టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల కేసు నమోదైన సంగతి తెలిసిందే. వైసీపీ సానుభూతిపరుడిగా ముద్రపడిన వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎక్స్ లో చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి, పవన్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు నమోదైంది. నవంబర్ 19వ తేదీన విచారణకు హాజరుకావాలని వర్మకు పోలీసులు 41-ఏ నోటీసులు ఇచ్చారు. కానీ, ఈ రోజు విచారణకు వర్మ గైర్హాజరైన వైనం హాట్ టాపిక్ గా మారింది.
షూటింగ్ ఉన్న కారణంగా తాను ఈ రోజు విచారణకు హాజరు కాలేకపోతున్నానని పోలీసులకు వర్మ వాట్సాప్ మెసేజ్ పంపించడం చర్చనీయాంశమైంది. తాను విచారణకు రావడం లేదని ఈ కేసు విచారణ అధికారిగా ఉన్న ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబుకు వర్మ నేరుగా వాట్సాప్ మెసేజ్ చేశారు. ముందుగా ఏర్పాటు చేసుకున్న షూటింగ్ ల వల్లే ఈ రోజు విచారణకు హాజరుకాలేకపోతున్నానని, తనకు వారం రోజులు పాటు గడువు ఇవ్వాలని వర్మ కోరారు.
ఈ క్రమంలోనే తన లాయర్ శ్రీనివాసరావు ద్వారా సీఐ శ్రీకాంత్ బాబుకు వర్మ విజ్ఞప్తి లేఖ పంపించారు. వర్మ విజ్ఞప్తిని పరిశీలించి స్పందిస్తామని పోలీసులు చెప్పారు. అంతకుముందు వర్మకు హైదరాబాద్ వెళ్లి ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వర్మపై మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే వర్మపై ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
This post was last modified on November 19, 2024 5:04 pm
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…