టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల కేసు నమోదైన సంగతి తెలిసిందే. వైసీపీ సానుభూతిపరుడిగా ముద్రపడిన వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎక్స్ లో చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి, పవన్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు నమోదైంది. నవంబర్ 19వ తేదీన విచారణకు హాజరుకావాలని వర్మకు పోలీసులు 41-ఏ నోటీసులు ఇచ్చారు. కానీ, ఈ రోజు విచారణకు వర్మ గైర్హాజరైన వైనం హాట్ టాపిక్ గా మారింది.
షూటింగ్ ఉన్న కారణంగా తాను ఈ రోజు విచారణకు హాజరు కాలేకపోతున్నానని పోలీసులకు వర్మ వాట్సాప్ మెసేజ్ పంపించడం చర్చనీయాంశమైంది. తాను విచారణకు రావడం లేదని ఈ కేసు విచారణ అధికారిగా ఉన్న ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబుకు వర్మ నేరుగా వాట్సాప్ మెసేజ్ చేశారు. ముందుగా ఏర్పాటు చేసుకున్న షూటింగ్ ల వల్లే ఈ రోజు విచారణకు హాజరుకాలేకపోతున్నానని, తనకు వారం రోజులు పాటు గడువు ఇవ్వాలని వర్మ కోరారు.
ఈ క్రమంలోనే తన లాయర్ శ్రీనివాసరావు ద్వారా సీఐ శ్రీకాంత్ బాబుకు వర్మ విజ్ఞప్తి లేఖ పంపించారు. వర్మ విజ్ఞప్తిని పరిశీలించి స్పందిస్తామని పోలీసులు చెప్పారు. అంతకుముందు వర్మకు హైదరాబాద్ వెళ్లి ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వర్మపై మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే వర్మపై ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
This post was last modified on November 19, 2024 5:04 pm
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…