Political News

కూట‌మి క‌ల‌కాలం.. తేల్చేసిన చంద్ర‌బాబు!

క్షేత్ర‌స్థాయిలో టీడీపీ నాయ‌కుల‌కు, ఎన్డీయే కూట‌మిలో ఉన్న జ‌న‌సేన‌, బీజేపీ నాయ‌కుల‌కు మ‌ధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కార‌ణాలు ఏవైనా.. నాయ‌కులు మాత్రం నిప్పులు చెరుక్కుంటు న్నారు. కూట‌మి నేత‌లు త‌మ ప‌దవులు త‌న్నుకు పోతున్నార‌ని టీడీపీ నాయ‌కులు, టీడీపీ నాయ‌కుల వ‌ల్లే త‌మ‌కు పద‌వులు రాకుండా ఉంటున్నాయ‌ని ఇత‌ర పార్టీల నాయ‌కులు ఉసూరు మంటున్నారు. దీంతో క‌లివిడి క‌న్నా విడివిడి రాజ‌కీయాలే ఏపీలో క్షేత్ర‌స్థాయిలో క‌నిపిస్తున్నాయి.

ఇలాంటి స‌మ‌యంలో అంద‌రూ క‌లిసిమెలిసి ఉండాల‌ని టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు పదే ప‌దే చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. కొంద‌రు త‌మ్ముళ్లు మాత్రం ఎవ‌రి దారి వారిదే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఖ‌చ్చితంగా ఇలాంటి స‌మ‌యంలోనే చంద్ర‌బాబు జాతీయ వేదిక‌గా.. బీజేపీ+టీడీపీ+జ‌న‌సేన కూట‌మిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎవ‌రు ఎలాంటి ప‌నులు చేసినా.. తాము మాత్రం క‌లిసే ముందుకు సాగుతామ‌న్నారు.

కూట‌మి పార్టీలుగా భ‌విష్య‌త్తుపై ఎంతో ఉత్సాహంతో ప‌నిచేస్తున్న‌ట్టు చెప్పారు. తాము వ‌చ్చే 2029 లేదా జ‌మిలి ఎన్నిక‌లు ఏది వ‌చ్చినా.. క‌లివిడిగానే ఎన్నిక‌ల‌కు వెళ్తామ‌ని తేల్చి చెప్పారు. “మ‌మ్మ‌ల్ని విడ‌దీసేందుకు అనేక మంది ప్ర‌య‌త్నం చేస్తుండ‌వ‌చ్చు. కానీ, మేం మాత్రం క‌లిసే ఉన్నాం. క‌లిసే ముందుకు సాగుతాం. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను లెక్క‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు“ అని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.

దీంతో క్షేత్ర‌స్థాయిలో త‌మ్ముళ్లు-ఇత‌ర పార్టీల నాయ‌కుల‌కు ప‌రోక్షంగా చంద్ర‌బాబు క‌లివిడి రాజ‌కీయాల పై స్ప‌ష్టత ఇచ్చారు. దీనిపై వారే తేల్చుకోవాల్సి ఉంటుంది. ప్ర‌ధాన పార్టీలు మాత్రం క‌లిసిమెలిసే రాజ‌కీయాలు చేసుకుంటాయ‌ని ఆయ‌న కుండ‌బ‌ద్దలు కొట్టారు. సో.. దీనిని బ‌ట్టి.. క్షేత్ర‌స్థాయిలోనూ నాయ‌కులు క‌లిసి మెలిసి ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. లేక‌పోతే.. వారే మారిపోయే ప‌రిస్థితి ఎదురు కావ‌డం త‌థ్యం. మ‌రి త‌మ్ముళ్లు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోచూడాలి.

This post was last modified on November 17, 2024 9:30 am

Share

Recent Posts

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

12 minutes ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

29 minutes ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

4 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

12 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

13 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

14 hours ago