిధులు ఇస్తున్న‌ట్టు చంద్రాబు చెప్పారు. పోల‌వ‌రాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్ర‌క‌టించింద‌ని, దీంతో వ‌చ్చే రెండేళ్ల‌లో 12 వేల కోట్ల‌కుపైగా సొమ్ములు రానున్నాయ‌ని.. కూట‌మి ప్ర‌భుత్వం ఈ విష‌యంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని చంద్ర‌బాబు చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి విడ‌త‌ల వారీగా పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామ‌ని చంద్ర‌బాబు వివ‌రించారు. వ‌చ్చే నెల‌లోనే ప‌నులు ప్రారంభం అవుతాయ‌ని, జ‌న‌వ‌రి నుంచి డ‌యాఫ్రం వాల్ నిర్మాణం మొద‌ల‌వుతుంద‌న్నారు. ఇది 2026 నాటికి, పూర్తి ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి అవుతాయ‌ని స‌భ‌లో పేర్కొన్నారు.

This post was last modified on November 19, 2024 10:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

19 minutes ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

36 minutes ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

1 hour ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

2 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

2 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

3 hours ago