టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల కేసు నమోదైన సంగతి తెలిసిందే. వైసీపీ సానుభూతిపరుడిగా ముద్రపడిన వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎక్స్ లో చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి, పవన్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు నమోదైంది. నవంబర్ 19వ తేదీన విచారణకు హాజరుకావాలని వర్మకు పోలీసులు 41-ఏ నోటీసులు ఇచ్చారు. కానీ, ఈ రోజు విచారణకు వర్మ గైర్హాజరైన వైనం హాట్ టాపిక్ గా మారింది.
షూటింగ్ ఉన్న కారణంగా తాను ఈ రోజు విచారణకు హాజరు కాలేకపోతున్నానని పోలీసులకు వర్మ వాట్సాప్ మెసేజ్ పంపించడం చర్చనీయాంశమైంది. తాను విచారణకు రావడం లేదని ఈ కేసు విచారణ అధికారిగా ఉన్న ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబుకు వర్మ నేరుగా వాట్సాప్ మెసేజ్ చేశారు. ముందుగా ఏర్పాటు చేసుకున్న షూటింగ్ ల వల్లే ఈ రోజు విచారణకు హాజరుకాలేకపోతున్నానని, తనకు వారం రోజులు పాటు గడువు ఇవ్వాలని వర్మ కోరారు.
ఈ క్రమంలోనే తన లాయర్ శ్రీనివాసరావు ద్వారా సీఐ శ్రీకాంత్ బాబుకు వర్మ విజ్ఞప్తి లేఖ పంపించారు. వర్మ విజ్ఞప్తిని పరిశీలించి స్పందిస్తామని పోలీసులు చెప్పారు. అంతకుముందు వర్మకు హైదరాబాద్ వెళ్లి ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వర్మపై మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే వర్మపై ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…