Political News

జ‌గ‌న్ కు క్యూసెక్కుల‌కు, టీఎంసీల‌కు తేడా తెలీదు

జ‌గ‌న్ కు ఆ ఛాన్స్ ఇవ్వం. మేమే పూర్తి చేస్తాం అంటూ.. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అసెంబ్లీలో ప్ర‌క‌టించారు. త‌మ్ముడి మ‌ర‌ణం త‌ర్వాత‌.. తొలిసారి అసెంబ్లీకి వ‌చ్చిన ఆయ‌న మంగ‌ళ‌వారం స‌భ‌లో చేప‌ట్టిన సాగునీట ప్రాజెక్టుల‌పై చ‌ర్చ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. పోల‌వ‌రం ప్రాజెక్టునుతామే పూర్తి చేస్తామ‌ని ఈ స‌మయంలో చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. జ‌గ‌న్‌కు ఆ అవ‌కాశం ఇచ్చేది లేద‌న్నారు. అదే స‌మ‌యంలో పోల‌వ‌రం ఎత్తును కూడా త‌గ్గించ‌కుండా నిర్ణీత 45.72 మీట‌ర్ల చొప్పునే నిర్మిస్తామ‌న్నారు.

జ‌గ‌న్ కు క్యూసెక్కుల‌కు, టీఎంసీల‌కు తేడా తెలియ‌ద‌ని చంద్ర‌బాబు ఎద్దేవా చేశారు. ఒక్క జ‌గ‌న్‌కే కాదు.. అధ్య‌క్షా.. గ‌తంలో మంత్రులుగా చేసిన వారికి కూడా టీఎంసీకి, క్యూసెక్కుల‌కు తేడా తెలీదు అని ఎద్దేవా చేశారు. గ‌తంలో పోల‌వ‌రం గ‌రించి స‌భ‌లో అడిగితే.. హేళ‌న‌గా మాట్లాడార‌ని గ‌తాన్ని గుర్తు చేశారు. వైసీపీ హ‌యాంలో పోల‌వ‌రం ప‌నులు జ‌రిగాయ‌ని.. అయితే.. అది 3.08 శాతం ప‌నులే జ‌రిగాయ‌ని చెప్పారు. తమ గ‌త హ‌యాంలో రూ.16,493 కోట్లు ఖర్చు చేశామని సీఎం తెలిపారు. కానీ, త‌మ తండ్రి ప్రాజెక్టుగా చెప్పుకొనే జ‌గ‌న్‌.. త‌న‌పాల‌నా కాలంలో కేవ‌లం 4099 కోట్లు మాత్ర‌మే విదిలించార‌ని వివ‌రించారు.

కేంద్రం నిధులు ఇస్తున్న‌ట్టు చంద్రాబు చెప్పారు. పోల‌వ‌రాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్ర‌క‌టించింద‌ని, దీంతో వ‌చ్చే రెండేళ్ల‌లో 12 వేల కోట్ల‌కుపైగా సొమ్ములు రానున్నాయ‌ని.. కూట‌మి ప్ర‌భుత్వం ఈ విష‌యంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని చంద్ర‌బాబు చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి విడ‌త‌ల వారీగా పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామ‌ని చంద్ర‌బాబు వివ‌రించారు. వ‌చ్చే నెల‌లోనే ప‌నులు ప్రారంభం అవుతాయ‌ని, జ‌న‌వ‌రి నుంచి డ‌యాఫ్రం వాల్ నిర్మాణం మొద‌ల‌వుతుంద‌న్నారు. ఇది 2026 నాటికి, పూర్తి ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి అవుతాయ‌ని స‌భ‌లో పేర్కొన్నారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

5 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

7 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

9 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

10 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

10 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

10 hours ago