Political News

విచారణకు రావడం లేంటూ వర్మ వాట్సాప్ మెసేజ్

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల కేసు నమోదైన సంగతి తెలిసిందే. వైసీపీ సానుభూతిపరుడిగా ముద్రపడిన వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎక్స్ లో చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి, పవన్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు నమోదైంది. నవంబర్ 19వ తేదీన విచారణకు హాజరుకావాలని వర్మకు పోలీసులు 41-ఏ నోటీసులు ఇచ్చారు. కానీ, ఈ రోజు విచారణకు వర్మ గైర్హాజరైన వైనం హాట్ టాపిక్ గా మారింది.

షూటింగ్ ఉన్న కారణంగా తాను ఈ రోజు విచారణకు హాజరు కాలేకపోతున్నానని పోలీసులకు వర్మ వాట్సాప్ మెసేజ్ పంపించడం చర్చనీయాంశమైంది. తాను విచారణకు రావడం లేదని ఈ కేసు విచారణ అధికారిగా ఉన్న ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబుకు వర్మ నేరుగా వాట్సాప్ మెసేజ్ చేశారు. ముందుగా ఏర్పాటు చేసుకున్న షూటింగ్ ల వల్లే ఈ రోజు విచారణకు హాజరుకాలేకపోతున్నానని, తనకు వారం రోజులు పాటు గడువు ఇవ్వాలని వర్మ కోరారు.

ఈ క్రమంలోనే తన లాయర్ శ్రీనివాసరావు ద్వారా సీఐ శ్రీకాంత్ బాబుకు వర్మ విజ్ఞప్తి లేఖ పంపించారు. వర్మ విజ్ఞప్తిని పరిశీలించి స్పందిస్తామని పోలీసులు చెప్పారు. అంతకుముందు వర్మకు హైదరాబాద్ వెళ్లి ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వర్మపై మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే వర్మపై ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

This post was last modified on November 19, 2024 5:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

3 hours ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

7 hours ago

మహేష్ రన్నింగ్ స్టైల్ మార్చడమేంటి జక్కన్నా?

తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…

9 hours ago

దురంధర్ VS విశ్వరూపం – ఎందుకీ రచ్చ?

ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…

9 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

11 hours ago

టార్గెట్ వైసీపీ… బాబు-ప‌వ‌న్ రచిస్తున్న వ్యూహం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు సుమారు గంట‌కుపైగా చ‌ర్చ‌లు జ‌రిపారు. బుధ‌వారం ఉద‌యం ఉండ‌వ‌ల్లిలోని ముఖ్య‌మంత్రి నివాసానికి…

11 hours ago